ఎక్కిరాల కృష్ణమాచార్య: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎జననం: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 39:
 
== జననం ==
ఈయన [[1926]], [[ఆగష్టు 11]]వ తేదీన [[ఆంధ్రప్రదేశ్]]కు చెందిన [[గుంటూరు జిల్లా]], [[బాపట్ల]]లో అనంతాచార్యులు మరియు, బుచ్చమ్మ దంపతులకు జన్మించాడు. ఈయన [[తెలుగు]], [[సంస్కృత]], [[ఆంగ్ల]] భాషలలో పాండిత్యాన్ని సాధించాడు. 'పాండురంగ మాహాత్మ్యం' కావ్యంపై పరిశోధన చేసి ఒక అద్భుతమైన గ్రంథాన్ని వెలయించి 'డాక్టరేట్' సాధించాడు. గుంటూరులోని హిందూ కళాశాలలోను, తరువాత [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]]లోను తెలుగు ఉపన్యాసకుడుగా పనిచేశాడు. వీరి రచనలలో 'రాసలీల', 'ఋతుగానం', 'గోదా వైభవం', 'అశ్వత్థామ సుభద్ర', 'అపాండవము', 'స్వయంవరము', 'పురాణ పురుషుడు', 'పురుష మేధము', 'లోకయాత్ర' లు మంచి ప్రచారం పొందాయి. [[జయదేవుడు|జయదేవుని]] 'గీత గోవిందము'ను '[[పీయూష లహరి]]' అనే పేరుతో అచార్య తెలుగులోకి అనువదించారు.
 
ఈయన [[ఐరోపా]]లో పర్యటించి సనాతన భారత ధర్మానికి అక్కడ ప్రచారాన్ని కల్పించి, జగద్గురువుగా ఖ్యాతిగాంచాడు. 'వరల్డు టీచర్స్ ట్రస్టు' (జగద్గురు పీఠం) అనే సంస్థను స్థాపించి తన బోధనలు తగు ప్రచారం పొందే ఏర్పాటుచేసాడు. ఈయన కృషి ఫలితంగా [[జెనీవా]] నగరంలో [[మొరియా విశ్వవిద్యాలయం]] రూపొందింది. ఇది మానవ జీవితానికి ఆవశ్యకాలైన తత్వశాస్త్ర, వైద్యశాస్త్రాలను సమగ్రంగా సమన్వయించే విద్యాపీఠం. [[హోమియోపతి]] వైద్యవిధానం భారత దేశ ఆర్థిక పరిస్థితికి చక్కగా సరిపోతుందని భావించి, ఈయన కొన్ని కేంద్రాలలో ఉచిత హోమియో వైద్యాలయలను నెలకొల్పారు. ఈ వైద్యశాస్త్రాన్ని వివరించే సారస్వతాన్ని తెలుగులోను, ఆంగ్లంలోను రచించారు.