ఐ.కె.గుజ్రాల్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతీయులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: clean up, replaced: మరియు → , (3), typos fixed: జూన్ 12, 1975 → 1975 జూన్ 12, → , , → , (3)
పంక్తి 21:
అవిభాజిత పంజాబ్ లోని జీలం (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నది) లో ఒక గౌరవనీయమైన పంజాబీ ఖత్రీ (వర్తక కులం) కుటుంబములో పుట్టిన గుజ్రాల్ స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొని, 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్ళాడు.
 
భారత రాజకీయాలలో సంచలనాత్మక సమయమైన జూన్ 1975లో గుజ్రాల్ [[ఇందిరా గాంధీ]] మంత్రివర్గములో సమాచార మరియు, ప్రసరణ శాఖా మంత్రిగా పనిచేశాడు. 1975 జూన్ 12, 1975న12న [[అలహాబాదు]] ఉన్నత న్యాయస్థానం 1971 ఎన్నికలలో [[ఇందిరాగాంధీ]] చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని నిర్ణయించి ఆమె ఎన్నికను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఇందిరాగాంధీకి మద్దతుగా ఆమె కుమారుడు [[సంజయ్ గాంధీ]] పక్కనే ఉన్న [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రము నుండి ప్రజలను లారీలలో రాజధానికి తరలించి, పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను ఏర్పాటు చేశాడు. ఈ నిరసన ప్రదర్శనలకు ప్రభుత్వాధీనములో ఉన్న [[రేడియో]] మరియు, [[టీవీ]]లలో చూపించాలని గుజ్రాల్ ను సంజయ్ గాంధీ ఆజ్ఞాపించినట్టు వెల్లడైంది. అయితే రాజ్యంగబద్ధ అధికారమేదీ లేని సంజయ్ ఆజ్ఞను గుజ్రాల్ అంగీకరించలేదు. ఆ వెనువెంటనే సమాచార శాఖా మంత్రిగా గుజ్రాల్‌ను తొలగించి [[విద్యాచరణ్ శుక్లా]]ను నియమించడం వెనుక ఇదే కారణమని పలువులు భావిస్తున్నారు.
 
ఆ తరువాత, గుజ్రాల్ [[రష్యా]]లో భారతీయ రాయబారిగా నియమితుడయ్యాడు. 1980లో ఇందిరా గాంధీ తిరిగి అధికారము చేపట్టేసరికి, మాస్కోలో భారతీయ దౌత్యవేత్తగా గుజ్రాల్, 1979లో [[సోవియట్ సమాఖ్య]] యొక్క [[ఆఫ్ఘానిస్తాన్]] దురాక్రమణను ఖండించేందుకు ఆమెను ఒప్పించాడు. అప్పటివరకు [[హంగేరీ]] మరియు, [[చెకోస్లవేకియా]]లలో సోవియట్ యొక్క సైనికచర్యలను సమర్ధించిన భారతదేశానికి ఇది మునుపటి దౌత్య వైఖరి కంటే భిన్నమైనది. దీని పర్వవసానముగానే ఇందిరాగాంధీ ఏకాంత సమావేశములో సోవియట్ నాయకుడైన [[లియొనిడ్ బ్రెజ్నేవ్]]‌కు ఆఫ్ఘానిస్తాన్ విషయంలో మాస్కో పొరపాటు చేసిందని తెలియజేసింది.
భారత మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ (93) అనారోగ్యంతో కన్నుమూశారు. వూపిరితిత్తుల సంబంధిత వ్యాధితో గుర్గావ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దేశానికి 12వ ప్రధానిగా 1997 ఏప్రిల్‌ నుంచి 1998 మార్చి వరకు గుజ్రాల్‌ పనిచేశారు. [[భారత అత్యవసర స్థితి|ఎమర్జెన్సీ]] సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 1919 డిసెంబర్‌ 4న జన్మించిన ఇందర్‌ కుమార్‌ గుజ్రాల్‌ స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో [[జైలు]]కు వెళ్లారు. 1980లో కాంగ్రెస్‌ పార్టీని వీడారు. 1989లో జలంధర్‌ నుంచి [[లోక్‌సభ]]కు ఎన్నికయ్యారు. వీపీ సింగ్‌ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేవెగౌడ తర్వాత యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి నేతృత్వం వహించి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. గుజ్రాల్‌ సతీమణి షీలా గుజ్రాల్‌ పంజాబీ, [[హిందీ]], ఆంగ్ల... తదితరభాషలో అనేక రచనలు చేశారు. గుజ్రాల్‌ సోదరుడు సతీశ్‌ గుజ్రాల్‌ ప్రముఖ [[చిత్రకారుడు]].
 
"https://te.wikipedia.org/wiki/ఐ.కె.గుజ్రాల్" నుండి వెలికితీశారు