'''నాగాలాండ్''', ఈశాన్య [[భారత దేశము]]లోని ఒక [[భారతదేశ రాష్ట్రాలు|రాష్ట్రము]]. రాష్ట్రానికి [[అస్సాం]], [[అరుణాచల్ ప్రదేశ్]] మరియు, [[మణిపూర్]] రాష్ట్రాలు మరియు, [[మయన్మార్]] దేశము సరిహద్దులుగా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని [[కోహిమా]]. నాగాలాండ్ 7 జిల్లాలుగా విభజించబడింది. జనాభాలో దాదాపు 84 శాతము ప్రజలు 16 నాగా తెగలకు చెందినవారే. నాగాలు [[ఇండో-మంగోలాయిడ్]] జాతికి చెందిన వారు. ఇతర అల్పకసంఖ్యాక తెగలలో చిన్ ప్రజలు 40,000 దాకా ఉన్నారు. వీరితోపాటూ 220,000 [[అస్సాం|అస్సామీలు]] మరియు, 14,000 [[బెంగాళీ]] ముస్లింలు ఉన్నారు. జనాభాలో 85% పైగా క్రైస్తవ మతస్థులు ముఖ్యముగా బాప్టిస్టులు. హిందూ ఆధిక్య భారతదేశములో నాగాలాండ్ ఈ క్రైస్తవ వారసత్వాన్ని పక్కనున్న [[మిజోరాం]] మరియు, [[మేఘాలయ]] రాష్ట్రాలతో పంచుకొంటున్నది.
== ఇటీవలి చరిత్ర ==
నాగాలాండ్ [[డిసెంబర్ 1]], [[1963]] న రాష్ట్రముగా అవతరించింది. 1956 నుండి భారత దేశములో అంతర్భాగముగా, మరియు, దీనికి మునుపు స్వంతంత్ర భుభాగముగా దీని స్థాయి వివాదాస్పదమైనది. కొన్ని వర్గాలు దీన్ని ఆసరాగ తీసుకొని స్వతంత్ర ప్రతిపత్తికై ఆందోళన చేస్తున్నారు.
[[2004]], [[అక్టోబర్ 2]]న జరిగిన దాడులలో, అస్సాం మరియు, నాగాలాండ్ రాష్ట్రాలలో జరిగిన రెండు బాంబు ప్రేళుల్లలో 57 మంది ప్రజలు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. అధికారులు రెండు వేర్పాటువాద తిరుగుబాటుదారు గ్రూపులు [[యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం]] మరియు, [[నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్]] ఈ చర్యలకు బాధ్యులని భావిస్తున్నారు.