విశ్వదర్శనం - భారతీయ చింతన: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె చేర్పు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
 
== పూర్వరంగం ==
ప్రపంచ దర్శన శాస్త్రాలను సంగ్రహంగా తెలుగు పాఠకులకు పరిచయం చేయడం ఈ పుస్తకం యొక్క ముఖ్యోద్దేశం. విశ్వదర్శనం అనే పేరుతో రెండు పుస్తకాలు వచ్చాయి. మొదటి పుస్తకం పాశ్చాత్య తత్వ చింతన గురించి చర్చిస్తుంది. రెండవదైన ఈ పుస్తకం భారతీయ తత్వ చింతనను గురించి వివరిస్తుంది. ఈ రెండు భాగాలు [[ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక]]లో 1980 - 1996 సంవత్సరాల మధ్య కాలంలో కొంత విరామాలతో ధారావాహికగా వెలువడ్డాయి. ఈ వ్యాసాలనే సంకలనం చేసి పుస్తకాలుగా విడుదల చేశారు. ఈ పుస్తక రచయిత దీనిని రాయడానికి ప్రేరణ ఆంధ్రజ్యోతి వారపత్రిక మొదటి సంపాదకుడైన [[పురాణం సుబ్రహ్మణ్య శర్మ]] అని రచయిత ముందుమాటలో రాశాడు.<ref>{{Cite book|title=విశ్వదర్శనం భారతీయ చింతన|last=నండూరి|first=రామమోహనరావు|publisher=విక్టరీ పబ్లికేషన్సు|year=2015|isbn=|location=విజయవాడ|pages=7}}</ref> మొదటి భాగంగా విడుదలైన పాశ్చాత్య చింతన వ్యాసాలు ఈయన ఆధ్వర్యంలోనే వెలువడ్డాయి. తర్వాతి సంపాదకులైన [[తోటకూర రఘు]] ఆధ్వర్యంలో రెండోభాగం (భారతీయ చింతన) వ్యాసాలు వెలువడ్డాయి.
 
ఈ పుస్తకంలో భారతీయుల చింతనకు మూల పురుషులు [[ఆర్యులు]]. వారి పూర్వరంగంతో ప్రారంభించి [[చతుర్వేదాలు|వేదాలు]], [[ఉపనిషత్తు|ఉపనిషత్తులు]], [[బౌద్ధ మతము|బౌద్ధం]], [[జైన మతము|జైనం]], [[చార్వాకం]], [[భగవద్గీత]] మొదలైన వాటిని చర్చించి, [[జిడ్డు కృష్ణమూర్తి]] ఆధ్యాత్మిక చింతనతో ఈ పుస్తకం ముగుస్తుంది. పశ్చిమ దేశాల తాత్వికులు [[పరలోకం]] కంటే [[ఇహలోకం|ఇహలోకానికి]] ప్రాధాన్యమిస్తే భారతీయ తాత్వికులు అందుకు భిన్నంగా ఇహలోకం కంటే పరలోకానికి ప్రాధాన్యతనిచ్చారు.
 
== ఇవి కూడా చూడండి ==