రామదేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
'''రామ దేవుడు''', (లేదా '''వీర రామ దేవ రాయలు''') (క్రీ.శ 1617-1632) [[విజయనగర సామ్రాజ్యం|విజయనగర సామ్రాజ్యాన్ని]] పాలించిన ప్రభువు. 1614లో తండ్రి మరియు, ప్రభువైన రెండవ శ్రీరంగ రాయలు వరుసకు తన సోదరుడైన జగ్గారాయుడి చేత చంపబడిన తర్వాత 1617లో సింహాసనం అధిష్టించాడు. రెండవ శ్రీరంగ రాయల కుటుంబం మొత్తం చంపబడ్డా రెండవ వేంకటపతి దేవ రాయల నమ్మకస్తుడైన సేనాపతి యాచమ నాయుడు చెరసాల నుండి రామ దేవుడిని కాపాడాడు.
 
=='''అంతర్యుధ్ధం'''==
పంక్తి 10:
 
=='''తొప్పూరు యుధ్ధం'''==
అంతర్యుధ్ధంలో ఓడిపోయిన జగ్గారాయుడు మొదట అడవుల్లోకి పారిపోయినా తర్వాత మదురై, జింజి నాయకుల సహాయం కోరాడు. అప్పటికే [[విజయనగర సామ్రాజ్యం]] నుండి విడిపోయి సొంత పాలన చేయాలని వున్న మదురై మరియు, జింజి నాయకులు, యాచమ నాయుడు మరియు, రామ దేవుడి మీదకు దండెత్తారు. యాచమ నాయుడు మరియు, రామ దేవుడు [[తంజావూరు నాయకుల]] సహాయం కోరగా, విజయనగర పాలనను గౌరవిస్తున్న తంజావూరు నాయకులు అందుకు సమ్మతించారు.
 
==='''సైన్యం'''===
జగ్గారాయుడు, మదురై, జింజి నాయకులు మరియు, కొందరు [[పోర్చుగీసు]] వారు [[తిరుచ్చిరాపల్లి]] వద్ద పెద్ద సైన్యాన్ని మోహరించారు. యాచమ నాయుడు [[వెల్లూరు]] నుండి తన సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు. అతనికి దారిలో తంజావూరు నాయకుడి సైన్యం కలిసింది. [[కర్ణాటక]] నుండి కొంత, [[నెదర్లాండ్|డచ్చి]] మరియు, [[జాఫ్నా]] సైన్యాలు కూడా కలిశాయి.
 
1616 చివరి మాసాల్లో రెండు సైన్యాలు తిరుచ్చికి సమీపంలో [[కావేరి_నది|కావేరి నదికి]] ఉత్తరాన ఉన్న తొప్పూరు అనే ప్రదేశంలో ఎదురుపడ్డాయి. రెండు సైన్యాలు కలిపి పది లక్షల సైనికులు పోరాడిన ఈ యుధ్ధం [[దక్షిణ భారతదేశము|దక్షిణ భారతదేశంలో]] జరిగిన అతిపెద్ద యుధ్ధాలలో ఒకటిగా చెప్పబడింది.
 
==='''ఫలితం'''===
రాజ సైన్యం ధాటికి జగ్గారాయని సైన్యం నిలువలేకపోయింది. సైన్యాధ్యక్షులైన యాచమనాయుడు, తంజావూరు [[రఘునాథ నాయకుడు]] సైన్యాన్ని ఎంతో క్రమశిక్షణతో నడిపించారు. జగ్గారాయని సోదరుడైన యెతిరాజు ప్రాణాల కోసం పారిపోయాడు. [[మదురై నాయకుడు]] పారిపోవాలని చూసినా [[తిరుచ్చి]] దగ్గర పట్టుబడ్డాడు. [[వేంకటపతి దేవ రాయల]] కుమారుడిగా చెప్పబడుతున్న బాలుడు కూడా పట్టుబడ్డాడు. జింజీ నాయకుడు ఒక్క [[జింజీ కోట]] తప్ప మిగతా అన్ని కోటలను కోల్పోయాడు. 1617 మొదట్లో యాచమ మరియు, [[తంజావూరు నాయకులు]] 15 ఏళ్ళ రామ దేవుడిని రామ దేవ రాయలుగా పట్టాభిషేకం చేశారు.
 
=='''కొనసాగిన వైరం'''==
పంక్తి 27:
 
==='''యాచమ'''===
అంతర్యుధ్ధం తర్వాత సర్వసైన్యాధ్యక్షుడైన యాచమ నాయుడు యెతిరాజు కుమార్తెతో రామ రాయల వివాహాన్ని వ్యతిరేకించినా, రామరాయలు లెక్క చేయక వివాహం చేసుకున్నాడు. ఇది అవమానంగా భావించిన యాచమనాయుడు ముసలివాడైన తనని రాజాస్థానం నుండి విరమింపచేయాలని కోరాడు. ఇప్పుడు రామ రాయలికి మామ అయిన యెతిరాజు, అంతర్యుధ్ధం సమయంలో జగ్గారాయని నుంచి స్వాధీనం చేసుకున్న గొబ్బూరు ప్రాంతాన్ని తిరిగి ఇవ్వాలని యాచమ నాయుడిపై ఒత్తడి తెచ్చాడు. అందుకు సమ్మతించని యాచమనాయుడిపై తంజావూరు మరియు, జింజీ సైన్యాల సహాయంతో రాజ సైన్యం యచమ నాయుడు పాలిస్తున్న ప్రాంతాలపై దండెత్తింది. యాచమ నాయుడి సైన్యం చిన్నదైనా ఎంతో గొప్పగా పోరాడి యెతిరాజు సైన్యాన్ని నిలువరించింది. ఎంతోకాలం సాగిన ముట్టడి తర్వాత గొబ్బూరు ప్రాంతాన్ని తిరిగి ఇవ్వడానికి యాచమ నాయుడు సమ్మతించాడు. [[పులికాట్_సరస్సు|పులికాటు]], [[చెంగల్పట్టు]] మరియు, [[మధురాంతకం]] ప్రాంతాలు పూర్తిగా [[వేలూరు (తమిళనాడు)|వెల్లూరు]] ఏలుబడిలోకి వచ్చాయి. [[వెంకటగిరి]] ప్రాంతాన్ని పాలించడానికి యాచమనాయుడికి అవకాశం వున్నా తన చివరి రోజులను ఉదయారుపాళ్యం సేనాపతి రక్షణలో గడపడానికి నిశ్చయించుకున్నాడు.
 
=='''వారసుడు'''==
"https://te.wikipedia.org/wiki/రామదేవ_రాయలు" నుండి వెలికితీశారు