రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[Image:RaaLLapalli anaMta kRshNa.jpg |thumbnail|right|[[తిరుపతి]][[ అన్నమాచార్య ప్రాజెక్టు]] నందలి రాళ్ళపల్లి ఫోటో.]]▼
▲[[Image:RaaLLapalli anaMta kRshNa.jpg |thumbnail|right|[[తిరుపతి]][[ అన్నమాచార్య ప్రాజెక్టు]] నందలి రాళ్ళపల్లి ఫోటో]]
తెలుగు సాహిత్యపు ఆధునిక వచన శైలీ నిర్మాతలలో '''అనంతకృష్ణశర్మ''' అగ్రేసరులు. విమర్శనా రీతులలో వీరు మార్గదర్శకులు. [[అన్నమాచార్యులు]] వారి కృతులను - కొన్ని వందల కృతులను - వీరు స్వరపరచి తెలుగువారికి అందించేరు. [[వేమన]]పై సాధికారమైన విమర్శ గ్రంధాన్ని వెలువరించేరు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమ స్కందులు. [[మైసూరు]] [[మహారాజా కళాశాల]]లో ముప్పైఎనిమిది సంవత్సరాలు అధ్యాపకత్వం నిర్వహించేరు. ఏకసంథాగ్రాహిగా పేరు పడినవారు.
Line 10 ⟶ 8:
చామరాజునగరం రామశాస్త్రిగారి వద్ద 'శాకుంతలం', 'ఉత్తరరామ చరిత్ర', 'ముద్రా రాక్షసం', అనర్ఘరాఘవం', 'కాదంబరి' వాటిని చదివారు. సామాజిక స్పృహ వాదులైన నేటి సమాజానికి ఆదర్శప్రాయుడైన వేమన గురించి శర్మగారు తమ వేమనోపన్యాసాలలో అనేక విషయాలు ఆవిష్కరించారు. 'నిగమశర్మ అక్క', 'నాచన సోముని నవీన గుణములు', 'తిక్కన తీర్చిన సీతమ్మ', 'రాయలనాటి రసికత' అనే వీరి వ్యాసాలు బాగా ప్రసిద్ధమైనవి. [[కట్టమంచి రామలింగారెడ్డి]] గారితో పరిచయం కలిగి, వారి ఆహ్వానం మీద 1912లో మొట్టమొదటిసారిగా ఏర్పరచిన తెలుగు పండివ పదవిని అలంకరించారు. అప్పటి నుండి తెలుగులో రచనా వ్యాసంగాలను మొదలుపెట్టారు. కాళిదాసు రచించిన [[రఘ వంశం]] ఆంధ్రీకరించారు. 'పెద్దన పెద్దతనము' అను విమర్శనాత్మక వ్యాసాన్ని రాశారు.
సంగీతప్రియులైన శర్మ కృష్ణప్పగారి వద్ద నాలుగైదు సంవత్సరాలు శాస్తీయసంగీతాన్ని అభ్యసించారు. [[తిరుమల తిరుపతి దేవస్థానం]] కార్యనిర్వహణాధికారి [[చెలికాని అన్నారావు]] తాళ్ళపాక కవుల కీర్తనల పరిష్కరణ కార్యం నిర్వహించవలసిందిగా శర్మగారిని కోరారు. వీరు ఏడు సంవత్సరాలు (1950-57) సంకీర్తనలను పరిశీలించి కొన్నింటికి స్వరకల్పన గావించి వాటి గొప్పతనాన్ని చాటారు.
===సత్కారాలు===
రాళ్ళపల్లివారు [[1979]], [[మార్చి 11]]న పరమపదించారు.
వీరికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు.
|