శీను వాసంతి లక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కథ: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 11:
 
==కథ==
చుట్టూరా [[కొండలు]], పచ్చదనం, సెలయేళ్ళ మధ్య ఓ అందమైన [[పల్లెటూరు]]. నది ఒడ్డునే ఓ గుడిసె. అందులో శీను (ఆర్. పి. పట్నాయక్), తండ్రి (నూతన్ ప్రసాద్), తల్లి, మరియు చెల్లెలు వాసంతి (ప్రియ) తో కలిసి నివసిస్తుంటాడు. శీను పుట్టుకతోనే [[అంధత్వం|అంధుడు]]. కానీ అతనికి అద్భుతమైన గాత్రం ఉంటుంది. వీధుల్లో, రోడ్డు పక్కన [[పాటలు]] పాడుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తుంటాడు. తండ్రి మాత్రం అతని అంధత్వాన్ని ఎప్పుడూ హేళన చేస్తుంటాడు. వాళ్ళ ఇంటి పక్కనే మాటలు రాని ఓ అమ్మాయి లక్ష్మి (నవనీత్ కౌర్) శీనును ఆరాధిస్తుంటుంది.
 
గ్రామంలో పెద్ద మనిషి అయిన అప్పలనాయుడు ([[ప్రకాష్ రాజ్]]), ఓ మంత్రి కొడుకును, అతని భార్యను వెంటబెట్టుకుని ఆటవిడుపు కోసం ఆ గ్రామానికి వస్తాడు. అప్పల నాయుడంటే ఆ గ్రామంలో శీనుతో సహా అందరికీ మంచి గౌరవం ఉంటుంది. శీను తల్లి కూడా వాళ్ళ భవంతిలోనే పనిమనిషిగా ఉంటుంది. అప్పలనాయుడు సాయంతో శీను ఓ కంటి వైద్యుణ్ణి కలిసి తనకు ఓ దాత, మరియు ధనం సమకూరితే తనకు చూపు వస్తుందని తెలుసుకుంటాడు. అప్పలనాయుడు [[శస్త్రచికిత్స]]<nowiki/>కు కావలసిన ధనసహాయం చేయడానికి ముందుకు వస్తాడు. లక్ష్మి తన అమాయకత్వంతో తన ఒక [[నేత్రదానం|కంటిని దానం]] చేయడానికి సిద్ధ పడుతుంది.
 
ఓ రోజు అప్పల నాయుడు, మంత్రి కొడుకు వాసంతి, లక్ష్మిని చూసి తమ భవనంలోకి పిలిచి వారిమీద అత్యాచారం చేస్తారు. కానీ వారు ఆ విషయం బయటికి చెబితే శీను ఆపరేషన్ ఆగిపోతుందని ఎవరికీ చెప్పరు. శీను కోసం జరిగిందంతా మరిచిపోయి మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఇది అవకాశంగా తీసుకున్న నాయుడు, మంత్రి కొడుకు వారిని మళ్ళీ బంగళాకు రమ్మని ఒత్తిడి చేస్తుంటారు. ఈ విషయాలేమీ తెలియని శీను నాయుడిని గుడ్డిగా నమ్ముతూ తన చెల్లెలి [[పెళ్ళి]] కూడా నిర్ణయిస్తాడు. చివరికి శీను అప్పలనాయుడు మోసాన్ని తెలుసుకుంటాడా, తెలుసుకుని ఏం చేస్తాడన్నది మిగతా కథ.