మయొట్టె: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 46:
వెస్టు ఇండీస్, రీయూనియన్ జాగృతమయ్యే సమయంలో మాయొట్టెను ఒక చక్కెర ద్వీపంగా చేయాలని ఫ్రెంచిప్రభుత్వం ప్రణాళిక వేసింది. లోతైన ఏటవాలుప్రాంతాలు ఉన్నప్పటికీ తోటలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబడ్డాయి. 1851 నుండి అభివృద్ధిలో భాగంగా 17 చక్కెర ఫ్యాక్టరీలు నిర్మించి వందలాది విదేశీ కార్మికులు (ప్రధానంగా ఆఫ్రికన్ (ప్రత్యేకంగా మొజాంబిక్) చెందిన వారు) నియమించబడ్డారు. అయితే ఉత్పత్తి మాత్రం ఆశించినంత సాధించలేక పోయారు. 1883-1885 చక్కెర సంక్షోభం మయొట్టెలో చెరకు పంట ముగింపుకు దారితీసింది. ఫలితంగా కొన్ని ఫ్యాక్టరీ అవశేషాలు మాత్రమే మయొట్టెలో మిగిలాయి. వీటిలో కొన్నింటిని ఇప్పటికీ చూడవచ్చు. 1955 లో జౌమొగ్నె ద్వీపంలో ఉన్న ఫ్యాక్టరీ చివరిగా మూసివేయబడింది. ద్వీపానికి దక్షిణంలో ఉన్న సౌలౌ చక్కెర ప్లాంటు చక్కగా సంరక్షించబడింది.
1885 లో బెర్లిన్ సదస్సులో ఫ్రాన్సు మొత్తం కొమొరోస్ ద్వీపసమూహం మీద నియంత్రణ సాధించింది. వాస్తవానికి ఈ ప్రాంతం అప్పటికే ఫ్రెంచిపాలనలో ఉంది. కాలనీ పేరు మాత్రం "మాయొట్టి అండు డిపెండెంసీలు" అనే ఉంది.
1898 లో రెండు తుఫానులు ద్వీపాన్ని నేలమట్టం చేసాయి. ప్రాణాలతో బయటపడినవారి ప్రాణాలను మశూచి మహమ్మారి మట్టుపెట్టింది. మాయొట్టి మరోసారి మొదలు నుండి జీవనం ప్రారంభించింది. ఫ్రెంచ్ ప్రభుత్వం మొజాంబిక్, కొమొరోస్, మడగాస్కర్ నుండి తీసుకుని వచ్చిన కార్మికులతో ద్వీపంలో తిరిగి మానవనివాసితంగా మారింది. చక్కెర పరిశ్రమ వదిలివేయబడి ఆస్థానం వనిల్లా, కాఫీ, కొబ్బరి, నువ్వుల భర్తీ చేయబడింది. తరువాత ద్వీపంలో వెటివేర్, క్రిమిసంహారిక తైలము, ముఖ్యంగా చందనం (లాంగ్-లాంగ్) వంటి సువాసన మొక్కల పంటలు అభివృద్ధి చేయబడ్డాయి. తరువాతి కాలంలో ద్వీపం చిహ్నాలలో సుగంధద్రవ్యాలు ఒకటి అయ్యాయి.
[[File:Comores carte.png|thumb|Map of the Comoros Union (three island on the left) and the Mayotte French departement (right)]]
|