మొఘల్ చిత్రకళ: కూర్పుల మధ్య తేడాలు

గ్రంథ చిత్రణ
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 17:
==మొఘల్ చిత్రకళ-ఆవిర్భావం==
మొఘల్ చిత్రకళకు మూలం పర్షియన్ చిత్రకళ. ఈ పర్షియన్ చిత్రకళ మంగోలియన్ చిత్రకళ చేత ప్రభావితమైంది. పర్షియాలో సఫావి (Safawi) రాజవంశీయులు ఈ చిత్రకళాభిమానంతో మంగోలియన్ చిత్రకారులను తమదేశానికి ఆహ్వానించి వారిచే తమ ప్రజలకు ఈ చిత్రకళారీతిని నేర్పింప చేశారు. పర్షియా సఫావి సుల్తాన్ అయిన 'షా ఇస్మాయిల్' కాలంలో, బిహజాద్, మిరాక్ వంటి విఖ్యాత చిత్రకారుల కృషితో ఈ మంగోలియన్ చిత్రకళ పూర్తిస్థాయి పర్షియన్ చిత్రకళగా రూపుదిద్దుకొంది. భారతదేశంలో మొఘుల్ చక్రవర్తి హుమాయూన్ పదవీచ్యుతుడైపదవీచ్యుతుడైనపుడు దేశం వదిలి పర్షియాలో తలదాచుకోవాల్సి వచ్చిందితలదాచుకొన్నాడు. సహజంగా చిత్రకళాభిమాని అయిన హుమాయూన్ పర్షియాలో ఆశ్రయం పొందుతున్నప్పుడు, అక్కడి ఆస్థాన చిత్రకారులైనఅక్కడ బిహజాద్ వంటి మేటి ఆస్థాన చిత్రకారుల పరిచయంతోపరిచయ సంపర్కంతో ఈ పర్షియన్ చిత్ర శైలి పట్ల అమితంగా ఆకర్షితుడయ్యాడు. క్రీ.శ. 1555 లో తిరిగి భారతదేశానికి వచ్చిన తరువాత తనతోపాటు మీరు సయ్యద్ ఆలీ, క్వాజా అబ్దుస్ సమద్ అనే విఖ్యాత చిత్రకారులను తీసుకొనివచ్చాడు. ముఖ్యంగా క్వాజా అబ్దుస్ సమద్ రాకతో భారతదేశంలో మొఘల్ చిత్రకళ ప్రారంభం అయినట్లుగా చెప్పవచ్చు. 1562 నాటికి సుల్తాన్ దర్బారులో కొలువుతీరిన పర్షియన్ చిత్రకారులు భారతీయ చిత్రకారులకు తమ నూతన చిత్రకళారీతులను నేర్పించడం ప్రారంభించారు. దానితో భారతదేశంలో మొఘల్ చిత్రకళ వేళ్లూనుకోవడం ప్రారంభించిందిప్రారంభమైంది.
ఈ విధంగా మంగోలియన్ చిత్రకళ పర్షియాలో పర్షియన్-మంగోలియన్ పద్దతిగా ఏర్పడింది. 1560 వరకు భారతదేశంలో ఈ పద్దతి అమలులో ఉండేది 1562 నాటికి ఇది అప్పటికే భారతదేశంలో వాడుకలో వున్న స్థానిక విజయనగరం, బీజాపూర్, అహ్మద్ నగర్, రాజపుత్ర చిత్రకళా పద్దతులతో కలసి భారత-పర్షియా-మంగోలియా సమ్మేళన రీతిగా రూపొందింది. దీనినే మొఘల్ చిత్రకళా రీతి అని వ్యవహరిస్తారు. 1562 లో చిత్రించిన "అక్బర్ దర్బార్ లో తాన్ సేన్ ప్రవేశించిన దృశ్యం" చిత్రపటంలో ఈ మొఘల్ చిత్రకళా రీతి మొట్టమొదటగా కనిపిస్తుందని విమర్శకులు పేర్కొంటారు.
పంక్తి 31:
మొఘల్ చిత్ర శైలిలో వెలువడిన సచిత్ర గ్రంధాలలో (ఇలస్ట్రేటెడ్ గ్రంధాలు) 1550 నాటి తుతినామ గ్రంధం బహుశా మొట్టమొదటిది కావచ్చు. ఆగ్రా రాచరిక చిత్రశాలలో రూపుదిద్దుకున్న ఈ గ్రంధం ప్రస్తుతం అమెరికా లోని క్లీవ్‌ల్యాండ్ ఆర్ట్‌ మ్యూజియంలో ఉంది. దీనిలో సుమారు 250 వరకు సరళమైన లఘుచిత్రాలు (miniatures) వున్నాయి. దీనితో పోలిస్తే అక్బర్ చే పురమాయించబడిన "హంజనామా" అనే పర్షియన్ బృహత్గ్రంధం (4800 పేజీలతో, 46 సంపుటిలతో ఉండేది) చాలా విశిష్టమైనది. అసాధారణమైన పెద్ద పేజీలతో (69 సెం.మీ. x 54 సెం.మీ.) వున్న ఈ గ్రంధంలో అందులోను సాధారణ కాగితం మీద కాకుండా ఒక పెద్ద నూలు వస్త్రంపై దాదాపు 1,400 కు పైగా లఘుచిత్రాలు చిత్రించబడ్డాయి. అమీర్ హంజా అనే పారశీక వీరుని ప్రేమగాధావృత్తంతో కూడి వున్న ఈ గ్రంథంలో శృంగార సన్నివేశాలు, బెదిరింపు సంఘటనలు, తృటిలో తప్పించుకోనే దృశ్యాలు, హింసాత్మక దృశ్యాలు-ఇత్యాది దృశ్యాలను వివరిస్తూ అనేక చిత్రాలు గీయబడ్డాయి. ఈ గ్రంధానికి బొమ్మలు సమకూర్చడం 1562 లో ప్రారంభమై 1577 వరకూ అంటే 14 సంవత్సరాల సుదీర్ఘ కాలం కొనసాగింది. ఈ బృహత్కార్యానికి మొదట సయ్యద్ ఆలీ తబ్రీజి తరువాత అబ్దుస్ సమద్ చిత్రకారులు నేతృత్వం వహించారు. ఈ అసాధారణ చిత్ర రచనా కృషిలో భారతదేశం నలుమూలల నుండి వచ్చిన సుమారు వంద మందికి పైగా చిత్రకారులు సమిష్టిగా పాలుపంచుకున్నారు. అక్బర్ యొక్క రాతప్రతి (manuscript) లో దాదాపు 1400 లఘుచిత్రాలు ఉన్నాయి. ఈ గ్రంధంలో ప్రతీ పేజీని తెరవగానే ఒక లఘుచిత్రం, ఆ చిత్రాన్ని చూసిన చక్రవర్తికి అర్థమయ్యేటట్లు ఆ పేజీ వెనుక భాగాన చిత్రానికి సంబంధిత వచనం వ్రాయబడింది. 1580 నాటికి మొఘల్ రాచరిక చిత్రశాల ఇటువంటి అనేక గ్రంధాలకు చిత్రరచన చేయించింది.
 
మొఘల్ రాజవంశపు జీవిత చరిత్ర గ్రంధాలు కూడా లఘుచిత్రాలతో చిత్రించబడ్డాయి. ఈ సంప్రదాయం బాబర్ నామా గ్రంధంతో ప్రారంభమైనప్పటికీ, అక్బర్ కి ముందున్న కాలంలో రాచరిక జీవితచరిత్ర గ్రంధాలకు చిత్రాలు సమకూర్చబడలేదు. తుర్కీ భాషలో వున్న బాబర్ స్వీయ చరిత్ర 'తుజ్ కీ బాబరీ'ను అతని మనవడు అక్బర్ పర్షియన్ భాషలోకి బాబర్ నామా (1589) పేరుతొ అనువదింపచేసాడు. తరువాత దానిని నాలుగు విలాసవంతమైనసుందరమైన సచిత్ర రాతప్రతులలో చిత్రింపచేసాడు. ఒక్కొక్క ప్రతిలో 183 లఘుచిత్రాలు ఉన్నాయి. అక్బర్ జీవిత చరిత్రను అబ్దుల్ ఫైజీ 'అక్బర్ నామా' పేరుతొ పర్షియన్ భాషలో వ్రాయడం జరిగింది. 1594 లో పూర్తయిన అక్బర్ నామా సచిత్ర గ్రంథ చిత్రరచనాకృషిలో బసవన్ వంటి ప్రఖ్యాత చిత్రకారునితో సహా మొత్తం 49 మంది చిత్రకారులు పాలుపంచుకున్నారు. 116 లఘుచిత్రాలతో వున్న అక్బర్ నామా సచిత్ర రాత ప్రతి ప్రస్తుతం లండన్ లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో వుంది. అదేవిధంగా జహంగీర్ స్వీయ చరిత్ర జహంగీర్ నామా (తజక్-ఎ-జహంగీరి), షాజహాన్ జీవిత చరిత్ర 'పాద్ షా నామా' గ్రంధాలకు అద్భుతమైన లఘుచిత్రాలు కూర్చడం జరిగింది.
 
{{భారతీయ చిత్రకళ}}
"https://te.wikipedia.org/wiki/మొఘల్_చిత్రకళ" నుండి వెలికితీశారు