దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 4:
 
== చరిత్ర ==
భారతీయ సినిమా పరిశ్రమ [[ప్రపంచం]]లోనే అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ, కోట్ల ప్రజానీకానికి వినోదాన్ని, ఆటవిడుపునూ అందిస్తున్న సాధనం సినిమా. ఇటువంటి భారత సినీ పరీశ్రమకు ఆద్యునిగా పేరుగాంచింది [[దాదాసాహెబ్ ఫాల్కే]]. ఆయన అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. [[నాసిక్]] పట్టణానికి 30కిలోమీటర్ల దూరంలోని [[త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరం|త్రియంబకేశ్వరం]]లో జన్మించాడు. [[బొంబాయి]] లోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ మరియు, [[బరోడా]]లోని కళాభవన్‌లలో ఆయన విద్యాభ్యాసం చేశాడు.
 
1896లో ఆయన బొంబాయిలోని వాట్సన్ హోటల్‌లో [[ఏసుక్రీస్తు]] చరితం పై ప్రదర్శించబడిన సినిమాను చూడటం జరిగింది. ఆ ప్రభావంతో ఆయన హైందవ దేవతలను చూపుతూ సినిమాలు తియ్యాలన్న సంకల్పానికి వచ్చాడు. 1913లో ఆయన తీసిన [[రాజా హరిశ్చంద్ర (సినిమా)|రాజా హరిశ్చంద్ర]] సినిమాతో మొదలైన ఆయన సినీ జీవితం 19 సంవత్సరాలు సాగింది. సినీ నిర్మాతగా, దర్శకుడుగా, స్క్రీన్‌ప్లే-రచయితగా ఈ కాలంలో ఆయన 95 చిత్రాలను, 26 లఘుచిత్రాలను రూపొందించాడు. తాను ఎంతో ధనం సంపాదించినా అదంతా కూడా ఆయన సినీపరిశ్రమకు తిరిగి ఖర్చుచేశాడు. సినిమా పరిశ్రమలోని వాణిజ్య పరమైన విషయాలను ఆయన పెద్దగా పట్టించుకోలేదని చెప్పొచ్చు. [[భారతదేశం]]లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఆయన ఎంతో కృషిచేశాడు.
పంక్తి 14:
== అవార్డు వివరాలు ==
 
మొట్టమొదటి సారిగా 1969 లో ప్రకటించిన ఈ పురస్కారాన్ని నటీమణి [[దేవికా రాణి]]కి అందచేశారు. ఆ తర్వాత కాలంలో పృధ్వీ రాజ్ కపూర్, రూబీ మేయర్స్, బి.యన్ సర్కార్ లాంటి వాళ్ళకు ఈ అవార్డ్ అందచేశారు. కానీ మొట్టమొదటగా ఈ అవార్డు అందుకొన్న తెలుగు వారు మాత్రం బియన్ రెడ్డిగా పిలవబడే [[బి.ఎన్.రెడ్డి|బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి]]. తెలుగు వారే కాదు భారతదేశం గర్వించదగ్గ సినిమాలైన “మల్లీశ్వరి”, “[[బంగారు పాప]]” లాంటి అత్యుత్తమ సినిమాలు రూపొందించిన బి.యన్.రెడ్డి సోదరుడైన మరో బియన్ రెడ్డి కూడా ఈ పురస్కారాన్ని పొందడం విశేషం. నిజానికి బియన్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. ఇద్దరు తెలుగు బియన్ లు ఈ అవార్డ్ అందుకోగా మరో బియన్ అయిన బి యన్ సర్కార్ మరియు, బియన్ అనదగిన నితిన్ బోస్ కూడా ఈ పురస్కారం అందుకొన్నారు.
బియన్ రెడ్డి లతో పాటు ఈ అవార్డు అందుకొన్న తెలుగు వారిలో [[పైడి జైరాజ్]], [[ఎల్వీ ప్రసాద్]], [[అక్కినేని నాగేశ్వరరావు]], [[డి.రామానాయుడు]], [[కె. విశ్వనాథ్]] ఉన్నారు. దర్శకులు [[సత్యజిత్ రే]], [[అదూర్ గోపాల కృష్ణన్]], [[మృణాళ్ సేన్]], [[శ్యాం బెనగల్]], తపన్ సిన్హా, శాంతారాం, హృషికేష్ ముఖర్జీలు ఈ పురస్కారం అందుకొన్నారు. కేవలం దర్శకులే కాకుండా [[శివాజీ గణేశన్]], [[దిలీప్ కుమార్]], [[రాజ్ కుమార్]] లాంటి నటులు కూడా ఈ పురస్కారాన్ని అందుకొన్నారు. నేపథ్యగాయకులైన మన్నాడే, [[లతా మంగేష్కర్]], [[ఆశా భోంస్లే]] కూడా ఈ అవార్డు గ్రహీతలే.