అబుల్ హసన్ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలంగాణ వ్యక్తులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2), , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[File:Portrait of Abu'l Hasan,.jpg|thumb|అబుల్ హసన్ కుతుబ్ షా, ]]
 
'''తానాషా''' (దయామయ పాలకుడు) గా ప్రసిద్ధి చెందిన '''అబుల్ హసన్ కుతుబ్ షా''' [[దక్షిణ భారతదేశము]]లో [[గోల్కొండ]]ను పాలించిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్‌షాహీ వంశాని]]కి చెందిన ఏడవ మరియు, చివరి చక్రవర్తి. ఇతడు [[అబ్దుల్లా కుతుబ్ షా]] మూడవ అల్లుడు. ఈయన [[1672]] నుండి [[1687]] వరకు పాలించాడు.
== బాల్యం ==
అబుల్ హసన్ చిన్నతనంలో అబ్దుల్లా మహారాజు భవంతిలో ఉండేవాడు. అతను ఎవరి కుమారుడో తెలియకున్నా, అతనికీ రాజవంశానికి ఏదో సంబంధం ఉందని భావిస్తూ అందరూ కొద్దిపాటి గౌరవాన్ని ఇచ్చేవారు. చిన్నతనంలోనే తాగుబోతుగా మారి అల్లరిచిల్లరిగా జీవితాన్ని గడుపుతూండే అబుల్ హసన్ ఓసారి మహారాణినే ఆ మైకంలో అవమానించాడు. దానితో కోపించిన మహారాజు భవంతి నుంచి వెళ్ళగొట్టారు. అనంతరం అతను నగరంలో ప్రసిద్ధిచెందిన సూఫీ సన్యాసి షారాజు ఆశ్రమంలో చేరాడు. ఇబ్బంది కలిగించకుండా అక్కడ బ్రతికేవారందరికీ ఆశ్రయం, ఆహారం అందించే సన్యాసి వాడుక అతనికి వరమైంది. చివరకి కొన్నాళ్ళకు అబుల్ హసన్ షారాజుకు సన్నిహిత శిష్యుడయ్యాడు.
పంక్తి 9:
 
==పరమత సహనం==
ఇతర మతాలకు చెందిన ప్రజలను కూడా తారతమ్యాలు లేకుండా పరిపాలించిన ప్రభువుగా తానీషా చిరస్మరణీయుడు. ఈయన తన ఆస్థానములో మంత్రులు మరియు, సేనానులుగా అనేకమంది బ్రాహ్మణులను నియమించుకున్నాడు. ఉదాహరణకు తానీషా [[కొండవీడు]]కు
చెందిన మాదన్న అనే [[తెలుగు]] బ్రాహ్మణున్ని ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు. తెలుగు సాహిత్యములో తానీషా, మాదన్న మేనల్లుడు [[రామదాసు]] (కంచర్ల గోపన్న) ను కారాగారములో బంధించిన చక్రవర్తిగా ప్రసిద్ధి పొందినాడు. [[పాల్వంచ]] తాలూకా [[నేలకొండపల్లి]] గ్రామ వాస్తవ్యుడైన కంచర్ల గోపన్నను తానీషా మాదన్న సిఫారుసుపై పాల్వంచ తాలూకాకు తాసీల్దారుగా నియమించాడు. గోపన్న ప్రజాధనాన్ని ప్రభువుకు ముట్టజెప్పకుండా [[భద్రాచలము]]లో రామాలయము నిర్మించడానికి, సీతారామలక్ష్మణులకు నగలు చేయించడానికి వినియోగించగా ప్రజాధనాన్ని సొంతపనులకు ఉపయోగించుకున్నాడన్న అభియోగముపై గోపన్నను తానీషా గోల్కొండలోని కారాగారములో బంధించాడు. కథనం ప్రకారం ఆ తరువాత [[రామలక్షణులు]] [[తానీషా]]కు కనిపించి స్వయంగా డబ్బుతిరిగి ఇచ్చినారనీ, అందుచేత గోపన్నను విడుదల చేసినాడనీ ప్రతీతి.