దక్షిణ భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు

చి 49.39.41.59 (చర్చ) చేసిన మార్పులను యర్రా రామారావు చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి clean up, replaced: , మరియు → , (23)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 15:
[[దస్త్రం:Madras Prov South 1909.jpg|thumb|200px|1909లో [[మద్రాసు ప్రెసిడెన్సీ]], [[మైసూరు రాజ్యము]] మరియు [[ట్రావెన్కూర్ రాజ్యము]]]]
 
[[కొత్తరాతియుగమున]]కు సంబంధించిన కొన్ని శిలలపై [[కార్బన్ డేటింగ్]] ద్వారా దక్షిణ భారతదేశపు ఉనికిని క్రీస్తుపూర్వం 8000కి చెందినదిగా శాస్త్రవేత్తలు తేల్చారు. రాతి ఆయుధాలు, మరియు కొన్ని రాగి పాత్రలు ఈ ప్రాంతమునందు లభించాయి. క్రీస్తు పూర్వం 1000 నాటికి [[ఇనుప యుగం]] ఈ ప్రాంతంలో ప్రాబల్యం పొందినది. అయినా ఈ ఇనుప యుగానికి ముందు బాగా అభివృద్ధి చెందిన ఇత్తడి యుగం ప్రాచుర్యం పొందినట్లు ఆధారాలు లేవు <ref name="prehistory">Agarwal, D.P.[https://web.archive.org/web/20090318014356/http://www.arkeologi.uu.se/afr/projects/BOOK/agrawal.pdf "Urban Origins in India"], 2006. Archaeology and Ancient History, Uppsala Universitet</ref>. దక్షిణ భారతదేశం మధ్యధరా ప్రాంతాన్ని మరియు తూర్పు ప్రాంతాన్ని కలిపే కూడలి వంటిది. [[కార్వార్]] నుంచి [[కొడంగళూర్]] వరకు గల దక్షిణ తీర ప్రాంతం ప్రాంతీయులకు మరియు విదేశీ వ్యాపారస్థులకు ప్రధానమైన వాణిజ్య కూడలిగా ఉండేది<ref name="Pillai">T.K Velu Pillai, 1940; Wilfred Schoff 1912 "Periplus Maris Erythraei" (trans) 1912, Menachery, G 1998; James Hough 1893; K.V. Krishna Iyer 1971</ref>. మలబార్ ప్రాంతం వారు మరియు [[సంగం]] ప్రాంతానికి చెందిన తమిళులు [[గ్రీకులు]], [[రోమన్లు]], [[అరబ్బులు]], [[సిరియన్లు]], [[చైనీయులు]], [[యూదులు]] మొదలైన వారితో వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవారు. వీరికి ఫోయనీషియన్లతో కూడా సంపర్కముండేది<ref name="Blandstrom">(Bjorn Landstrom, 1964; Miller, J. Innes. 1969; Thomas Puthiakunnel 1973; & Koder S. 1973; Leslie Brown, 1956</ref>. దక్షిణ భారతదేశాన్ని పేరెన్నికగన్న అనేక మంది రాజులు మరియు వంశాలు పరిపాలించాయి. [[అమరావతి]]ని రాజధానిగా పాలించిన [[శాతవాహనులు]], బనవాసి [[కదంబులు]], [[పశ్చిమ గంగ]] వంశము, [[బాదామి]] [[చాళుక్యులు]], [[చేర వంశము]], [[చోళులు]], [[హోయసాలులు]], [[కాకతీయులు|కాకతీయ]] వంశపు రాజులు, [[పల్లవులు]], [[పాండ్యులు]], మణ్యకేతమునకు చెందిన [[రాష్ట్ర కూటులు]] మొదలైన చాలామంది రాజులు పరిపాలించారు. [[మధ్య యుగం]] నాటికి దక్షిణ భారతంలో [[ముస్లింలు|మహమ్మదీయుల]] పెత్తనం పెరిగింది. 1323లో [[ఢిల్లీ సుల్తాన్]] [[ముహమ్మద్ బిన్ తుగ్లక్]] సేనలు [[ఓరుగల్లు]]ను పరిపాలిస్తున్న కాకతీయులను ఓడించడంతో చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఆరంభమైంది. [[గుల్బర్గా]]కు (తరువాతి కాలంలో [[బీదర్]]కు మార్పు) చెందిన [[బహమనీ సుల్తానులు|బహమనీ సామ్రాజ్యం]], మరియు [[విజయనగర సామ్రాజ్యం|విజయనగర సామ్రాజ్యానికి]] (ఇప్పటి [[హంపి]]) చెందిన రాజులకు జరిగిన ఆధిపత్య పోరాటాలు చరిత్రలో చెప్పుకోదగ్గవి. విజయనగర రాజుల పతనం మరియు బహమనీ సుల్తానుల చీలిక వల్ల హైదరాబాదు, [[గోల్కొండ]]కు చెందిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహి వంశస్తులు]] ప్రధాన రాజులయ్యారు. [[ఔరంగజేబు]] నాయకత్వంలోని మొఘాలాయి సేనలు దక్షిణ ప్రాంతాన్ని ముట్టడించేవరకు (7వ శతాబ్దం మధ్యవరకూ) వీరి ఆధిపత్యం కొనసాగింది. అయితే ఔరంగజేబు మరణం తర్వాత మొఘలాయిల ఆధిపత్యం సన్నగిల్లింది. దక్షిణ భారతదేశపు రాజులు ఢీల్లీ నుంచి స్వయం ప్రతిపత్తిని సంపాదించుకున్నారు. [[మైసూరు]] సామ్రాజ్యానికి చెందిన [[ఒడయార్లు]], [[హైదరాబాదు]]కు చెందిన [[ఆసఫ్ జాహీ]]లు, [[మరాఠీ]]లు అధికారాన్ని పొందగలిగారు.
 
పద్దెనిమిదవ శతాబ్దం మధ్య భాగంలో అటు [[ఆంగ్లేయులు]], ఇటు [[ఫ్రెంచి వారు]] దక్షిణ భారతదేశము యొక్క సైనికాధికారానికి దీర్ఘకాలిక పోరు సాగించారు. యూరోపియన్ సైన్యాలకు కొన్ని ప్రాంతీయ శక్తులకు ఏర్పడిన సంబంధాల వలన, అన్ని పక్షాలచే ఏర్పాటు చేయబడ్డ కిరాయి సైన్యాలు దక్షిణ భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాయి. ఆంగ్లేయులతో నాలుగు సార్లు జరిగిన మైసూరు యుద్ధం, మూడు సార్లు జరిగిన మరాఠా యుద్ధం వలన [[మైసూరు]], [[పూణె]], [[హైదరాబాద్]] వంటి నగరాలు కొన్ని బ్రిటిష్ వారితోనూ, కొన్ని ఫ్రెంచి వారితోనూ సంబంధం కుదుర్చుకొన్నాయి. బ్రిటిష్ వారి పరిపాలనలో దక్షిణ భారతదేశాన్ని, [[మద్రాసు ప్రెసిడెన్సీ]], [[హైదరాబాదు]], [[మైసూరు]], [[తిరువిత్తంకూర్]] ('ట్రావెంకూర్' అని కూడా వ్యవహరిస్తారు), 'కొచి' ([[కొచ్చిన్]] లేదా ''పెరంపదపు స్వరూపం''), [[విజయనగరం (కర్ణాటక)|విజయనగరం]] మరియు ఇతర చిన్న చిన్న రాజ్యాలుగా విభజించారు. రాజుల కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఆంగ్ల పరిపాలకులు కొన్ని ముఖ్యమైన రాష్ట్ర రాజధానులలో నివాసం ఉండేవారు.
పంక్తి 39:
* [[చోళ నాడు]] - తమిళనాడులో చాలా భాగం మరియు ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ ప్రాంతం
* [[కోరమాండల్ తీరం]] - ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీరప్రాంతము, తమిళనాడు ఉత్తర తీరప్రాంతం మరియు పాండిచ్చేరి
* [[దక్కన్]] - ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక అంతర్భాగాలైన [[మరాట్వాడ]], [[విదర్భ]], [[తెలంగాణా]], [[రాయలసీమ]], [[ఉత్తర కర్ణాటక]], మరియు [[మైసూరు]] ప్రాంతాలను విస్తరించి ఉండే పీఠభూమి భాగం.
* [[కొంగు నాడు]] - తమిళనాడులోని [[కోయంబత్తూరు]], [[సేలం]], మరియు [[ధర్మపురి]] జిల్లాల పరిసర ప్రాంతాలు.
* [[కొంకణ]] - మహారాష్ట్ర తీర ప్రాంతం, [[గోవా]] మరియు కర్ణాటక తీరప్రాంతంలో కొద్దిభాగం
* [[కోస్తా ఆంధ్ర]] - [[ఆంధ్రప్రదేశ్]]లోని కోస్తా జిల్లాలు [[శ్రీకాకుళం]],[[విజయనగరం]],[[విశాఖపట్టణం]],[[తూర్పుగోదావరి]],[[పశ్చిమ గోదావరి]],[[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు]],[[ప్రకాశం]] మరియు [[నెల్లూరు]] జిల్లాలు గల ప్రదేశం.
పంక్తి 48:
* [[మైసూరు]] - కర్ణాటక దక్షిణ అంతర్భాగం.
* [[ఉత్తర కర్ణాటక]] - కర్ణాటక ఉత్తర అంతర్భాగం లేదా [[ధార్వాడ్]] ప్రాంతం.
* [[ఉత్తర సర్కారు]] - ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో మద్రాసు రాష్ట్రంలో ముస్లిం పరిపాలనా విభాగాలు. [[శ్రీకాకుళం|చికాకోల్]], [[రాజమండ్రి]], [[ఏలూరు]], [[కొండపల్లి]], మరియు [[గుంటూరు]].
* [[పాండ్య నాడు]] - [[తమిళనాడు]]లోని [[మధురై]] ప్రాంతం.
* [[రాయచూరు అంతర్వేది]] - [[కృష్ణా నది|కృష్ణ]] మరియు [[తుంగభద్ర]] నదుల మధ్య ఉండే ఉత్తర కర్ణాటక ప్రాంతం
పంక్తి 56:
* [[తులు నాడు]] - కర్ణాటకలోని [[ఉడిపి]], [[దక్షిణ కెనరా]] జిల్లాల్లోని తీరప్రాంతాలలో కొన్ని భాగాలు.
* [[తెలంగాణా]] - ఉత్తర [[ఆంధ్రప్రదేశ్]] అంతర్భాగం
* [[వెలనాడు]] - [[కృష్ణా నది]] ఒడ్డున ఉన్న ప్రాంతాలు. [[గుంటూరు]] నుంచి శ్రీశైలం వరకు ఉన్న ప్రాంతం. [[చోళులు]], మరియు [[చాళుక్యులు]] కాలంలో ఉపరాజ్యంగా ఉండేది.
 
తీర ప్రాంతం కంటే తక్కువ ఎత్తులో ఉండే [[లక్షదీవులు]]కు చెందిన పగడపు దీవులు, నైరుతీ తీరానికి దూరంగా ఉంటాయి. [[శ్రీలంక]] ఆగ్నేయ తీరం వైపుకు [[పాక్ జలసంధి]] మరియు [[రామ సేతు]] వంతెనతో భారతదేశం నుంచి వేరు చేయబడి ఉంది. [[అండమాన్ నికోబార్ దీవులు]] భారత తూర్పు తీరానికి దూరంగా [[బర్మా]] తీరమైన [[టెనాసెరీం]]కి దగ్గరగా ఉంటాయి. హిందూ మహాసముద్రం ఒడ్డున గల [[కన్యాకుమారి]] భారతదేశానికి దక్షిణం వైపు కొన భాగం.
పంక్తి 62:
=== ప్రకృతి (వృక్ష సంపద మరియు జంతు సంపద) ===
[[File:Sri Venkateswara National Park Tirumala Hills 01.jpg|thumb|200px|శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం, తిరుమల, తిరుపతి, ఆంధ్రప్రదేశ్‌]]
దక్షిణ భారతదేశంలో ఎక్కువ భాగం ఉష్ణ మండల ప్రాంతమే. సతత హరితారణ్యాలు, మరియు ఆకురాల్చు అడవులు పశ్చిమ లోయ ప్రాంతం పొడవునా కనిపిస్తాయి.
[[File:Deccan Scrub Forests at Mastyagiri 02.JPG|thumb|200px| (Deccan Scrub Forests) ఉష్ణమండలపు పొడి అడవులు, నల్గొండ జిల్లా, తెలంగాణ]]
దక్కన్ పీఠభూమిలో ఉష్ణమండలపు పొడి అడవులు (Tropical Dry Forests), [[:en:South Deccan Plateau dry deciduous forests|దక్షిణ దక్కన్ పీఠభూమి ఆకురాలు అడవులు]], [[:en:Deccan thorn scrub forests|దక్కన్ చిట్టడవులు]] అధికంగా కనుపిస్తాయి. పశ్చిమ కనుమలలోని ఎత్తైన ప్రాంతాలలో [[:en:South Western Ghats montane rain forests|నైఋతి పడమటికనుమల వర్షారణ్యాలు]] ఉన్నాయి. [[మలబారు తీరపు చిత్తడి అడవులు]] తీరమైదానాలలో కనిపిస్తాయి.<ref name="netgeo_terres">{{cite web| url=http://www.nationalgeographic.com/wildworld/profiles/terrestrial_im.html| title = Indo-Malayan Terrestrial Ecoregions| accessdate = April 15, 2006}}</ref> పశ్చిమ కనుమలు జీవ వైవిధ్యానికి ప్రధాన కేంద్రాలు.<ref name="cons_intl_hotspots">{{cite web| url=http://www.biodiversityhotspots.org/xp/Hotspots/ghats/| title=Biodiversity Hotspot - Western Ghats & Sri Lanka, Conservation International| accessdate=April 15, 2006| website=| archive-url=https://web.archive.org/web/20060504042605/http://www.biodiversityhotspots.org/xp/Hotspots/ghats| archive-date=2006-05-04| url-status=dead}}</ref>
పంక్తి 68:
ప్రఖ్యాతి గాంచిన కొన్ని వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు కొన్ని దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. [[పెరియార్ జాతీయ వనం]], [[సైలెంట్ వ్యాలీ జాతీయ ఉద్యానవనం]], [[నాగార్జున సాగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం]] మొదలైనవి పులుల సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడ్దాయి. [[రంగనతిట్టు పక్షుల సంరక్షణా కేంద్రం]], [[కుమరకోమ్]] పక్షుల సంరక్షణా కేంద్రం, [[నేలపట్టు పక్షుల సంరక్షణా కేంద్రం]], [[పులికాట్ పక్షుల సంరక్షణా కేంద్రం]] మొదలైనవి పక్షుల సంరక్షణకై ఉద్దేశించినవి. ఇక్కడ మనం అనేక రకాలైన ప్రాంతీయ పక్షులను మరియు వలస పక్షులను సందర్శించవచ్చు.
 
పశ్చిమ కనుమలకు చెందిన [[అన్నామలై]] కొండలు, [[నీలగిరి]] కొండలు, ఆంధ్రప్రదేశ్‌లో గల [[పులికాట్]] సరస్సు, తమిళనాడుకు చెందిన [[పిఛావరం]], కేరళకు చెందిన [[వెంబనాడు]], [[అష్టముది]] సరస్సు, మరియు [[కాయంకుళం]] సరస్సు ముఖ్యమైన పర్యావరణ పరిరక్షక కేంద్రాలు. కర్ణాటక, తమిళనాడు, కేరళ సరిహద్దులోగల [[ముడుమలై జాతీయ వనం]],[[బందిపూర్ జాతీయ ఉద్యానవనం]], [[నాగర్‌హోల్ జాతీయ ఉద్యానవనం]], మరియు [[వేనాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం]] మొదలైనవి [[నీలగిరి అభయారణ్యాలు]] కిందకి వస్తాయి.
 
== జనాభా వివరాలు ==
 
ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ, కర్ణాటక, కేరళ, మరియు తమిళనాడు లతో కూడిన దక్షిణ భారతదేశం మొత్తం మీద 233 మిలియన్ జనాభా ఉన్నారు.<ref name=demographics>{{cite web |url=http://www.censusindiamaps.net/page/Religion_WhizMap1/housemap.htm |title=Census India Maps |accessdate=2006-04-11 |website= |archive-url=https://web.archive.org/web/20100706213221/http://www.censusindiamaps.net/page/Religion_WhizMap1/housemap.htm |archive-date=2010-07-06 |url-status=dead }}</ref>. ఇది వివిధ రకాలైన జాతుల, మతాల, భాషలకు పుట్టినిల్లు. వీరిలో [[ఆంధ్రులు]], [[తమిళులు]], [[కన్నడిగులు]], [[మలయాళీలు]], మరియు [[కొంకణీయులే|కొంకణీయులు]] అత్యధిక శాతం. మొత్తం జనాభాలో 83% మంది హిందువులు, 11% మంది ముస్లింలు, 5% మంది క్రైస్తవులు. భారతదేశంలో క్రైస్తవులు అత్యధికంగా ఉన్న ప్రాంతాలలో దక్షిణ భారతదేశం కూడా ఒకటి. [[రోమన్ కాథలిక్]], [[ఇండియన్ ఆర్థోడాక్సు]], [[సిరియన్ జాకోబైట్]], [[ప్రొటెస్టంట్లు]], [[సైరో-మలబార్]], మరియు [[మర్తోమా]] మొదలైనవి కొన్ని క్రైస్తవ సంప్రదాయాలు. [[జైనులు]], [[బౌద్ధులు]], [[యూదులు]], మరియు ఇతర మతాల వారు 1% కంటే తక్కువగా ఉంటారు.
 
[[దస్త్రం:Mattancherry palace bhagvathy kshetram.JPG|170px|thumb|left|సాంప్రదాయక 'నూనె-దీపం' కేరళ)]]
పంక్తి 96:
|}
 
దక్షిణ భారతదేశంలో దాదాపు 50% ప్రజలు [[వ్యవసాయం]] ప్రధాన వృత్తిగా కలిగి ఉన్నారు.<ref name="demographics"/> [[భారతదేశం]] లోని ఇతర ప్రాంతాల వ్యవసాయదారుల మాదిరిగా ఇక్కడి రైతులు కూడా ప్రధానంగా నీటి కొరకు వర్షపాతం ముఖ్యంగా [[ఋతుపవనాలు|ఋతుపవనాల]] మీదనే ఆధార పడతారు. [[వరి]], [[వేరుశనగ]], [[చెరకు]], [[పత్తి]], [[రాగి]], [[మిరియాలు]], [[పప్పు దినుసులు|పప్పుదినుసు]]లైన [[మినుములు]], [[కందులు]], [[శనగలు]] మొదలగునవి ఇక్కడ పండే కొన్ని ముఖ్యమైన పంటలు. ఇంకా [[కాఫీ]], [[తేయాకు]], [[వెనీలా]], [[రబ్బారు]] మొదలైన పంటలను కొండ ప్రాంతాలలో పెంచుతారు. కోస్తా ప్రాంతాలలో [[కొబ్బరి]] తోటలు విస్తారంగా పెరుగుతాయి. వరి పంట పండించడంలో [[ఆంధ్ర ప్రదేశ్]] భారతదేశం లోనే మొదటి స్థానంలో ఉంది.,<ref name="aponline">{{cite web |url=http://www.aponline.gov.in/quick%20links/apfactfile/apfactmain.html |title=Andhra Pradesh Online |accessdate=2006-04-10 |website= |archive-url=https://web.archive.org/web/20140321052152/http://www.aponline.gov.in/quick%20links/apfactfile/apfactmain.html |archive-date=2014-03-21 |url-status=dead }}</ref>. భారతదేశంలోని కాఫీ పంట సాగులో కర్ణాటక 70% శాతాన్ని ఆక్రమించింది. ఎడతెరిపిలేని కరువుల వలన ఉత్తర [[కర్ణాటక]], [[రాయలసీమ]], మరియు [[తెలంగాణా]] ప్రాంత రైతులు అప్పుల పాలై ఉన్న ఆస్తులు అమ్ముకుని, చివరికి కొద్ది మంది ఆత్మ హత్యలు కూడా చేసుకున్నారు.<ref name=farmersuicide>{{cite web |url=http://news.bbc.co.uk/2/hi/south_asia/3769981.stm |title=BBC |accessdate=2006-04-10}}</ref> ఇక్కడ వేసవి కాలంలో నీటి ఎద్దడి కూడా ఎక్కువే.
 
ఇక పరిశ్రమల విషయానికొస్తే [[చెన్నై]]లో వాహనాలు మరియు ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి పరిశ్రమలు చాలా ఉన్నాయి. [[బెంగుళూరు]]లో భారీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాలు చాలా ఉన్నాయి. ఇటీవలి కాలంలో సమాచార సాంకేతిక రంగం (ఐటి) బాగా అభివృద్ధి చెందడంతో ఆదాయం బాగా పెరిగింది. ముఖ్యంగా బెంగుళూరును భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పిలుస్తారు. ఐటికి ఇదే ప్రధాన కేంద్రం. ఇక్కడ 200 వరకు చెప్పుకోదగిన కంపెనీలు ఉన్నాయి. [[1992]] మరియు [[2002]] మధ్యలో కర్ణాటక రూ 21,566 మిలియన్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. ఇది దేశంలో నాలుగో అత్యధిక మొత్తం. [[2005]]-[[2006|06]] ఆర్థిక సంవత్సరంలో దక్షిణ భారతదేశం నుంచి సుమారు 64000 కోట్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులు జరిగాయి.<ref name="stpi">{{cite web |url=http://www.thehindubusinessline.com/2006/05/07/stories/2006050702500300.htm |title=BusinessLine article on Tamil Nadu Software Exports |accessdate=2006-10-05}}</ref>
పంక్తి 107:
[[దస్త్రం:Cpmernakulam (40).jpg|thumb|200px|[[కేరళ]]లో [[లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్]] పార్టీ ర్యాలీ.]]
{{main|దక్షిణ భారతదేశంలో రాజకీయాలు}}
దక్షిణ భారతదేశంలో, కొన్ని ప్రాంతీయ పార్టీలు మరియు జాతీయ పార్టీలైన [[భారత జాతీయ కాంగ్రెస్]], [[భారతీయ జనతా పార్టీ]], మరియు [[కమ్యూనిస్టు పార్టీ]]లు సంకీర్ణ ప్రభుత్వాలు రాజకీయాలను శాసిస్తున్నాయి. [[కర్ణాటక]]ను మినహాయిస్తే మిగతా అన్ని రాష్ట్రాలలోనూ కనీసం రెండు రాజకీయ పార్టీలు ప్రభలంగా ఉన్నాయి.
 
దేశానికి స్వాతంత్ర్యం రాక మునుపు [[మద్రాసు ప్రెసిడెన్సీ]]లో [[జస్టిస్ పార్టీ]] మరియు [[భారత జాతీయ కాంగ్రెస్]] లే కీలక పాత్ర పోషించేవి.
[[పెరియార్ ఉద్యమం]] ప్రారంభించిన [[పెరియార్ రామసామి]] 1938 లో జస్టిస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1944లో దీని పేరు [[ద్రవిడర్ కజగం]]గా మార్పు చెందింది. దీని ప్రారంభ లక్ష్యం స్వతంత్ర భారతదేశం నుంచి ప్రత్యేక ''ద్రవిడ నాడు'' ఏర్పరచడం.<ref name="periyar">{{cite web |url=http://www.periyar.org/html/dk_movement_eng.asp |accessdate=19 April |accessyear=2006 |title="Periyar Movement- Periyar.org" |website= |archive-url=https://web.archive.org/web/20070130222128/http://www.periyar.org/html/dk_movement_eng.asp |archive-date=2007-01-30 |url-status=dead }}</ref>. స్వాతంత్ర్యానంతరం పెరియార్ తమ పార్టీ ఎన్నికల్లో పాల్గొనబోధని తేల్చి చెప్పడంతో, అతని అంతరంగిక అనుచరులు కూడా ఆయనతో విభేదించక తప్పలేదు. 1948 లో పెరియార్ అనుచరుడు, మరియు ద్రవిడర్ కజగం పార్టీ ప్రధాన కార్యదర్శియైన [[అన్నాదురై]] ఆ పార్టీ నుంచి వేరుపడి [[ద్రవిడ మున్నేట్ర కజగం]] అనే పార్టీని నెలకొల్పాడు.<ref name="periyar"/>.
 
డిఎంకె పార్టీ మొట్ట మొదటి సారిగా 1968లోనూ మరలా 1978 లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తరువాతి సంవత్సరమే [[ఎం జి రామచంద్రన్]] డిఎంకె నుంచి విడిపోయి [[ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం]] (AIADMK) ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలే తమిళనాడులో 60% శాతం వోటుబ్యాంకును కలిగి ఉన్నాయి.
పంక్తి 119:
1980 వ దశకంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడైన [[నందమూరి తారక రామారావు]] [[తెలుగుదేశం పార్టీ]]ని నెలకొల్పటంతో రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ ఏకచక్రాధిపత్యానికి అడ్డుకట్ట పడింది. కాంగ్రెస్ ఆధిక్యాన్ని సవాలు చేస్తూ మొత్తం నాలుగు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. 1995లో భారీ మెజారిటీతో గెలిచిన ఒక సంవత్సరం తర్వాత ఆయనకు, భార్య [[లక్ష్మీ పార్వతి]] మరియు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాధాల వలన తెలుగుదేశం పార్టీలో చీలిక వచ్చింది. చాలామంది పార్టీ సభ్యులు రామారావు అల్లుడైన [[నారా చంద్రబాబు నాయుడు]]ను సమర్థించడంతో తర్వాత ఆయన ముఖ్య మంత్రి అయ్యారు. నాయుడు సమాచార సాంకేతిక రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో విశేష కృషి చేశారు. మిగతా ప్రభుత్వాలకు మార్గదర్శకుడిగా నిలిచాడు. ఇటీవలి కాలంలో తెలంగాణా ప్రాంతంలో [[తెలంగాణా రాష్ట్ర సమితి]] ప్రత్యేక తెలంగాణా నినాదంతో ప్రభావాన్ని పుంజుకుంటోంది. ఈ పార్టీ ముఖ్య లక్ష్యం ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణా ప్రాంతాన్ని వేరు చేయడమే. అది జరిగితే అప్పుడు దక్షిణాదిలో ఇంకో రాష్ట్రం ఏర్పాటవుతుంది. 1990వ దశకంలో ఫ్యాక్షనిజంతో సతమతమైన కాంగ్రెస్ పార్టీ 2004 శాసనసభ ఎన్నికల్లో [[వై. యస్. రాజశేఖర రెడ్డి]] నాయకత్వంలో, తెలంగాణా రాష్ట్ర సమితితో వ్యూహాత్మక సంధి కుదుర్చుకుని భారీ మెజారిటీతో గెలుపొంది, తెలుగుదేశం పార్టీని గద్దె దించడంలో సఫలీకృతమైంది.
 
[[జనతాదళ్]] ఇప్పటిదాకా దేశ రాజకీయాలలోకన్నా, కర్ణాటకలోనే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, మరియు బిజెపిలు ఇతర దక్షిణ భారతదేశ రాష్ట్రాల కంటే కర్ణాటకలోనే ఎక్కువగా విజయాలను చవిచూస్తున్నాయి. కర్ణాటక రాజకీయాలను [[ఒక్కలిగ]] మరియు [[లింగాయతులు]] అనే రెండు కులాలు శాసిస్తున్నాయి.<ref name="karnatakapolitics">Price, Pamela. [http://www.isec.ac.in/Karnataka_Price16.5.05_aligned.pdf" Ideological Elements in Political Instability in Karnataka..."] {{Webarchive|url=https://web.archive.org/web/20060525164515/http://www.isec.ac.in/Karnataka_Price16.5.05_aligned.pdf |date=2006-05-25 }}. <u>University of Oslo</u></ref>. 1980లలో జనతాదళ్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశంలో, [[రామక్రిష్ణ హెగ్డే]] ప్రముఖ పాత్ర పోషించాడు. అయితే అతని రాజకీయ ప్రత్యర్థి ఐన [[హెచ్ డి దేవెగౌడ]] (అప్పటి కర్ణాటక ముఖ్య మంత్రి) ప్రధాని అయ్యాడు.
 
ఇక కేరళ విషయానికొస్తే ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వంలోని, [[ఐక్య ప్రజాతంత్ర కూటమి]] (యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్), మరియు [[లెఫ్ట్]] నాయకత్వం లోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రధానమైనవి. లెఫ్ట్ కంచుకోటల్లో కేరళ కూడా ఒకటి. కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టులు ఒకరు మార్చి ఒకరు అధికారంలోకి రావడం ఇక్కడ విశేషం.
 
== సంస్కృతి వారసత్వ సంపద ==
పంక్తి 133:
భారతీయ తత్వ శాస్త్రం ప్రకారం [[బ్రహ్మ]] యొక్క నాభి (బొడ్డు) సకల జీవ సృష్టికి ఆధార భూతమైనది. దీని వెనుక ఉన్న కారణం చాలామందికి తెలియనప్పటికీ నాభి భాగాన్ని, పొట్టనూ మూసి వేయకుండా అలాగే వదిలి వేస్తారు. ప్రాచీన [[నాట్యశాస్త్రం]] వెలిబుచ్చిన అభిప్రాయం ప్రకారం ఈ విధంగా నాభి భాగాన్ని కప్పుకోకుండా వదలి వేయడం వలన ''ఆంగికం భువనం యస్య'' ( భగవంతుని శరీరమే ప్రపంచమనే భావన) ఈ సంప్రదాయంలో ప్రతిఫలిస్తుంది.<ref name="beck">Beck, Brenda, 1976; Bharata, 1967</ref> స్ర్తీలు సాంప్రదాయంగా [[చీర]]ను ధరిస్తారు, అలాగే పురుషులు [[లుంగీ]] లేదా [[ముండు]]ను ధరిస్తారు.<ref name="Boulanger">Boulanger, Chantal; 1997</ref>
 
దక్షిణ భారతదేశ సంగీతాన్ని [[కర్ణాటక సంగీతం]] అని వ్యవహరిస్తారు. ఇది [[పురందర దాసు]], [[కనక దాసు]], [[త్యాగరాజు]], [[అన్నమయ్య]], [[ముత్తుస్వామి దీక్షితులు]], [[శ్యామ శాస్త్రి]], [[సుబ్బరాయ శాస్త్రి]], [[మైసూరు వాసుదేవాచార్యులు]], మరియు [[స్వాతి తిరునాళ్]] వంటి వాగ్గేయ కారులు ఏర్పరచిన తాళ, లయగతులతో కూడిన సంగీతం. సమకాలిక గాయకుల్లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, [[కె.జె. యేసుదాసు]] (జేసుదాసు), శ్రీమతి పట్టమ్మాళ్, కర్ణాటక సంగీతంలో ప్రముఖులు. భారత రత్న[[కీ.శే.ఎం.ఎస్. సుబ్బులక్ష్మి]], కీ.శే.మహరాజపురం విశ్వనాథన్, కీ.శే.మహరాజపురం సంతానం, కీ.శే.చెంబై వైద్యనాధభాగవతార్, కీ.శే.శంభంగుడి శ్రీనివాస అయ్యర్ ప్రభృతులు కర్ణాటక సంగీతాన్ని తారాపథానికి తీసికెళ్ళిన నిన్నటి తరపు విద్వాంసులలో కొందరు.
 
[[దస్త్రం:gandharva.jpg|right|thumb|220px|[[యేసుదాస్]], [[కర్నాటక సంగీతం]]లో దిట్ట.|link=Special:FilePath/Gandharva.jpg]]
పంక్తి 139:
[[File:A Kuchipudi Dancer from Visakhapatnam.JPG|thumb|200px|[[కూచిపూడి]] కళాకారిణి.]]
[[దస్త్రం:Bharatanatyam 17.jpg|left|thumb|200px|[[భరతనాట్యం]] కళాకారిణి.]]
దక్షిణ భారతదేశం వివిధ నాట్యరీతులకు ఆల వాలమైంది. [[భరతనాట్యం]], [[కూచిపూడి]], [[కథాకళి]], [[యక్షగానం]], [[తెయ్యం]], [[ఒట్టంతుళ్ళ]], [[ఒప్పన]], [[కేరళ నటనం]], మరియు [[మొహినీ అట్టం]] ఇందులో ప్రధానమైనవి. భరత నాట్యం భువనైక సౌందర్యాన్ని సాక్షాత్కరింపజేస్తుంది. భరతనాట్య కళాకారులు, కళాకారిణులలో చక్కటి శరీరాకృతి, సౌష్టవమైన శరీరం, సన్నని నడుము, పొడవైన కేశాలు, ఎత్తైన జఘనాలకు (వంపు సొంపులకు) ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది.<ref name="Kallarasa">Kallarasa Virachita Janavasya Ed: G.G. Manjunathan. Kannada Adhyayana Samsthe, University of Mysore, 1974.</ref> వీరు ''నాట్య శాస్త్రం'' యొక్క తత్వానికి జీవం పోస్తారు. సగం కూర్చున్నట్లు కనిపించే '''అరైమండి''' అనే భంగిమలో మోకాళ్ళు పక్కకి వంగి ఉంటాయి. ఈ ప్రాథమిక భరతనాట్య భంగిమలో తల నుంచి నాభి వరకు ఉన్న దూరం, నాభి నుంచి భూమికి ఉన్న దూరానికి సమానంగా ఉంటుంది. అదేవిధంగా చాచిన రెండు చేతుల మధ్య దూరం, తలనుంచి నాభి వరకు ఉన్న దూరానికి సమానం. ఇది జీవము మరియు పుట్టుక కలయికయైన్ '''నాట్యపురుషుని''' వ్యక్తీకరిస్తుంది.<ref name="beck">Beck, Brenda, 1976; Bharata, 1967</ref>
 
[[దస్త్రం:Lunch from Karnataka on a plantain leaf.jpg|thumb|200px|అరటి ఆకులపై భోజనం వడ్డించే సాంప్రదాయం (ముఖ్యంగా పండుగ దినాలలో)]]
ఇక్కడి ప్రజల ప్రధానమైన ఆహారం [[అన్నము]]. చేపలు, కోస్తా ప్రాంతాలలో నివసించేవారి ఆహారంలో ఒక అంతర్భాగం. కేరళ వంటకాలలో కొబ్బరి, ఆంధ్ర వంటకాలలో పచ్చళ్ళు, కారంతో కూడిన కూరలు సర్వ సాధారణం. [[దోశ]], [[ఇడ్లీ]], [[ఊతప్పం]] మొదలైనవి కొన్ని ప్రసిద్ధి చెందిన వంటకాలు. దక్షిణ కర్ణాటక, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో విస్తారమైన కాఫీ తోటలు ఉన్నాయి.
 
దక్షిణ భారతదేశంలో రెండు ప్రధానమైన వాస్తు శిల్పకళా రీతులు ఉన్నాయి. ఒకటి తమిళనాడుకు చెందిన సంపూర్ణ ద్రవిడ విధానం కాగా మరొకటి కర్ణాటకకు చెందిన [[వేసర]] శిల్పకళ. [[హంపి]], [[బాదామి]], [[భట్టిప్రోలు]], [[పట్టాడక]], [[అహోబిలం]],[[బేలూరు]], [[హళిబేడు]], [[లక్కుండి]], [[శ్రావణబెళగొళ]], [[మహాబలిపురం]], [[తంజావూరు]], [[మధురై]] మొదలైన దేవాలయాలలోగ శిల్పకళ ఇక్కడి శిల్పుల నైపుణ్యానికి, కళాభిరుచికీ చక్కటి నిదర్శనాలు. [[రాజా రవివర్మ]] గీసిన చిత్రాలు దక్షిణ భారతదేశ సంప్రదాయాన్ని,పురాణాల్నీ చక్కగా ప్రతిబింబిస్తాయి. ఎట్టమునూర్ లో గల శైవ క్షేత్రం, మరియు మాతంచేరి దేవాలయంలో గల చిత్రాలు [[:en:Dravidian mural painting|ద్రవిడ దేశపు కుడ్యచిత్రాలకు]] కొన్ని ఉదాహరణలు. దక్షిణ భారతదేశంలో 5 నుంచి 26 దాకా చరిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన స్థలాలు ఉన్నాయి.<ref>[http://whc.unesco.org/en/statesparties/in World Heritage Listed Sites in India]. URL accessed on [[April 12]], [[2006]].</ref>
 
[[దస్త్రం:Gomateswara.jpg|thumb|200px|left|కర్నాటక లోని [[గోమఠేశ్వర]] వద్ద, జైనుల తీర్థాంకరుడు 'బాహుబలి' ఏకశిలా శిల్పం. (978-993 నాటిది).]]
పంక్తి 151:
నృత్యం తరువాత [[శిల్పకళ]] ఇక్కడ కళలలో ప్రసిద్ధి గాంచింది. ఈ మాధ్యమంలో నిజస్వరూపాలను మూర్తులుగా మలచడం తక్కువ సమయంలోనే సాధ్యమౌతుంది. సాంప్రదాయిక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కడం బొడ్డు నుంచి ప్రారంభిస్తాడు. శిల్పాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఆత్మ మరియు పరమాత్మ యొక్క సంగమాన్ని ప్రతిబింబిస్తూ బొడ్డు శిల్పానికి సరిగ్గా కేంద్ర స్థానంలో ఉన్న విషయం తెలుస్తుంది. దేవాలయాలకు నలు వైపులా ఉన్న భవనాలు వివిధ రకాల శిల్పాలు, వివిధ రకాల భంగిమలలో అలంకరించబడి ఉన్నాయి. ఈ రకమైన నాట్య భంగిమల చిత్రణ వివిధ రకాలైన నాట్య రీతులను తరువాతి తరాల వాళ్ళకు అందజేస్తాయి.<ref name="Dehejia">Dehejia, Vidya, Richard H. Davis, R. Nagaswamy, Karen Pechilis Prentiss; 2002</ref>
 
దక్షిణ భారతదేశానికి 2000 సంవత్సరాల స్వతంత్రమైన సాహిత్య చరిత్ర ఉంది. వీటిలో మొట్టమొదట పేర్కొనదగ్గవి 2000-1500 ఏళ్ళ క్రితం తమిళంలో రాయబడ్డ [[సంగం]] కవితలు. 850 CE కి చెందిన ఒకటవ అమోఘవర్షుడు రచించిన ''[[కవిరాజమార్గ]]'' అనే రచనలో ఐదవ శతాబ్దానికి చెందిన [[దుర్వినీతుడు]] అనే రాజు యొక్క రచనల గురించి ప్రస్తావించాడు. పదవ శతాబ్దానికి చెందిన తమిళ బౌద్ధుడు ''నెమ్రినాథం'' నాలుగవ శతాబ్దానికి చెందిన కన్నడ రచనలను ప్రస్తావించాడు. తరువాత శతాబ్దాలలో మలయాళం, తెలుగు సాహిత్య సంప్రదాయాలు అభివృద్ధి చేయబడ్డాయి. ఇలంగో ఆదిగళ్ రచించిన [[శిలప్పాధికారం]] (దీనినే [[సిలప్పాటికారం]] అనికూడా అంటారు) లాంటి రచనలు గమనిస్తే దక్షిణ భారతదేశ వాసులు ప్రకృతిని ఎంతగా ఆరాధిస్తారో అవగతమౌతుంది. తొల్కప్పియార్ రచించిన [[తొల్కప్పియం]], మరియు [[తిరువళ్ళువర్]] రచించిన [[తిరుకురల్]] కూడా చెప్పుకోదగిన రచనలు. ఇక్కడి సాహిత్యంలో మరియు తత్వ శాస్త్రంలో స్త్రీని శక్తి స్వరూపిణిగా భావిస్తారు. వివాహితయైన మహిళ శుభసూచకంగా, ఆదిశక్తి స్వరూపంగా, భర్తనూ, పిల్లలనూ కంటికి రెప్పలా కాపాడుకొనే తల్లిలా భావించి గౌరవిస్తారు.
 
== భిన్నత్వం ==
[[దస్త్రం:Charminar Hyderabad.jpg|thumb|180px|[[హైదరాబాదు]] లోని [[చార్మినారు]].]]
కొన్ని శతాబ్దాల క్రిందట [[జైనమతం]] ప్రభావం ఉన్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం దక్షిణ భారతదేశంలో హిందూ మత శాఖలైనటువంటి [[శైవ భక్తులు]], [[వైష్ణవులు]] ప్రధానమైన ఆధ్యాత్మిక సంప్రదాయాలు. కర్ణాటకలో గల [[శ్రావణబెళగొళ]] జైనులకు ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం. అదే విదంగా కర్ణాటకలోనే కల [[కొడగు]] అతి పెద్ద బౌద్ధారామాల్లో ఒకటి. చైనాలో కమ్యూనిస్టులు చెలరేగినపుడు వారి ఆగడాలను భరించలేక [[టిబెట్]] నుంచి పారిపోయి వచ్చిన చాలామంది బౌద్ధులు ఈ మఠంలోనే తలదాచుకున్నారు. ముస్లిం జనాభా కూడా ఇక్కడ కొంచెం ఎక్కువే. ప్రాచీన కాలంలో, కేరళ తీర ప్రాంతమైనటువంటి [[మలబారు తీరం]] ప్రజల్లో, ఒమన్ మరియు ఇతర అరబ్బు దేశాలు వ్యాపార సంబంధాలు కలిగి ఉండటం వలన ఇక్కడ ముస్లిం జనాభా చెప్పుకోదగిన సంఖ్యలో ఉంటుంది. ఇంకా తమిళనాడులో [[నాగపట్టణం]] (నాగూరు అని కూడా అంటారు) కూడా మహమ్మదీయుల సంఖ్య బాగానే ఉంది. ఈ పట్టణంలో పురాతన కాలానికి చెందిన [[నాగూర్ దర్గా]] కూడా ఉంది. ఇక ఆంధ్ర రాష్ట్ర రాజధానియైన [[హైదరాబాదు]] దక్షిణ భారతదేశ మహమ్మదీయ సంస్కృతికి చారిత్రక కేంద్రం. [[చార్మినార్]], [[పాతబస్తీ]] లాంటి ప్రాంతాల్లో చాలావరకు ముస్లింలే నివసిస్తుంటారు.
సెయింట్ థామస్ కేరళకు వచ్చి సిరియన్ క్రైస్తవ సంప్రదాయాన్ని ఏర్పాటు చేయడం వలన దక్షిణ భారతదేశంలోని తీరప్రాంతాలలో క్రైస్తవ మతస్తులు అధికంగానే ఉంటారు. వీరినే సిరియన్ క్రైస్తవులు లేదా సిరియన్ మలబార్ నజ్రానీలు అని కూడా అంటారు.<ref name="LeslieBrown">Menachery G; 1973, 1998; Mundalan, A. M; 1984; Podipara, Placid J. 1970; Leslie Brown, 1956</ref>. సిరియన్ రైట్ క్రైస్తవులు, సైరో-మలబార్ చర్చి, సైరో-మలంకరా క్యాథలిక్ చర్చి,మలంకరా జాకోబైట్ సిరియన్ ఆర్థోడాక్స్ చర్చి, మార్థోమా చర్చి మొదలైనవి ఈ సాంప్రదాయం కిందకే వస్తాయి.<ref name="LeslieBrown">Menachery G; 1973, 1998; Mundalan, A. M; 1984; Podipara, Placid J. 1970; Leslie Brown, 1956</ref>. The two [[Eastern Catholic Churches]] have their Holy See in Kerala. క్యానయా అనే క్రైస్తవ-యూదు జాతి సైరో-మలబార్ చర్చి, మరియు మలంకరా జాకోబైట్ సిరియన్ ఆర్థోడాక్స్ చర్చి సంప్రదాయాల నుంచి ఉద్బవించింది.<ref name="LBrown">Menachery G; 1973, 1998; Leslie Brown, 1956; Vellian Jacob 2001; Weil, S. 1982; Poomangalam C.A 1998</ref>
 
[[దస్త్రం:Kottayam Valia Palli02.jpg|170px|thumb|left|[[క్నానయ]], సిరియన్ మలబార్ నస్రానీ (క్రిస్టియన్) దేవాలయం, [[కొట్టాయం]], ఇందులో పురాతన మార్ థోమా క్రాస్ మరియు సస్సానిదుల పహ్లవీ లిపులు.]]
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_భారతదేశం" నుండి వెలికితీశారు