చెలికాని అన్నారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
వీరు [[1908]], [[సెప్టెంబరు 8]]న [[విజయనగరం]] జిల్లాలోని [[బొబ్బిలి]] రాజవంశంలో జన్మించారు.
 
అన్నారావుగారు 1930లో మద్రాసు [[ప్రెసిడెన్సీ కళాశాల]] నుండి రసాయన శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. ముంబైలోని లక్ష్మీరంగం కాపర్ మైన్స్ లిమిటెడ్ సంస్థకు, మద్రాసు కమర్షియల్ కార్పొరేషన్ కు డైరెక్టరుగా పనిచేశారు. 1933లో [[తిరుమల తిరుపతి దేవస్థానం]]లో అధికారిగా చేరారు. అన్నారావుగారు టి.టి.డి.లో పేష్కారుగా, పర్సనల్ అసిస్టెంటు కమీషనరుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. స్వామివారి దర్శనానికి చవ్వే యాత్రికులకు విశేషమైన సౌకర్యాలు కల్పించడం వీరితోనే ఆరంభమయింది. వీరు దేవస్థానంలో ఉద్యోగులకు ప్రభుత్వోద్యోగులతో సమానమైన జీతాలు, సౌకర్యాలను కల్పించి, చక్కని క్రమశిక్షణ అలవర్చారు. అమెరికా, ఇతర దేశాలలో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ స్థాపనకు ఆయన ఎంతో కృషిచేశారు.
 
==మూలాలు==
*20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/చెలికాని_అన్నారావు" నుండి వెలికితీశారు