వైఖానసం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4)
పంక్తి 1:
{{హిందూధర్మశాస్త్రాలు}}
[[File:Priests performing Yagnya as part of Kumbhaabhishekam at Gunjanarasimhaswamy Temple, T. Narasipur.jpg|thumb|right|250px|వైఖానస బ్రాహ్మణులు వైదిక పద్ధతిలో యాగం చేస్తూ..., గుంజనరసింహస్వామి ఆలయం, నర్సీపుర, కర్నాటక]]
[[శ్రీవైష్ణవం]], [[శైవం]], [[మధ్వాచార్యుడు|మాధ్వం]] లాగానే '''వైఖానసం''' కూడా [[హిందూమతము|హిందూ సాంప్రదాయా]]ల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు [[విష్ణువు]]ని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ [[యజుర్వేదం|యజుర్వేద]] తైత్తీరియ శాఖను మరియు, వైఖానస కల్పసూత్రాన్ని పాటించే [[బ్రాహ్మణులు]]. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన [[విఖనస ఋషి]] నుండి వస్తుంది. ఈ మతం [[ఏకేశ్వరోపాసన|ఏకేశ్వర]] భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తర మీమాంసను నమ్మకుండా, కేవలం పూజాపునస్కారాల పైనే వైఖానసం నడుస్తుంది. వైఖానసుల ప్రాథమిక గ్రంథమయిన వైఖానస భగవత్ శాస్త్రమే [[తిరుమల]] [[వేంకటేశ్వరుడు|వేంకటేశ్వరుని]] నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన [[వైఖానస ఆగమం]].<ref>{{Cite web |url=http://www.vaikhanasa.com/vaikhanasam.html |title=వైఖానసం జాలగూడు |website= |access-date=2014-01-03 |archive-url=https://web.archive.org/web/20140613015711/http://www.vaikhanasa.com/vaikhanasam.html |archive-date=2014-06-13 |url-status=dead }}</ref>
==చరిత్ర==
వైఖానసులు ఒక తపస్సంపన్నుల సమూహం. వీరి ప్రస్తావన మొదటి సారిగా [[మనుస్మృతి|మనుధర్మశాస్త్రం]]లో వస్తుంది. మనువు మనిషి యొక్క వర్ణాశ్రమంలోని ఆఖరి రెండు చరమాంకాలయిన [[వానప్రస్థం]] ఇంకా [[సన్యాసాశ్రమం]] గురించి చెబుతూ వైఖానస నిబంధనను తెలుపుతాడు. తద్వారా వైఖానస సముదాయం ఆ కాలానికే ఉందని తెలుస్తుంది. [[నారాయణీయం]]లో కూడా వీరి ప్రస్తావన వస్తుంది. కానీ సైద్ధాంతికంగా వైఖానస సూత్రాలు నాలుగోశతాబ్దికన్నా పాతవి కావని తెలుస్తోంది. ఎనిమిదవ శతాబ్దం నాటి ఆలయ శిలాశాసనాల ద్వారా వైఖానసులు పూజారులని తెలుస్తోంది. వైఖానసులు పూజారిలే కాక [[దేవాలయం]]లో ధర్మకర్తల బాధ్యతలు కూడా నిర్వహించేవారు. గుడికి సంబంధించిన ఆస్తులకు జవాబుదారీగా ఉండే వారు. [[శ్రీవైష్ణవం|శ్రీవైష్ణవుల]] రాకతో వైఖానసుల ప్రాభవం తగ్గిపోయింది. [[రామానుజాచార్యుడు|రామానుజాచార్యుడి]] రాకతో ఈ ప్రాభవం మరింత తగ్గింది. రామానుజులు దేవాలయ పూజారి వ్యవస్థను రూపుమాపు చేసాడు. అయిదు స్థాయిలలో ఉన్నది పది స్థాయిలకు మార్చాడు (ప్రధానార్చకుడు-అర్చకుడు-తీర్థం (నీరు) తెచ్చే వ్యక్తి - వంట చేసే వ్యక్తి - ఘంటారావం చేసే వ్యక్తి ఉన్న వ్యవస్థ నుండి శూద్రులకు స్థానం కల్పిస్తూ నిర్మాల్యం తొలగించడం-పాలుపూలుపళ్ళు తేవడం- ఉత్సవ పల్లకీ మోయడం - గుడిలో తులసీవనం పోషించడం మొ॥ ఉన్న వ్యవస్థను నెలకొల్పడం). ఈ విధంగా [[శూద్రులు|శూద్రు]]లకు ఎన్నడూలేని స్థానం దేవాలయంలో దక్కినప్పటికీ వైఖానసుల అవసరం తగ్గలేదు. ఈనాడు ప్రముఖ వైష్ణవ దేవాలయాలన్నిటిలోనూ ప్రధానార్చకులుగా వైఖానసులే ఉంటారు.
పంక్తి 12:
వీరెక్కువగా తెలుగు మాట్లాడుతారు. [[అరవం]] వారు కూడా [[తెలుగు లిపి]]ని చదవగలుగుతారు.
==మత సిద్ధాంతం==
వైఖానసులు, వారి నమ్మకం ప్రకారం, వైదిక సాంప్రదాయమైన కృష్ణ యజుర్వేదీయ తైత్తీరియ శాఖను పాటించే జీవిత సమూహం. వైఖానస సాంప్రదాయం ప్రకారం ఋషి''విఖనసుడు'' మహావిష్ణువు యొక్క అంశతో మహావిష్ణువుకే జన్మించాడు. బ్రహ్మతో పాటుగానే ఇతనికి ఉపనయనం జరిగింది. మహావిష్ణువే గురువుగా సమస్త వేదాలు, మరియు, భగవత్ శాస్త్రాన్ని అభ్యసిస్తాడు. ఆపై భూమి మీదకి నైమిశారణ్యం వద్దకు వస్తాడు. అక్కడ వైఖానస కల్పసూత్రాన్ని రచించి తన నలుగురు శిష్యులైన అత్రి, భృగువు, కశ్యపుడు మరియు, మరీచికి ఉపదేశిస్తాడు. అత్రికి సమూర్తార్చన, భృగువుకి అమూర్తార్చన, కశ్యపుడికి తర్కం-జపం, మరియు, మరీచికి అగ్ని హుతం పై ఉపదేశాలు చేస్తాడు.
వైఖానసుల ప్రకారం వైదిక హవిస్సు క్రతువునే వీరు కొనసాగిస్తున్నారు. యాగం చేస్తూ అగ్నిలో హవిస్సులు పోస్తే వచ్చే ఫలితమే వైష్ణవారాధాన ద్వారా వస్తుందని నమ్ముతారు.
విష్ణువు యొక్క ఐదు రూపాలను వీరు కొలుసారు -
పంక్తి 23:
==మూలములు==
<references/>
 
దేన్నీ మూలముగా స్వీకరించారో దాని ప్రామాణికత తెలియడం లేదు. వైఖానస పాంచరాత్ర వైరములు అతిగా చూపించారు
 
[[వర్గం:హిందూ మతం తెగలు]]
[[వర్గం:బ్రాహ్మణ శాఖలు]]
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
దేన్నీ మూలముగా స్వీకరించారో దాని ప్రామాణికత తెలియడం లేదు. వైఖానస పాంచరాత్ర వైరములు అతిగా చూపించారు
"https://te.wikipedia.org/wiki/వైఖానసం" నుండి వెలికితీశారు