కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎రచయిత గురించి: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 5:
కేతు విశ్వనాథరెడ్డి కథలు అనే కథాసంపుటం [[విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్]],[[హైదరాబాద్]] వారిచే ప్రచురింపబడింది.ఈ పుస్తకము 13 కథల సంకలనము.ఇవన్నీ 1998 నుండి 2003 వరకు వివిధ పత్రికలలో ప్రచరింపబడినవే.విశాలాంధ్ర పబ్లిషింగ్ వారు ఈ పుస్తకాన్ని 2004 వ సంవత్సరం మేనెలలో పాఠకులకు అందించారు.మొదటి ముద్రణ 1000 పుస్తకములు. ముఖపత్ర చిత్రాన్ని చంద్ర (సాహిత్య ప్రస్థానం-సాహీతీ స్రవంతీ సౌజన్యంతో)గీసారు. [[పుస్తకము|పుస్తకం]]<nowiki/>లోని అక్షరాలంకారాన్ని ట్వంటీఫస్ట్‌ సెంచరీ,దిల్‌సుఖ్‌నగర్‌ వారు చెయ్యగా,పుస్తకముద్రణ శ్రీ కళాంజళి గ్రాఫిక్స్,[[హిమాయత్‌నగర్]]లో జరిగింది.ఈ కథలసంపుటాన్ని రచయిత తన వియ్యంకుడు.కీర్తిశేషుడైన గోళ్లమూడి సుందరరామిరెడ్డి (1933-1991)కి అంకితమిచ్చాడు. పుస్తకం చివర-కథలు చదివిన తరువాత పాథకులతో పదినిమిషాలు- అంటూ '''వల్లంపాటి వెంకట సుబ్బయ్య'''గారు చక్కని పీఠిక అందించారు.
==రచయిత గురించి==
కేతు విశ్వనాథరెడ్ది [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] లోని [[రాయలసీమ]] ప్రాంతానికి చెందినవాడు. బహుముఖప్రజ్ఞాశాలి. దాదాపు 1961 నుండి రచానావ్యాసంగంలో వున్నవాడు. ఈ పుస్తకం కన్నముందు ''జప్తు'',''కేతు విశ్వనాథరెడ్డి కథలు'' మరియు, ''' ఇచ్ఛాగ్ని ''' అనే మూడు కథలసంపుటాలు కూడా వెలువడ్డాయి.ఈ కథలతోపాటు '''వేర్లు ''','''బోధి''' అనే రెండు నవలికల్నికుడా వ్రాసాడు. తన కథలకు ముందుమాటలు అవసరం లేని రచయిత, కేతు విశ్వనాథరెడ్డిది మొదటి నుండి సాహిత్యవిమర్శ మీద, కల్పనా సాహిత్యం మీద శ్రద్డా, అసక్తి,పట్టు వున్న వ్యక్తి. తన [[సాహిత్యం|సాహిత్య]] విమర్శావ్యాసాలలోకొన్నింటిని '''దృష్టి ''' అన్న సంపుటంగా విడుదలచేసాడు.సాహిత్య పరిశోధనరంగం మీదకూడా ఈయన మౌలికమైన కృషిచేశాడు. ఎందరో విద్యార్థులచే కల్పనాసాహిత్యం మీద [[పరిశోధన]]<nowiki/>లు చేయించాడు. తెలుగు భాషా సాహిత్యాల పాఠ్య ప్రణాళికల్ని చేరా గారితో కలసి రూపొందించారు. [[కొడవటిగంటి]] సాహిత్యాన్ని సంపాదించి ప్రచురించుటకు ఆయన చేసిన కృషి అపురూపం. ఈయనకు ఎన్నో వ్యాసాంగాలున్న ఆయనగారి ఆత్మ వ్యాసంగం మాత్రం-కథారచనే. కేతు విశ్వనాథరెడ్డి గారిపేరు వినగానే ఆయన కలంనుండి జాలువారిన '''నమ్ముకున్న నేల ''',''' కూలిన బురుజు''', '''పీర్లచావడి''','''గడ్డి''','''దాపుడుకోక''','''జప్తు'''వంటి ఎన్నో కథలు జ్ఞాపకానికొస్తాయి.కేతుగారు వుద్యోగరీత్యా నగరవాసి అయినప్పటికి,[[కడప]]జిల్లాను,పల్లెప్రజలను,మట్టివాసనను మరువలేదు.విశ్వనాథరెడ్ది గారు తనజీవితంలో భాగాలైన విశ్వవిద్యాలయాలగురించి, నగరాలగురించి అరుదుగా కొన్ని రచనలు చేసినప్పటికి వాటి మూలాలు [[రాయలసీమ]]లోని పల్లెలను పలుకరిస్తాయి. రాయలసీమ ప్రజల జీవితాలకు సంబంధించిన ప్రత్యేకాంశలను సాధ్యమైనంత కళాత్మకంగా తన కథలలో చూపించడం రచయిత యొక్క ప్రత్యేకత.
 
==పుస్తకంలోని కథలేమంటున్నాయి?==