చిలుకూరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''చిలుకూరి నారాయణరావు''' ([[ఆగష్టు 9]], [[1889]] - [[జూన్ 22]], [[1951]]) భాషావేత్త, చరిత్రకారుడు మరియు, సంస్కృతాంధ్ర పండితుడు.
 
== జననం ==
ఈయన [[విశాఖపట్నం జిల్లా]], [[పొందూరు]] సమీపంలోని [[ఆనందపురం]]లో [[1889]], [[ఆగష్టు 9]] న జన్మించాడు. తండ్రి భీమాచారి. తల్లి లక్ష్మమ్మ. మాతృభాష [[కన్నడం]]. ఈయన [[శ్రీకాకుళం]] మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, [[పర్లాకిమిడి]] మరియు, [[విజయనగరం]] ల లోని [[మహారాజా కళాశాల]]లో చదివి పట్టభద్రులయ్యాడు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి [[తెలుగు]] మరియు, [[కన్నడ భాష|కన్నడం]] భాషలలో ఎం.ఏ. పట్టా పొందాడు. పదకొండవ శతాబ్దం నాటి ఆంధ్ర భాష గురించి పరిశోధన చేసి [[డాక్టరేట్]] పట్టా పొందాడు. ఉత్తర సర్కారు జిల్లాలలో [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] బోధన విధానం ప్రచారం చేయటానికి [[జె.ఎ.యేట్స్]]తో కలిసి కొంతకాలం పాఠశాల పరీక్షకుడుగా పనిచేశాడు. తరువాత అనంతపురం దత్తమండల కళాశాల (తరువాతి కాలంలో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ)లో ఆంధ్రోపన్యాసకుడిగా చాలాకాలం పనిచేశాడు. ఈయన [[ఆంధ్ర విశ్వకళా పరిషత్తు]] చే '[[కళాప్రపూర్ణ]]' బిరుదును, కాశీ సంస్కృత విద్యాపీఠంచే 'మహోపాధ్యాయ' బిరుదును పొందాడు. 'ఆంధ్ర బెర్నార్డ్ షా' అనే బిరుదుకూడ ఇతనికి ఉంది.
 
== మరణం ==