రఘునాథ నాయకుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''రఘునాథ నాయకుడు''' [[తంజావూరు]]ను ఏలిన తంజావూరు నాయక వంశపు మూడవ రాజు. తంజావూరు నాయక వంశపు రాజుల్లో అత్యంత ప్రసిద్ధుడు రఘునాథ నాయకుడు. ఇతడు 1600 నుండి 1634 వరకు పాలించాడు. [[కృష్ణదేవరాయలు|కృష్ణదేవరాయల]] అనంతరం అంతటివాడేకాక, అంతకుమించినవాడని ఎన్నదగిన ఆంధ్రభోజుడు. ఈయన రాజేకాకుండా [[సంస్కృతం]], [[తెలుగు]] ఉభయభాషలలోనూ కవిత్వం చెప్పగలవాడు. అంతేకాకుండా నూతన రాగాలను, తాళాలను కనిపెట్టి వీణల మేళవింపును సంస్కరించిన సంగీతశాస్త్ర నిపుణుడు. పారిజాతా హరణం అను గ్రంథమును చిరుత ప్రాయంలోనే [[సంస్కృతం]]లో రచించాడు. ఇప్పుడు లభిస్తున్న వీరి గ్రంథములు వాల్మీకి చరిత్ర, [[రామాయణము]] అను పద్య కావ్యములు, నల చరిత్ర అను [[ద్విపద]] కావ్యము, జానకీ కల్యాణం అను చాటు కావ్యం, రుక్మిణీ కల్యాణం అను యక్ష గానం లు. ఈయన పాలనలో తంజావూరు సాహిత్యానికి, కళలకు మరియు, [[కర్ణాటక సంగీతము]] నకు ప్రధాన కేంద్రమైనది.{{sfn|Vriddhagirisan|1942|pp=62–65}}
 
==ప్రారంభ జీవితం==
రఘునాథ నాయకుడు, అచ్యుతప్ప నాయకుని పెద్ద [[కుమారుడు]]. తండ్రి ఘోర తపస్సు చేసిన తర్వాత కలిగిన సంతానము. The ''రఘునాథాభ్యుదయము'' మరియు, ''సాహిత్యనాట్యకార''లో ఈయన బాల్య వివరాలు వివరంగా ఇవ్వబడినవి. బాలునిగా ఉన్నప్పుడే రఘునాథునికి శాస్త్రాలు, యుద్ధవిద్యలు మరియు, పాలనవ్యవహారాలలో మంచి శిక్షణ పొందాడు. రఘునాథ నాయకునికి అనేకమంది [[భార్యలు]] ఉండేవారు. ఈయన భార్యలలో ప్రముఖురాలైన కళావతి, "రఘునాథాభ్యుదయం"లో పట్టపురాణిగా వర్ణించబడింది. [[తంజావూరు]] నాయక వంశ చరిత్ర వ్రాసిన రామభద్రమ్మ రఘునాథుని భోగపత్ని{{sfn|Vriddhagirisan|1942|pp=62–65}}
 
తొలిరోజుల్లో రఘునాథ నాయకుడు గోల్కొండ రాజ్యంతో పోరాడి అందరి ప్రశంసలు అందుకొన్నాడు.{{sfn|Vriddhagirisan|1942|pp=62–65}} రఘునాథుడు1600లో రాజ్యపాలన బాధ్యతలను చేపట్టాడు. 1600 నుండి 1614 వరకు తండ్రితో సహపాలకునిగా పాలించాడు. 1614లో తండ్రి మరణం తర్వాత పట్టాభిషిక్తుడై, 1634లో మరణించేవరకు రాజ్యాన్ని పాలించాడు.
"https://te.wikipedia.org/wiki/రఘునాథ_నాయకుడు" నుండి వెలికితీశారు