మాస్టర్ శరత్ చంద్ర [[శ్రీకాకుళం జిల్లా]] లోని [[గార]] మండలం లంకపేట గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు పద్మావతి మరియు, బ్రహ్మంలు. ఈయన తండ్రి కూడా సంగీత కళాకారుడే. తన తండ్రి వద్ద తన 11 వ యేటనే [[హార్మోనియం]] నేర్చుకుని పౌరాణిక నాటకాలలో తన తండ్రితో పాటు వెళ్ళి హార్మోనిస్టుగా రాణించారు. 1994 లో [[గరివిడి]] ప్రాంతంలో ఎలిశెట్టి రాంబాబు గారి వద్ద చేరి సంగీతం నేర్చుకున్నారు. తదుపరి ఆయన సహకారంతో ఘంటశాల సంగీత సమాఖ్యను ఏర్పాటు చేశారు. అనేక సంగీత విభారలును నిర్వహించారు. ఈయన గానం, [[కీ బోర్డు]] ప్లే ఎందరో సంగీత అభిమానులను, కళా ప్రియులను, సినీ దిగ్గజాలను అబ్బురపరచింది. మహానటుడు [[అక్కినేని నాగేశ్వరరావు]], [[కాంతారావు]], డాక్టర్. సి నారాయణరెడ్డి , [[జమున]], [[అంజలీదేవి]], ప్రసిద్ధ సినీ సంగీత దర్శకులు, గాయకుల ఆశీస్సులు అందుకున్నారు. వారి అభినందనలు పొందారు. డాక్టర్ ఎన్ జాగృతి కోరమండల్ సిమెంట్ అధినేతలు లక్ష్మీచంద్రమోహన్ దంపతులు, కళాపోషకులు ఎన్.ఆనంద్నాయుడు సహకారంతో రాష్ర్త్టంలోని అన్ని జిల్లాల్లో [[ఘంటసాల]] స్వర జైత్రయాత్ర చేసి అపరఘంటసాలగా కీర్తిని పొందారు శరత్చంద్ర.