దేవులపల్లి రామానుజరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 16:
'''దేవులపల్లి రామానుజరావు''' ప్రముఖ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు. ఆంధ్ర సాహిత్య, సాంస్కృతిక ఉద్యమ నిర్మాత. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రథమ కార్యదర్శి. తెలంగాణ విముక్తి పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని పోరాడిన సాహితీకారుడు. ఆయన తెలంగాణలో శోభ, [[గోలకొండ పత్రిక|గోల్కొండ]] పత్రికలకు సంపాదకుడిగా, [[సురవరం ప్రతాపరెడ్డి]] తర్వాత అంతటి సాహిత్య సేవ చేసిన సాహితీకారుడు. సహజ తెనుగు భాషలో పాండిత్యం సంపాదించి, చిత్త శుద్ధితో తెలుగు భాష సేవలో నిమగ్నమై ఫలితాలు సాసించిన తెలుగు భాషా సాధకుడు. 1950 నుండి 1979 వరకు [[ఉస్మానియా విశ్వవిద్యాలయము|ఉస్మానియా విశ్వవిద్యాలయం]] సెనేట్, సిండికేట్ సభ్యుడిగా ఉన్నారు. [[ఆంధ్ర సారస్వత పరిషత్తు]], [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి]], [[శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం]], [[కేంద్ర సాహిత్య అకాడమీ]]<nowiki/>లలో మూడు దశాబ్ధాలకు పైగా ప్రగాడ అనుబంధాలేర్పరచుకుని తెనుగు భాషా, రచనల పరివ్యాప్తికి మిక్కిలి కృషి చేశారు. గోల్కొండ పత్రిక సంపాదకుడిగా పనిచేశారు.<ref name="ఆయన గూర్చి సిలికానాంధ్ర లో">[http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/feb2010/telugutejomurthulu.html దేవులపల్లి రామానుజరావు గురించి సిలికానాంధ్ర లో]</ref>
 
[[ఆంగ్ల భాష|ఇంగ్లిషు]], [[తెలుగు]], [[ఉర్దూ]] భాషా ప్రవీణుడు, వక్త మరియు, పరిశోధకుడు. తెలుగు సంస్కృతి మీద మెండుగా అభిమానం ఉన్నవాడు.
 
==జీవిత విశేషాలు==
రామనుజరావు గారు [[ఆగష్టు 25]], [[1917]]<ref>{{Cite web|url=http://ramojifoundation.org/flipbook/201710/magazine.html#/40|title=తెలుగు భాషా సంస్కృతి పరిరక్షకుడు|date=October 2018|website=ramojifoundation.org|publisher=రామోజీ ఫౌండేషన్|last=ఆర్వీ|first=రామారావు}}</ref>లో [[వరంగల్లు]] పట్టణ సమీపాన ఉన్న [[దేశాయిపేట్ (గంభీరావుపేట్)|దేశాయి పేట]] గ్రామంలో వేంకట చలపతిరావు, ఆండాళ్ళమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. చిన్నతనంలోనే వంగపాడుకు దత్తతగా వచ్చాడు. ప్రాథమిక విద్యాభ్యాసం ఇంటివద్దనే పూర్తి చేశాడు. హైస్కూలు విద్య కోసం తొమ్మిదో తరగతిలో హనుమకొండ పాఠశాలలో చేరాడు. అప్పట్లో తెలుగులో విద్యాబోధన లేదు. కేవలం ఉర్దూ మరియు, ఆంగ్ల భాషల్లో మాత్రమే బోధన సాగేది. రామానుజ రావు ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నాడు. 1939 లో మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న నిజాం కళాశాల నుండి బి. ఎ. పట్టభద్రులైనారు. తరువాత 1942-44 మధ్య కాలంలో నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుండి ఎల్ ఎల్ బి పట్టా సాధించేరు. అక్కడే డాక్టర్ [[నటరాజ రామకృష్ణ]] గారితో పరిచయం ఏర్పడింది. రామానుజరావు పదహారు గ్రంథాలు రాయడమే కాక పెక్కు సంస్థలకు తన సేవలందించారు. 22 సంస్థలతో ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్యం కలిగి ఉండటమే కాక విద్యారంగంలోనూ, ఉస్మానియా యూనివర్సిటిలోనూ అనేక పదవులను సమర్థవంతంగా నిర్వహించారు.
 
సహకార రంగ వ్యాపార సంస్థ డైరెక్టర్‌గా, సాధారణ భీమా సంస్థ డైరెక్టర్‌గానూ పనిచేశారు. రాష్ట్రంలోని అనేక గ్రంథాలయాలకు పాలక సభ్యుడిగా, వ్యవస్థాపకుడిగా, పరిపాలకుడిగా తన విలువైన సేవలందించారు. హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొన్న ఆయన 1960-62 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు.