తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో "మరియు" ల తొలగింపు ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 34:
}}
'''తిరుపతి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[చిత్తూరు]] జిల్లాలో ఉన్న ఒక నగరము
{{maplink|frame=yes|zoom=12|frame-width=512|frame-height=512}}
==చరిత్ర==
పంక్తి 40:
[[రామానుజాచార్యుడు|రామానుజాచార్యులు]] కొండ కింద [[గోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి|గోవిందరాజస్వామి ఆలయాన్ని]] ఏర్పాటుచేయడంతో తిరుమల చరిత్రకు బీజం పడింది. తన శిష్యుడైన యాదవరాజును రామానుజులు ప్రోత్సహించి అప్పటికే ఉన్న చెరువు పక్కన ఆలయ నిర్మాణం ప్రారంభించేలా చేశారు. యాదవరాజు దేవాలయాన్ని నిర్మించడం పూర్తయ్యాకా క్రమంగా చుట్టూ అగ్రహారాన్ని నిర్మించి దానికి తన గురువు పేరిట ''[[రామానుజపురం (గంభీరావుపేట్)|రామానుజపురం]]'' అని నామకరణం చేశారు. రామానుజపురమే కాక యాదవరాజు చాలా గృహాలు నిర్మించారు. [[శ్రీశైలపూర్ణుడు]], [[అనంతాచార్యులు]] వంటి భక్తులకు నివాసాలు ఏర్పాటుచేశారు. దేవాలయానికి తూర్పున ధాన్యాగారం, వాయువ్యదిశలో అంగడి వీధి నిర్మించి నేటి తిరుపతి నగరానికి ఆనాడు పునాదివేశారు.<ref name="తిరుమల చరితామృతం 57">తిరుమల చరితామృతం:పి.వి.ఆర్.కె.ప్రసాద్:ఎమెస్కో బుక్స్:2013:పేజీ 57</ref>
==శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం==
శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ప్రాచీనతకు చాలా సాహిత్యపరమైన ఆధారాలు, శాసనాధారాలు ఉన్నాయి. విజయనగర చక్రవర్తి [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవరాయలు]] తిరుపతి వేంకటేశ్వరస్వామిని చాలా మార్లు దర్శించుకొని కానుకలు సమర్పించాడు. [[చంద్రగిరి]] కోట నుంచి [[తిరుమల]] గిరుల పైకి చేరుకోవటానికి అతి సమీప కాలి మార్గమైన [[శ్రీ వారి మెట్టు]] ద్వారా [[శ్రీ కృష్ణదేవ రాయలు]] తరచూ స్వామి దర్శనమునకు డోలీపై వెళ్ళేవాడు. 9వ శతాబ్దంలో [[కాంచీపురము|కాంచీపురాన్ని]] పరిపాలించిన [[పల్లవులు]], ఆ తరువాతి శతాబ్దపు [[తంజావూరు]] [[చోళులు]], [[మదురై]]ని పరిపాలించిన [[పాండ్యులు]], [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్య]] చక్రవర్తులు, సామంతులు ఈ వేంకటేశ్వరస్వామి భక్తులై కొలిచారు. ఒకరిని మించి మరొకరు పోటీపడి ఆలయనిర్వహణకు, సేవలకు దానధర్మాలు చేశారు. విజయనగర సామ్రాజ్య పరిపాలనలో ఆలయానికి చాలా సంపద చేకూరింది. శ్రీ కృష్ణదేవరాయలు తన ఇద్దరు భార్యల విగ్రహాలను, తన విగ్రహాన్ని, ఆలయ మండపం పై ప్రతిష్ఠింపజేశాడు. ప్రధాన ఆలయంలో [[వేంకటపతి రాయలు|వేంకటపతి రాయల]] విగ్రహం కూడా ఉంది. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత, దేశం నలుమూలల ఉన్న చాలామంది చిన్న నాయకులు, ధనవంతులు దేవాలయాన్ని పోషించి కానుకలు బహూకరించడం కొనసాగించారు. [[మరాఠీ భాష|మరాఠీ]] సేనాని, [[రాఘోజీ భోంస్లే]] ఆలయాన్ని సందర్శించి గుడిలో నిత్య పూజా నిర్వహణకై శాశ్వత దాన పథకాన్ని స్థాపించాడు. ఈయన వేంకటేశ్వర స్వామికి ఒక పెద్ద మరకతాన్ని, విలువైన వజ్రవైఢూర్యాలను బహూకరించాడు. ఆ మరకతం ఇప్పటికీ రాఘోజీ పేరుతో ఉన్న ఒక పెట్టెలో భద్రంగా ఉంది. ఆ తరువాతి కాలంలో పెద్ద పెద్ద దానాలు చేసిన వారిలో [[మైసూరు]]
[[File:MS Subbalaxmi. Tirupati (1).JPG|thumb|right|తిరుపతిలో ఎం.ఎస్.సుబ్బలక్ష్మి విగ్రహము]]
పంక్తి 60:
*'''[[గోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి|గోవిందరాజ స్వామి దేవాలయం:]]''' తిరుపతిలో మేఘాలను తాకేంత పెద్దదా అనిపించే అద్భుత [[రాజగోపురం]]తో తిరుపతికే ప్రత్యేక శోభను కలుగజేస్తున్న గోవిందరాజస్వామి ఆలయం ఉంది. క్రీ.శ. 1130లో [[రామానుజాచార్యులు]] ఈ ఆలయాన్ని భక్తజనాంకితం చేశారు. ఈ [[రాజగోపురం|రాజగోపురాన్ని]] 1624లో స్వామిభక్తుడు [[మట్లి అనంతరాజు]] నిర్మించారు. గోవిందరాజస్వామి ఆలయం ఆవరణలో అనేకానేక ఆలయాలు ఉన్నాయి. గతంలో ఇది [[శ్రీకృష్ణ ఆలయం]] అయినా, నాటి మూలవిరాట్ అయిన [[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణుని]] మీద తురుష్కుల విధ్వంస చర్యలవల్ల ఆ విగ్రహం పూజార్హత కోల్పోవటంతో, ఆలయం క్రమంగా గోవిందరాజస్వామి పరమయిందని అంటారు. తిరుమలలోని [[శ్రీ వేంకటేశ్వరుడు|వేంకటేశ్వరుని]] పెద్దన్నగా భక్తులు కొలిచే గోవిందరాజస్వామి వారి ఆలయంలో కొన్ని పూజలూ పునస్కారాలూ తిరుమల ఆలయ పూజలతో ముడిపడి ఉంటాయి. ఈ ఆలయంలో స్వామివారి తలకింద ఒక పెద్ద కుంచం ఉంటుంది. వేంకటేశ్వరుడు తన వివాహ సమయంలో, [[కుబేరుడు|కుబేరుడి]] వద్ద తీసుకున్న రుణాన్ని సకాలంలో, సరిగ్గా తీర్చే బాధ్యతలో నిమగ్నమయిన గోవిందరాజస్వామి, ఆ ధనాన్ని కొలిచి కొలిచి అలసిసొలసి, రవ్వంత విశ్రమిస్తున్నట్లుగా ఉంటుంది ఈ ఆలయంలోని విగ్రహం!
*'''[[కోదండ రామాలయం, తిరుపతి|కోదండ రామాలయం]]:''' ఈ [[ఆలయం]]లోని ప్రత్యేకత ఏమిటంటే, [[సీత|సీతమ్మతల్లి]] [[రామావతారము|రాములవారికి]] కుడివైపున ఉండటం! ఇది [[వైఖానసశాస్త్రం|వైఖానసశాస్త్ర]] సంప్రదాయం. భద్రాచల రాముడి విగ్రహాన్ని మనం ఒకసారి స్ఫురణకు తెచ్చుకొంటే, అక్కడ సీతమ్మతల్లి, రాములవారి ఎడమవైపు తొడమీద కూర్చున్నట్లున్న దృశ్యం గుర్తొస్తుంది!
*'''[[కపిలతీర్థం]]:'''కపిల మహాముని యొక్క తపోఫలితానికి మెచ్చి ఈశ్వరుడు ఆవిర్భవించిన క్షేత్రం. [[టిటిడి]] యొక్క పర్యవేక్షణలో ఉన్న ఆలయాలలో ఈ ఆలయం కూడా చెప్పుకోదగినది. తిరుమల గిరులకు ఆనుకొని ఉన్న ఈ ఆలయం
*'''వరదరాజ స్వామి దేవాలయం:'''ఇది [[కపిల తీర్థం రోడ్డు]] లేదా [[కే టీ రోడ్డు]]లో ఉంది. 1990 ల ప్రాంతంలో ఈ గుడిని జీర్ణోధరణ గావించారు. ఇక్కడ సన్నిధిలో శ్రీ [[నరసింహస్వామి ఆలయం (ఖమ్మం)|నృసింహస్వామి]]
*'''జీవకోన:'''జీవకోన కపిల తీర్తానికి కొంచెం దూరంలో వున్న తిరుపతి రూరల్ మండలం. ఇక్కడ ప్రకృతి సహజసిద్దంగ ఏర్పడ్డ శివలింగం చూడవచ్చు. కొండపక్కన అటవీ ప్రాంతంలో జాలువారేజలపాతం మద్య ఈశ్వరుని దర్శనం అద్భుతం.
*'''[[అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం|ఇస్కాన్ దేవాలయం]]:''' ప్రేమకు ప్రతిరూపాలైన రాధాకృష్ణుల ( అష్టసఖి సమేత) దేవాలయం ఇది. భక్తుల నాట్యవిన్యాసాలతో నిత్యం కలకలాడుతు ఉంటుంది. భక్తులు చేసే నాట్యమునకు భూమి స్పందించినట్లు ఉంటుంది.
పంక్తి 69:
*'''[[శ్రీనివాస మంగాపురం]]:''' తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీనివాస మంగాపురం. ఇది ఆ శ్రీనివాసుడు విశ్రమించిన చోటు. [[నారాయణవనం]]లో [[పద్మావతీదేవి]]ని వివాహమాడిన [[శ్రీ వేంకటేశ్వరుడు|వేంకటేశ్వరుడు]], తిరుమలకు వెళ్తూ మార్గమధ్యంలో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్లు చెప్తారు. ఇక్కడ కళ్యాణ వేంకటేశ్వరుడు నిలువెత్తుగా, బహు సుందరమూర్తిగా దర్శనం ఇస్తాడు.
*'''[[తిరుచానూరు|అలివేలు మంగాపురం]] లేదా తిరుచానూరు :''' [[తిరుమల]] వెళ్ళి స్వామిని దర్శించుకొన్న భక్తులు- కొండ దిగి ముందుగా చేయాల్సిన పని తిరుచానూర్ (దీన్నే అలివేలుమంగాపురం అంటారు) లోని పద్మావతీ అమ్మవారిని దర్శించుకోవటమే! అయితే స్వామివారికన్నాముందే, అమ్మవారిని దర్శించాలని చాలామంది అంటారు. తిరుచానూర్, తిరుపతికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. [[కార్తీకమాసం]]లో తిరుచానూర్ పద్మావతీ అమ్మవారి [[బ్రహ్మోత్సవం|బ్రహ్మోత్సవాలూ]] బహువైభవంగా జరుగుతాయి. స్వామికిలాగే, అమ్మవారికీ [[నిత్య కళ్యాణం|నిత్య కళ్యాణమే]].
*'''[[ముక్కోటి]]:''' ఈ అలయము తిరుపతి.... చంద్రగిరి రహదారిలో తిరుపతికి నాలుగు కిలోమీటర్ల దూరంలో [[స్వర్ణముఖి నది]] ఒడ్డున ఉంది.ప్రసిద్ధి గాంచినది,
[[File:SWETA building. Tirupati (1).JPG|thumb|కుడి|తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఎదురుగా వున్న స్వేత భవనము. ఇది ఒక గ్రంథాలయం]]
*'''[[కాణిపాకం]] :''' తిరుపతికి సుమారు 70 కిలోమీటర్లు దూరంలో ఉంది.
పంక్తి 104:
==పరిపాలన==
తిరుపతి నగర పరిపాలన తిరుపతి నగర పాలక సంస్థ ఆద్వర్యంలో ఉంటుంది. తిరుపతి నుండి ఒక శాసనసభ సభ్యుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు ఉంటారు.
రాష్ర్టవిభజన సందర్భంగా తిరుపతిని మెగా సిటీగా రూపొందుటకు కేంద్ర
తిరుపతి పరిసర ప్రాంతాల పంచాయతీలను నగర పాలక సంస్ధలో విలీనం చేయటం ప్రారంభించారు. విశాఖపట్నం మెట్రో, అమరావతి మెట్రో అనంతరం తిరుపతిలో మెట్రో నిర్మాణమునకు డి.ఎమ్.ఆర్.సి. సహకరించనున్నది.
తిరుపతి అర్బన్ డెవెలెప్మెంట్ అథారిటీ ( తుడా) నగర ప్రణాళికా సంఘంగా వ్యవహరిస్తుంది.
|