కొమర్రాజు వెంకట లక్ష్మణరావు: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: 2017 source edit
పంక్తి 41:
లక్ష్మణరావు మేనమామ బండారు మాధవరావు [[నాగపూరు]] (అప్పటి మధ్యప్రదేశ్‌లో భాగం, ప్రస్తుత మహారాష్ట్ర)లో ప్రభుత్వోద్యోగి. ఆయన రెండవభార్య అచ్చమాంబ. అందువలన లక్ష్మణరావు తన తల్లితో సహా నాగపూరులో మేనమామ (బావ) వద్ద చేరాడు. అక్కా,బావల వద్ద నాగపూరులో ఉంటూ [[మరాఠీ భాష]]ను నేర్చుకున్నాడు. 1900 సంవత్సరంలో బి.ఎ.పట్టా పుచ్చుకొని, తరువాత ప్రైవేటుగా చదివి, 1902లో ఎమ్.ఏ.లో ఉత్తీర్ణుడయ్యాడు. [[మరాఠీ]] భాషలో వ్యాసాలు, పద్యాలు వ్రాసాడు. [[తెలుగు]], [[మరాఠీ]], [[ఇంగ్లీషు]] మాత్రమే కాక [[సంస్కృతము]], [[బెంగాలీ]], [[ఉర్దూ]], [[హిందీ]] భాషలలోనూ ఆయన ప్రావీణ్యతను సంపాదించాడు.
 
మహారాష్ట్రలో విద్యాభ్యాసమైన తరువాత ఆయనకు మునగాల రాజా [[నాయని వెంకట రంగారావు]] సంస్థానములో ఉద్యోగము లభించింది. రాజా అభ్యుదయ భావాలు కలిగినవాడు. తెలుగు భాషాభిమాని. లక్ష్మణరావు ఉద్యోగం చేస్తూనే తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించేలా తగిన విశ్రాంతిని, ఆర్థిక సహాయాన్ని అందజేశాడు. ఆయన సఖ్యతవల్ల, కొమర్రాజుకి తెలుగు భాషాభివృద్ధికి మంచి ప్రోత్సాహము లభించింది.లక్ష్మణరావు గారు మహారాష్టృఅలో ఉన్నప్పుడే అనేకమంది విద్వాంసులతో పరిచయం కలిగినది. క్రీ.శ. 1899 సం.న మహారాష్ట్రలో బాలగంగాధర తిలక్ రామాయణమున చెప్పబడిన పర్ణశాల మాహారాష్ట్రలో నాసికా త్రయంబకం వద్ద కలదన్న తిలక్ గారి వాదమును తోసిపుచ్చినారు లక్ష్మణరావు గారు. అప్పటికే పర్ణశాల నాసిక దగ్గరకలదను వాదము ఆకాలపు మరాఠి పత్రికలలో ప్రచురితము అయి ఉన్నన్య్ లక్ష్మణరావు దానిని తప్పు అని నిరూపించి, పర్ణశాల గోదావరి సమీపప్రాంతమని మూలమును బట్టి నిరూపించినారు. దీనితో మహారాష్ట్ర విద్యల్లోకమాశ్చర్య చకితమైనది. ముఖ్యముగా తిలక్ గారికి లక్ష్మణరావుతో పరిచయం కలిగించినదీ పర్ణశాల వివాదమే. నాటినుంచి వారిరువురకు గాఢ మైత్రి కుదిరనది. లక్ష్మణరావు తిలక్ గారికి అనుయాయి అయినాడు. అప్పటికి లక్ష్మణరావు వయస్సు 22 సం. మాత్రమే.
 
1901లో '''[[శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం]]''', 1906 లో ''[['విజ్ఞాన చంద్రికా మండలి]]''' స్థాపించడంలో కొమర్రాజు లక్ష్మణరావు ప్రముఖపాత్ర వహించాడు. తెలుగులో ఒక సంపూర్ణ విజ్ఞాన సర్వస్వమును తయారుచేసే మహత్కార్యాన్ని ప్రారంభించాడు.