మనుస్మృతి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: లో → లో , విచ్చిన్న → విచ్ఛిన్న, → , , → , (3)
పంక్తి 3:
'''మనుస్మృతి''' పురాతనమైన హిందూ ధర్మశాస్త్రాలలో ఒకటి. దీన్ని మనుధర్మ శాస్త్రం అని, మానవ ధర్మ శాస్త్రం అని అంటారు. క్రీస్తు పూర్వం 200 - క్రీస్తు శకం 200 మధ్య మను అను ఋషి వ్రాశాడు. మనుస్మృతిని మొదటిసారిగా 1974లో సర్ విలియమ్ జోన్స్ అను అంగ్లేయుడు ఆంగ్లంలో తర్జుమా చేశాడు. ఈ శాస్త్రంలో ఆదిమానవుడైన మను వివిధ వర్ణాలకు చెందిన ఋషులతో సమస్త విషయాలు బోధించినట్లు చూస్తాం. హిందూ సంప్రదాయం ప్రకారం మనుస్మృతి బ్రహ్మ వాక్కుల సంపుటి అని నమ్మకం.
 
హిందూ ధర్మ శాస్త్రాలలో మనుధర్మ శాస్త్రం ఒకటి. దీనిని మానవ ధర్మ శాస్త్రం అని కూడా అంటారు. 2,684 వాక్యములు 12 అధ్యాయాలుగా విభజింపబడ్డాయి. గృహ, సామాజిక మరియు, మతపరమైన నియమాలు ఇందులో ఉంటాయి.
 
అయితే ఇది హిందూ ధర్మంలో అత్యంత నకిలీకి గురైన గ్రంథంగా మిగిలి పోయింది. అంతేకాదు, హిందూ ధర్మాన్ని విచ్చిన్నంవిచ్ఛిన్నం చేయడానికి, కులాంతరాలను, లింగపర విద్వేషాలను రగిలించదానికి ఉపయోగించబడిన ఒక ప్రణాళికగా మిగిలిపోయింది. మొత్తం 50 రకాల మనుధర్మ శాస్త్రాలు అందుబాటులో వుండటం వలన, అంతేకాక ఒక దాంట్లోని వాక్యాలు ఇంకొక గ్రంథంలోని వాక్యాలతో ఏకీభవించకపోవడం వలన ఇది కొందరి చేత దురుద్దేశ పూర్వకంగా మార్చబడిందని విశ్లేషకులు నిర్థారించారు.
 
కుళ్ళుక భట్టా వాఖ్యానంలో కలకత్తా సంస్థ ప్రచురించిన పుస్తకం అధికారికమైనది అనుకున్నప్పటికీ, దాని వాస్తవికతను కూడా ఆధునిక చరిత్రకారులు తిరస్కరించారు. ముఖ్యంగా మనుధర్మ శాస్త్రం "ఒక చొప్పించబడిన అర్థరహిత పూరిత వాక్యాల వైరుధ్యాల సముదాయం" అని ఎందరో నిపుణులు నిర్థారించారు. ముఖ్యంగా శూద్రులు, మహిళల పట్ల వివక్ష పూరిత వాక్యాలు ఆనాటి కాలంలో ఎవరో ఉద్దేశ పూర్వకంగా ఈ గ్రంథంలోకి చొప్పించి ప్రచురించారని చరిత్రకారులు, పండితులు నిర్ధారించారు. విలియం జోన్స్ అనువదించిన మనుధర్మ శాస్త్రం ద్వారా దేశాన్ని పరిపాలిస్తున్న అప్పటి బ్రిటీషు వారు హిందూ చట్టాన్ని రూపొందించారు. ఇది సామాన్య శకం పూర్వం 2వ శతాబ్దం నుండి, సామాన్య శకం ౩వ శతాబ్దం మధ్య కాలంలో రచించబడి ఉంటుందని అంచనా.  
 
ఆదిమానవుడు మనువు, అతను మానవాళికి ఇచ్చిన చట్టాన్ని మనుస్మృతిగా పేర్కొంటారు. ఈనాడు 80 శాతం హిందువులకు అసలైన మనుధర్మ శాస్త్రం అందుబాటులో లేదని ఒక అంచనా. "అందరం పరమాత్మ అంశలమే, ఎవరూ ఎవరికన్నా తక్కువ కాదు" అనే భగవద్గీత, ఉపనిషత్తుల మూల సిద్ధాంతాలకి విరుద్ధంగా వుండటంతో, మనుస్మృతి బ్రిటీషు వారి హయాంలో జరిగిన ఒక కుట్రపూరిత ప్రణాళికగా కూడా కొందరు అభిప్రాయబడ్డారు. అసలైన మనుధర్మ శాస్త్రం యొక్క ఆనవాళ్ళు ఈనాడు దాదాపుగా లేవు. ప్రతీ సంవత్సరం డిశంబరు 25న కొన్ని దళిత సంఘాలు "మనుస్మృతి దహనం" పేరిట ప్రస్తుతం అందుబాటులో వున్న కాపీలని నిరసనా కార్యక్రమాలతో కాల్చి వేస్తున్నాయి.
 
== కొన్ని ముఖ్యమైన విషయాలు==
 
*బ్రాహ్మణులను వేద పండితులు మరియు, గురువులుగా, క్షత్రియులు పరిపాలకులుగా, వైశ్యులు వ్యాపారులు మరియు, వ్యవసాయదారులుగా, శూద్రులు సేవకులుగా ఆశీర్వదించాడు మనువు.
*8 సంవత్సరాల బ్రాహ్మణుడికి, 11 సంవత్సరాల క్షత్రియుడికి, 12 సంవత్సరాల వైశ్యుడుకి ఉపనయనం జరుపవలెను.
*గురువు బ్రాహ్మణుడి ప్రతిరూపము, తండ్రి ప్రజాపతి రూపము, తల్లి భూదేవి రూపము, పెద్ద సోదరుడు తన స్వరూపము.
పంక్తి 24:
 
==ఇతర విషయములు==
స్త్రీ సాధికారత ఫలితంగా ఏర్పడిన మహిళా సంఘాలు మనుధర్మ శాస్త్రాన్ని వ్యతిరేఖించాయి. మనుధర్మ శాస్త్రం మహిళలను కించపరచేలా కొందరి చేత వ్రాయబడినదని కొందరు అభిప్రాయబడ్డారు. భారతీయ సమాజము పురుషాధిక్య సమాజమని వారు అభిప్రాయ పడుతున్నారు. శూద్ర కులాల వారిని మనుధర్మ శాస్త్రం చిన్న చూపు చూసిందని పెక్కు విమర్శలున్నాయి. భారత దేశ రాజ్యాంగం ప్రజలందరికీ కులాలకు అతీతంగా సమాన హక్కులు ఇచ్చింది. అందువల్ల మనుధర్మ శాస్త్రము బ్రాహ్మణ, క్షత్రియ వైశ్య కులాలవారికి తప్ప ఇతర కులాల వారికి అధర్మ శాస్త్రంగా కనిపిస్తుంది. ఆర్యుల కాలంలో సమాజ వ్యవస్థ అద్భుతంగా ఉండేదంటే దానికి ఒక కారణం వృత్తిని బట్టి కుల విభజన అయితే మరో కారణం ఆనాటి ప్రజలు మనుధర్మ శాస్త్రం అనుసరించడం అని చెప్పవచ్చు. మనుస్మృతిలోని మనువు [[బైబిల్]]లోని పాతనిబంధనలో నోవాహుకి సాదృశ్యంగా కనిపిస్తాడు.<ref>http://bibleforchildren.org/PDFs/english/Noah%20and%20the%20Great%20Flood%20English.pdf</ref>. స్టార్ మా టివి లోటివిలో 'అగ్నిసాక్షి ' అనే సీరియల్ మనుస్మృతి డాక్ట్రిన్ ఆధారంగా నిర్మించినదే.
 
==ఇంకా చదవండి==
"https://te.wikipedia.org/wiki/మనుస్మృతి" నుండి వెలికితీశారు