కంభం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 40:
ది కంభం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ తో పాటు పలు ప్రభుత్వరంగ బ్యాంకులు సేవలందిస్తున్నాయి.
 
==గ్రామానికి వ్యవసాయం మరియు, సాగునీటి సౌకర్యం==
 
===కంభం చెరువు===
చారిత్రక [[కంభం చెరువు]] 15 వ శతాబ్దంలో ఒరిస్సా గజపతి రాజులు నిర్మించారు మరియు, తరువాత విస్తృతంగా విజయనగర రాజవంశం 16వ శతాబ్దము తొలి రోజులలో విజయనగర చక్రవర్తి [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవరాయల]] విజయనగర రాజవంశం యొక్క రాణి వరదరాజ(జగన్మోహిని రాణి) పరిపాలనా కాలములో కట్టించినారని భావిస్తారు. [[గుండ్లకమ్మ]] మరియు, జంపాలేరు నుండి పారే ఒక యేరు ఈ చెరువుకు నీటిని సమృద్ధిగా తెచ్చి రైతులు వరి మరియు, పసుపు, చెరుకు, అరటికాయలు మొదలైన వాణిజ్య పంటలు పండించుటకు వీలు కల్పిస్తున్నది. వర్షపు నీరే ఈ [[చెరువు]] యొక్క ఏకైక ఆధారము.20 వ శతాబ్దం మొదట్లో ఆనకట్ట ఎత్తు 57 అడుగుల (17 మీటర్లు) మరియు, డ్రైనేజీ ప్రాంతం 430 చదరపు మైళ్ల (1,100 కిమీ 2) ఉండేది. ప్రత్యక్ష నీటి పారుదల భూమి 10,300 ఎకరాలు (42 km 2) ఉండేది. ఈ చెరువు యొక్క ఆయకట్టు [[కంభం మండలం|కంభం]], [[బేస్తవారిపేట|బెస్తవారిపేట]] మండలములలో విస్తరించి ఉంది. ఈ చెరువు 23.95 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి, 3 TMC ల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. చెరువులో ఏడు కొండలున్నాయి. ఈ చెరువు పరిసరాల్లోని వంద గ్రామాల [[వ్యవసాయదారుడు|రైతు]]లకు నీరందిస్తుంది. పరీవాహక ప్రాంతము యొక్క విస్తీర్ణము 6,944 హెక్టారులు. ఈ చెరువు 1917, 1949, 1950, 1953, 1956, 1966, 1975, 1983, 1996 మరియు, 2005 సంవత్సరాలలో పూర్తిగా నిండినట్లు చెబుతారు.
 
చెరువు 1,113 కిలోమీటర్ల పరీవాహక ప్రాంతాన్ని,23.95 చదరపు కిలోమీటర్ల నీటి నిల్వ ప్రాంతాన్ని కలిగి ఉంది. జలాశయ పూర్తి నీటి మట్టం 203.20 మీటర్లు కాగా, గరిష్ఠ నీటి మట్టం 204.10 మీటర్లు. చెరువు [[ఆనకట్ట]] పొడవు 295.65 మీటర్లు కాగా, ఎత్తు 18.29 మీటర్లు, అలుగు పొడుగు 89.40 మీటర్లు. చెరువు నీరు పెద్ద కంభం కాలువ, చిన్న కంభం కాలువ, చితిరలకట్ట, నక్కల గండి కాలువ, పాపాయిపల్లి కాలువ ద్వారా దాదాపు 25 గ్రామాలకు చెందిన పొలాలకు చేరుతుంది. పెద్ద కంభం కాలువ 32 తుములతో 7.2 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. దీనికింద మూడు వేల ఎకరాల ఆయకట్టు ఉంది.
 
== రాజకీయాలు ==
పట్టణం ఆంధ్ర ప్రదేశ్. 2009 వరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంది . కంబం నియోజకవర్గం పునర్వ్యవస్థీకరించారు మరియు, గిద్దలూరు నియోజకవర్గంలో విలీనం చేశారు.
 
==గ్రామ పంచాయతీ==
పంక్తి 73:
*[[ త్యాగరాజు]] (1767 మే 4 - 1847 జనవరి 6) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగ రాజస్వామి వారిలో మూర్తీభవించాయి.త్యాగరాజు ప్రస్తుత కంభం మండలంలో కాకర్ల అను గ్రామంలో తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో 1767 లో జన్మించాడు. త్యాగరాజు కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం కాకర్ల త్యాగ బ్రహ్మం వీరు మురిగినాడు తెలుగు బ్రాహ్మణులు.త్రిలింగ వైదీకులు. ఇతడి పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం మండలంలో [[కాకర్ల]] అను గ్రామం నుండి తమిళ దేశానికి వలస వెళ్లారు.
*పూల సుబ్బయ్య వీరు కంభంలో జన్మించారు. 1952లో కంభం పంచాయతీకి వార్డు సభ్యులుగా పోటీచేసి ఓడిపోయినారు. అప్పుడు మార్కాపురానికి మకాం మార్చి, న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి, తిరిగి ఆరు సంవత్సరాల తరువాత, రాజకీయాలలోకి వచ్చి, యర్రగొండపాలెం శాసనసభకు సి.పి.ఐ.అభ్యర్థిగా పోటీచేసి, మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. అదే స్థానంలో 1967 లోనూ, 1978లోనూ, [[మార్కాపురం]] నుండి శాసనసభ్యులుగా ఎన్నికైనారు. వరుస కరువు కాటకాలతో కుదేలవుచున్న అన్నదాతల చింతలు తీర్చేటందుకు, వెలిగొండ ప్రాజెక్టు మాత్రమే పరిష్కారమని తలచి, ప్రజా పోరాటాల ద్వారా ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసారు . ఫలితంగా మూడు జిల్లాల వరదాయిని, "వెలుగొండ ప్రాజక్టు" నిర్మాణానికి అడుగులు పడినవి. ఆయన సేవలకు గుర్తుగా ప్రభుత్వం, ఈ జలాశయానికి "పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు" అని నామకరణం చేసింది. <ref> ఈనాడు ప్రకాశం; 2017,జూన్-12; 4వపేజీ. </ref>
*స్వతంత్రం వచ్చినతరువాత నెహ్రుా గారి  పరిపాలనలో కరణాలని నియమించడం జరిగింది. అనగ 1955 నుంది 1990 వరకు కంభం మరియు, చుట్టుపక్కన పలుగ్రామాలకి "'''ఆకవీటి బాల క్రిష్నమూర్తి గారు'''" కరణంగా పనిచేసి ఎన్నో గ్రామాలకి తమ సహయ సహకారలని అందచేశారు.వారి సేవలని మెచ్చి బ్రిటిష్ మరియు, భారత ప్రభుత్వం నుండి పలు సత్కారాలు పొందినారు.
*కంభం పట్టణానికి చెందిన నిట్టూరి సుబ్బారావు, 2014,డిసెంబరు-22వ తేదీన, విశాఖపట్నంలోని కళా భారతిలో నిర్వాహకులనుండి, "ఆంధ్రరత్నం" బిరుదును అందుకున్నారు. వీరు సంగీతాభివృద్ధికి విశేషకృషి చేస్తున్నారు. <ref>sakshi ప్రకాశం; 2017,జూన్-20; 5వపేజీ.</ref>
#జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కవులు, శాస్త్రవేత్తలలో త్యాగరాజస్వామి తాత గిరిరాజ కవి , పరవస్తు వెంకయ్యసూరి (శచీదేవి కావ్యరచయిత), చలువాది వెంకట సుబ్రమణ్యం (రసాయనిక శాస్త్రవేత్త) మొదలైనవారు ఆ జాబితాలో ఉన్నారు. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన [[శ్యామశాస్త్రి]], ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు ఇక్కడి వారేనని తెలిసింది.
"https://te.wikipedia.org/wiki/కంభం" నుండి వెలికితీశారు