ఆయన హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 1966లో తొలిసారి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఎన్నికై వరుసగా 1966, 1972, 1978 మరియు, 1984 లలో తిరిగి ఎన్నికై, 19 సంవత్సరాల పాటు శాసనమండలి సభ్యుడిగా సేవలందించారు. 1984లో అప్పటి [[ఎన్టీఆర్]] ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేసే వరకు రామారావు బీజేపీ పక్ష నేతగా శాసనమండలిలో బాధ్యతలు నిర్వర్తించారు. పలు లెజిస్లేటివ్ కమిటీలలో సభ్యునిగా కొనసాగారు. ఆయన పార్టీ ఫ్లోర్ లీడరుగా కూడా వ్యవహరించారు. 1993లో ఆంధ్రప్రదేశ్ భాజపా పార్టీ పగ్గాలు చేపట్టి, 1997 వరకు ఆ పదవిలో కొనసాగారు. అనంతర కాలంలో పార్టీ జాతీయ వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషించారు. 2002లో పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్లో, కేంద్రంలో భాజపా భాగస్వామిగా ఉన్న కాలాల్లో రామారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్, ఉస్మానియా విశ్వవిద్యాలయపు సెనేట్ బాధ్యతలు నిర్వహించారు.