అమరావతి సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''అమరావతీ సంస్థానం''' భారతదేశంలోని ఒక ప్రముఖ సంస్థానం. సంస్థానం పాలకులుగా వాసిరెడ్డి వంశానికి చెందిన వారు కీర్తి గడించారు. కాకతీయ రాజుల సామంతులుగా వాసిరెడ్డి నాయకులు [[తీరాంధ్ర]] దేశమును పాలించి ప్రఖ్యాతి గాంచిరి. పిఠాపురంలో ఉన్న 1413 A.D. సంవత్సరం నాటి శాసనం ఆధారంగా వాసిరెడ్డి నాయకులు, కాకతీయ సామ్రాజ్య వారసులైన ముసునూరి నాయకుల కాలంలో పిఠాపురం రాజ్యన్ని సామంతులుగా రాజ్య పాలన చేస్తుండేవారు. ఈ వంశమునకు చెందిన వారందరికీ గల ''చాళుక్య నారాయణ'' అను బిరుదును బట్టి వీరు [[చాళుక్యులు|చాళుక్య]] సంతతికి చెందినవారని చరిత్రకారుల అభిప్రాయము.
రాజా వేంకటాద్రి నాయుడు గారు [[చింతపల్లి]] నుండి [[అమరావతి (గ్రామం)|అమరావతి]]
==చరిత్ర==
పంక్తి 21:
పేరు ప్రఖ్యాతులు పొందిన వాసిరెడ్డి వంశస్థులలో చినపద్మనాభ రామన్నఒకడు. క్రీ. శ. 1685లో [[తానీషా]] నుండి 500 గ్రామాలు పొందుతాడు. రామన్న అబుల్ హసన్ తానీషాను సందర్శించిన ఒక సందర్భములో సుల్తాను మదించిన అశ్వాన్ని లొంగదీయలేక తంటాలు పడుతుండగా రామన్న చూసి, గుర్రాన్ని మచ్చిక చేసుకొని స్వారీ చేసి వస్తాడు. సంతసించిన సుల్తాను రామన్నను నందిగామ, [[ఖమ్మం|ఖమ్మంమెట్టు]], [[వినుకొండ]], [[కొండవీడు]] మొదలైన 500 గ్రామాలకు సర్దేశముఖ్గా నియమించాడు. చింతపల్లి కోటను గట్టిపరచి శత్రుదుర్భేద్యము చేస్తాడు. క్రీ. శ. 1710 వరకు పాలన సాగిస్తాడు. తదుపరి రామన్న వారసులు బుచ్చిరాఘవ, పెదనరసన్న, చిననరసన్న, చినరామలింగ, చంద్రమౌళి, రాజమౌళి, లక్ష్మీపతి క్రీ. శ. 1760 వరకు పాలిస్తారు.
క్రీ. శ. 1763లో జగ్గయ్య చింతపల్లిని పాలిస్తున్న సమయములో ఫ్రెంచి వారికి బ్రిటిషు వారికి ఆంధ్రదేశముపై ఆధిపత్యము కొరకు సంఘర్షణ మొదలవుతుంది. [[బ్రిటిషు]]
==వేంకటాద్రి నాయుడు==
|