రాయలసీమ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (7), typos fixed: 16 నవంబరు 1937 → 1937 నవంబరు 16, కు → కు , → (2), , → , (7)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 13:
'''రాయలసీమ''' అనునది [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని మూడు ముఖ్యప్రాంతాల్లో ఒకటి . ఆంధ్ర ప్రదేశ్ లోని దక్షిణ భాగంలో ఉండే నాలుగు జిల్లాలు ( [[కర్నూలు]], [[కడప]], [[అనంతపురం]], [[చిత్తూరు]]) రాయలసీమ ప్రాంతంలోకి వస్తాయి.
 
రాయలసీమ [[విజయనగర సామ్రాజ్యం]]లో భాగాంగా [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవ రాయల]]చే పరిపాలించబడింది. అదేవిదంగా కాకతీయ, ముసునూరి వారసులైన పెమ్మసాని, రావెళ్ళ, మిక్కిలినేని, సాయపనేని కమ్మనాయక రాజులు రాయలసీమ ప్రాంతని పరిపాలించారు. అది వరకూ [[తూర్పు చాళుక్యులు|తూర్పు చాళుక్యుల]] పరిపాలనా కేంద్రంగా '''హిరణ్యక రాష్ట్రం'''గా ఈ ప్రాంతం విలసిల్లినది. తర్వాత రాయలసీమ పై [[చోళులు|చోళుల]] ప్రభావం పెరిగింది. బ్రిటీషు వారి సహకారాన్ని పలు యుద్ధాలలో పొందిన [[హైదరాబాదు]]కి చెందిన నిజాం సుల్తానులు 1802 లో ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో దీనికి '''దత్త మండలం ''' అని పేరు వచ్చింది. 1808 లో '''దత్త మండలం''' ను విభజించి [[బళ్ళారి]] మరియు, [[కడప]] జిల్లాలని ఏర్పరచారు. 1882 లో అనంతపురాన్ని బళ్ళారి నుండి వేరు చేశారు. ఈ ప్రాంతానికి [[1928]]లో [[చిలుకూరి నారాయణరావు]] "రాయలసీమ" అని పేరుపెట్టాడు. అప్పటి నుండి ఆ పేరే స్థిరపడినది.
 
ప్రాథమికంగా తెలుగు మాట్లాడే ఈ జిల్లాలు 1953 వరకూ [[మద్రాసు ప్రెసిడెన్సీ]]లో భాగంగా ఉన్నాయి. [[బళ్ళారి]] కూడా రాయలసీమలో ప్రాంతంగానే ఉండేది. [[కోస్తా]], రాయలసీమ నాయకులు జరిపిన అనేక సంవత్సరాల ఉద్యమం ఫలితంగా 1953లో ప్రత్యేక [[ఆంధ్ర రాష్ట్రం]] ఏర్పడింది. అప్పుడు ఈ నాలుగు జిల్లాలను [[ఆంధ్ర రాష్ట్రం]] లో, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దృష్ట్యా బళ్ళారిని [[కర్ణాటక]]లో కలిపి వేశారు. [[కన్నడ]], [[తెలుగు]] మాట్లాడేవారు సమానంగా ఉన్న బళ్ళారి నగరాన్ని పలు చర్చలు, వివాదాల తర్వాత [[మైసూరు]]లో చేర్చారు. 1956 లో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణాలో కలపటంతో అప్పటి నుండి ఇవి [[ఆంధ్ర ప్రదేశ్]]లో భాగంగా ఉంటున్నవి.
 
తెలుగు మాట్లాడు ఇతర ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమ వైశాల్యంలో చిన్నదైననూ [[తెలుగు]],[[తమిళం]], [[కన్నడ]] మరియు, [[ఉర్దూ]] కళల్లో, సంస్కృతుల్లో, సాహిత్యంలో ఈ ప్రాంతం యొక్క ప్రభావం బహు అధికం.
 
కోస్తా ప్రాంతంతో పోలిస్తే రాయలసీమ అభివృద్ధి పరంగా వెనుకబడి ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినపుడు రాయలసీమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలోని [[కర్నూలు]]ను కొత్త రాష్ట్ర రాజధానిగా నిర్ణయించారు. అయితే మరో మూడేళ్ళలోనే విశాల [[ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ|ఆంధ్ర ప్రదేశ్]] ఏర్పడడంతో రాజధాని [[హైదరాబాదు]]కు మారింది.
 
==వ్యుత్పత్తి==
పలు యుద్ధాలలో బ్రిటీషు వారు నిజాం పాలకులకి సహకరించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో '''దత్త మండలాలు''' లేదా '''దత్త సీమ''' పదాలు వ్యావహారికంలోకి వచ్చాయి. 20వ శతాబ్దపు ప్రారంభం నాటికి ఇక్కడి మేధావులు ఈ పేర్లు అవమాన కారకాలుగా అనుభూతి చెందారు. 1928 నవంబరు 17-18 తారీఖులలో [[నంద్యాల]] పట్టణంలో జరిగిన ఆంధ్ర మహాసభలో పాల్గొన్న నాయకుల మధ్య జరిగిన తీవ్రమైన చర్చలలో [[చిలుకూరి నారాయణ రావు]] [[విజయనగర సామ్రాజ్యము]]నకు చెందిన రాయల వంశము ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కావున, వారి సుపరిపాలనలోనే ఇక్కడి [[సంస్కృతి]] మరియు, వారసత్వ సంపదలు ఒక వెలుగు వెలిగాయి కావున, దీనికి రాయలసీమ అని పేరు పెట్టాలని ప్రతిపాదించారు. (ఇది వరకు ఈ పేరు [[గాడిచర్ల హరిసర్వోత్తమ రావు]] ప్రతిపాదించారు అనే ఆలోచన వ్యాప్తిలో ఉండేది. కానీ పరిశోధనల్లో ఈ ఘనత చిలుకూరి వారిదే అని తేలినది.) '''రాయలసీమ''' అన్న పేరు అన్ని వర్గాల మేధావులని/సామాన్య ప్రజానీకాన్ని ఆకర్షించటంతో ఆ పేరే ఈ ప్రాంతానికి స్థిరపడిపోయింది. [[కోస్తా]] ఆంధ్ర నాయకులు మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని వేర్పరచాలని ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరుపుతున్న సమయంలో ఈ ప్రాంతం నాయకులు ఆంధ్ర ప్రాంతంతో కలిస్తే రాయలసీమ అభివృద్ధి చెందదేమో అని సంశయించి, మొదట వారికి సహకరించలేదు. రాయలసీమ ప్రజల అనుమానాలు తీర్చటానికే 161937 నవంబరు 193716 లో '''శ్రీబాగ్ ఒడంబడిక''' రూపొందించబడింది.
 
==రాయలసీమ సంస్కృతి==
పంక్తి 44:
చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన పలు ఉర్దూ రచయితలు ఉర్దూ సాహ్యిత్యానికి సేవ చేశారు.
===భాష===
రాయలసీమలో శుద్ధమైన తెలుగు భాష మాట్లాడే సంస్క్రతి ఉంది. రాజభాష తెలుగైనా రెండవ అధికార భాషగా [[ఉర్దూ భాష]] ఉంది. చిత్తూరు జిల్లాలోని పడమట మరియు, దక్షిణ ప్రాంతాలలో తమిళ భాష మాట్లాడేవారు ఎక్కువ. తిరుపతి, చిత్తూరు, పుత్తూరు ప్రాంతాలలో తమిళ ప్రభావం ఎక్కువ. కుప్పంలో ద్రావిడ విశ్వవిద్యాలయం ఉంది. మూడు రాష్ట్రాలు, ఆంధ్ర, కర్నాటక మరియు, తమిళనాడు రాష్ట్రాలు కలిసే చోట ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
===సంగీతం===
బ్రాహ్మణ కులంలో కేవలం రాయలసీమ ప్రాంతానికి మాత్రం పరిమితమైన ఉపకులం ములకనాడు బ్రాహ్మణం. ఈ కులానికి చెందిన [[త్యాగరాజు]] [[కాకర్ల (అర్ధవీడు)]]కి చెందినవాడు. ప్రస్తుతం ఇది [[ప్రకాశం జిల్లా]] ఉన్ననూ ఒకానొక గానంలో ఈయన పూర్వీకులు రాయలసీమకి చెందినవారని తానే స్వయంగా చెప్పుకొన్నారు.
పంక్తి 50:
వాగ్గేయకారుడైన [[అన్నమయ్య]] [[కడప జిల్లా]]కి చెందిన [[తాళ్ళపాక]]కి చెందినవాడు.
 
తరిగొండ నరసింహ స్వామి పై మరియు, [[వెంకటేశ్వర స్వామి]] పై అనేక గీతాలని రచించిన [[తరిగొండ వెంకమాంబ|వెంగమాంబ]] [[తిరుపతి]] వద్దనున్న [[తరిగొండ]]కి చెందినది.
 
ప్రముఖ సంగీతకారుడు [[రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ]] [[అనంతపురం|అనంతపురానికి]] చెందినవాడు.
 
ప్రముఖ సంగీతకారుడు (మరియు, వైద్యుడు) అయిన [[శ్రీపాద పినాకపాణి]] జన్మత: [[శ్రీకాకుళం]] జిల్లాకి చెందినవారైననూ, [[కర్నూలు]]లో స్థిర పడ్డారు.
== కళలు==
* [[కలంకారీ]] చిత్రలేఖనం
పంక్తి 65:
* '''[[బి. పద్మనాభం]]:''' హాస్యనటుడు. [[కడప జిల్లా]], [[పులివెందుల]] తాలూకా, [[సింహాద్రిపురం]]
* '''[[జయప్రకాశ్ రెడ్డి]]:''' సీమ భాషని నిఖార్సుగా పలికే హాస్యనటుడు, ప్రతినాయకుడు
* '''[[రమాప్రభ]]:''' కదిరిలో పుట్టిన మదనపల్లె కుమదనపల్లెకు చెందిన పేరుపొందిన సహాయనటి
 
===పుణ్యక్షేత్రాలు===
పంక్తి 117:
 
==పంటలు==
* [[వేరుశనగ]]: భారతదేశంలోనే పేరుపొందిన కదిరి-9, కదిరి-7 ,కదిరి-5 రకం వేరుశనగ అనంతపురం జిల్లా కదిరి వ్యయసాయ పరిశోధనకేంద్రంలో తయారు చేస్తున్నారు.
* [[మామిడి]]
* [[చెరకు]]
"https://te.wikipedia.org/wiki/రాయలసీమ" నుండి వెలికితీశారు