కొమురం భీమ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →ఉద్యమ జీవితం: AWB తో "మరియు" ల తొలగింపు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 35:
}}
'''కొమురం
==బాల్యం==
కొమురం భీమ్ గిరిజన [[గోండు]] తెగకు చెందిన కొమురం చిన్నూమ్, సోంబాయి దంపతులకు [[1901]] సంవత్సరంలో [[ఆదిలాబాద్|ఆదిలాబాద్ జిల్లా]], [[ఆసిఫాబాద్]]
==ఉద్యమ జీవితం==
భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మక మైనవి. ఆదివాసీలపై [[నిజాం]] నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమురం
భీం కుటుంబం పదిహేడేళ్ళ వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది. అక్కడ వాళ్ళు సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సాం వెళ్ళిపోయాడు. అక్కడ ఐదేళ్ళపాటు [[కాఫీ]], [[తేయాకు]] తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్ తిరిగి కరిమెర చేరుకున్నాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు, జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబు పై [[గెరిల్లా]] పోరాటాన్ని కొనసాగించాడు. భీమ్ కు కుడిభజంగా [[కొమురం సూరు]] కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు.<ref name="జోడేఘాట్ వీరుడు కుమ్రం సూరు">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=ఎడిటోరియల్ |title=జోడేఘాట్ వీరుడు కుమ్రం సూరు |url=https://www.andhrajyothy.com/artical?SID=330017 |accessdate=22 October 2019 |work=www.andhrajyothy.com |publisher=గుమ్మడి లక్ష్మీనారాయణ |date=5 November 2016 |archiveurl=https://web.archive.org/web/20161108025824/https://www.andhrajyothy.com/artical?SID=330017 |archivedate=8 నవంబర్ 2016 |language=te |url-status=live }}</ref> [[వెడ్మ రాము]]<ref name="కుమ్రం భీము మెచ్చిన రాము">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=ఎడిటోరియల్ |title=కుమ్రం భీము మెచ్చిన రాము |url=https://www.ntnews.com/Editpage/~/Editorial-News-in-Telugu/కుమ్రం-భీము-మెచ్చిన-రాము-1-7-492333.html |accessdate=7 November 2019 |work=www.ntnews.com |publisher=డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ |date=26 October 2016 |archiveurl=https://web.archive.org/web/20191107192619/https://www.ntnews.com/Editpage/~/Editorial-News-in-Telugu/%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82-%E0%B0%AD%E0%B1%80%E0%B0%AE%E0%B1%81-%E0%B0%AE%E0%B1%86%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B1%81-1-7-492333.html |archivedate=7 నవంబర్ 2019 |url-status=live }}</ref> కూడా భీమ్ కు సహచరుడిగా ఉన్నాడు. [[కుర్దు పటేల్]] అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 అక్టోబర్ 27 న జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ ని హతమార్చాయి. నిజాం సైన్యంమీద, అటవీ సిబ్బంది పైనా కొమరం [[కొదమసింహం]] లా గర్జించాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో, అర్ధరాత్రి కొమరం స్థావరాలను సైన్యం చుట్టుముట్టగా జోడేఘాట్ అడవుల్లో [[1940]], [[అక్టోబర్ 27]] న, అంటే ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజున కొమరం భీమ్ వీరమరణం పొందాడు. అప్పటి నుంచీ ఆ తిథి రోజునే
==నేటి పోరాటాలకు స్ఫూర్తి==
[[దస్త్రం:Komaram.jpg|thumb|ఆదిలాబాద్ జిల్లా కుంతాల జలపాతం వద్ద కొమురం భీము విగ్రహం|alt=|333x333px]]
ఆ దివాసీ ఆత్మగౌరవ ప్రతీక కొమురం
ఆదిలాబాద్ జిల్లాలోని గోండులు ఎప్పటికీ ఒక రాజ్య భావనలో ఇమిడిలేరు. వారు స్వేచ్ఛా ప్రియులు. వారి జీవనాధారమైన అడివినుంచి వారిని తరిమేసే విధానాలు, చట్టాలతో వారు తలపడ్డారు. ఆదివాసీ ఆవాసాల్లోకి గిరిజనేతర భూస్వాముల వలస నిరాటంకంగా సాగింది. పోడు వ్యవసాయం గోండుల జీవనాధారం. అడవిని నరికి పంటవేస్తే అది జంగ్లాత్ భూమి అని ఒకరు, కాదు [[రెవెన్యూ డివిజన్|రెవెన్యూ]] భూమి అని మరొకరు వచ్చి గోండులను వారి భూముల నుంచి తరిమేశారు. పంటలను ధ్వంసం చేశారు. జరిమానాలతో వేధించారు. ఈవేధింపులు, అణచివేతల నేపథ్యంలోంచే..ఆదిలాబాద్ గోండన్నలు పోరుబాట పట్టారు.తమ విముక్తి కోసం పోరాట జెండాపట్టారు. ‘మాఊర్లో మా రాజ్యం’అంటూ పన్నెండు గూడాలు బాబేఝరి లోద్దుల్లో తుడుం మోగించాయి. కొమురంభీం నాయకత్వంలో ఆదివాసులు సంఘటితమై తమపై జులుం చేస్తున్న దోపిడీవర్గాలపై తుడుం మోగించారు. కొమురంభీం పోరాటం పలు ప్రాంతాలకు విస్తరించే లోపే నిజాం సేనలతో యుద్ధం జరిగింది. భీంతో సహా పన్నెండు మంది ఆదివాసీ వీరులు అమరులయ్యారు. నిజాం సర్కారు పాశవికంగా కొమరంభీం పోరాటాన్ని అణచివేసింది. భీం అమరత్వం జోడేఘాట్ లోద్దుల్లో నేటికీ ప్రతిధ్వనిస్తున్నది.
పంక్తి 57:
అస్తిత్వ ఉద్యమాలు కొనసాగుతున్న నేటి తరుణంలో, 1940లోనే ఆత్మగౌరవం, స్వపరిపాలన పునాదులుగా కొమురం భీం సాయుధ తిరుగుబాటు చేశాడు. అతని ముందు చూపు వివిధ ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తున్నది. బాబేఝురి లోద్దుల్లో పన్నెండు గూడేలపై రాజ్యాధికారం కోసం తుడుం మోగించిన కొమురం భీం వారసత్వం నేటికీ దండకారణ్యంలో కొనసాగుతున్నది.జల్,జంగల్,జమీన్ కోసం ఆదివాసులు కొమురంభీం బాటలో పయనిస్తున్నారు. కొమురం భీంను ప్రేమించే వాళ్లుగా.. ఆదివాసుల అస్తిత్వ పోరాటాలకు అండగా నిలుద్దాం. ఇదే సందర్భంలో తెలంగాణ ప్రజలు అస్తి త్వంకోసం,స్వయంపాలన కోసం పోరాడుతున్నారు. సందర్భాలు వేరు కావచ్చు. కాని పోరాట లక్ష్యాలు ఒకటే. తెలంగాణ ప్రజలు కొమురం భీం పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. పరపీడన నుంచి విముక్తి కోసం ఆయుధమెత్తి పోరాడిన భీం వారసులుగా కదం తొక్కాలి. వలస పాలనను అంతం చేయాలి. అదే.. కొమురం భీముకు నిజమైన నివాళి.
==ఉద్యమ స్ఫూర్తి..
[[దస్త్రం:Komuram bheem.JPG|thumb|2010 అక్టోబరు 23 తేదీన [[సాక్షి]] దినపత్రికలో ప్రచురితమైన కొమురం భీము రేఖాచిత్రం]]
నిజాం పాలకుల నిరంకుశత్వానికి.. అధికారుల దమన నీతికి ఎదురు నిలిచి పోరాడిన కొమురం భీం ఆశించిన లక్ష్యాలను నేటి పాలకులు నెరవేర్చలేక పోతున్నారు. భీం మరణించి 72 ఏళ్లు గడుస్తున్నా జల్, జంగిల్, జమీన్పై ఆదివాసీలు నేటికీ హక్కులు పొందలేకపోతున్నారు. నాటి నుంచి నేటి వరకు గిరిజనులు హక్కుల కోసం పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు. భీం పుట్టింది ఆదిలాబాద్ జిల్లా [[కెరమెరి]] మండలం సంకెపల్లి.. పెరిగింది సుర్తాపూర్. కష్టపడి అడవి నరికి పోడు వ్యవసాయం చేసేవాళ్లు. రాత్రింబవళ్లు కావలి కాశీ పంటలు పండించేవాళ్లు. గిరిజనులపై నిజాం సర్కారు పెత్తనం చాలా ఎక్కువగా ఉండేది. అప్పుడు పంటను కొట్టిన కల్లంలోనే.. కైలు కింద గింజలు ప్రభుత్వానికి అప్పజెప్పేవారు. గిరిజనులు పోడు చేసుకునే భూములకు పట్టాదారులుగా ఇతరులు ఉండేవారు. గిరిజనులు ఎంతటి దట్టమైన అడవిలో భూములను సాగుచేకున్నప్పటికీ వాటిపై తమకే పట్టాలు ఉన్నాయని సర్కారోళ్లు.. జంగ్లాత్ వాళ్లు గొడవలు చేసేవాళ్లు. తిరిగబడ్డ గిరిజనులపై కేసులు పెట్టేవాళ్లు. ఇలాంటి సంఘటనలే కొమురం భీంను కదిలించాయి. ఇలా పంట వసూలు కోసం తమ చేనులోకి వచ్చి కూర్చున్న సిద్ధికి అనే వ్యక్తిని కర్రతో తల పగలకొట్టాడు భీం. ఈ దెబ్బతో సిద్ధికి అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో భయపడ్డ భీం మహారాష్ట్రలోని బల్లార్షా, చందా దిక్కు పారిపోయాడు. అక్కడ తేయాకు తోటల్లో కూలీపని చేసుకుంటూ చదవడం, రాయడం నేర్చుకున్నాడు. మరాఠీ, ఉర్దూ భాషలు నేర్చుకున్నాడు. కొత్త కొత్త పంటలు పండించటం, వాటిని మార్కెట్లో మంచి ధరకు అమ్మటం తెలుసుకున్నాడు. తరువాత భీం తల్లిదంవూడులు ఉంటున్న కాకన్ఘాట్కు వచ్చాడు. ఆ గ్రామంలోని గిరిజనుడు లచ్చుప వద్ద జీతం ఉండగా భీంకు సోంబాయితో పెళ్ళి జరిగింది. ఆ కాలంలో అరకకు ఐదు రూపాయలు, పోడుకు రెండు రూపాయల చొప్పున పన్నును ఆసిఫాబాద్ తహసిల్దార్కు కట్టేవారు. కొమురం భీం అప్పటి తహసిల్దార్తో మాట్లాడి లచ్చుప చెందిన పన్నెండు ఎకరాల భూమి కేసును కొట్టేయించాడు. అప్పటినుంచి ఆ ప్రాంత గిరిజనులందరికీ భీం నాయకుడయ్యాడు. 60 ఎకరాల అడవిని నరికి 12 గ్రామాలను ఏర్పరిచాడు.
ఆ గ్రామాలు జోడుణ్ఘాట్, [[పట్నాపూర్ (బోథ్)|పట్నాపూర్]], బాబెఝరి, నర్సపూర్, కల్లెగాం, చాల్బడి, బోయికన్ మోవాడ్, భోమన్గొంది, భీమన్గొంది, [[అంకుశాపూర్ (భీమారం)|అంకుసాపూర్]], దేవునిగూడ, గొగినవమోవాడ్. దీంతో అటవీ అధికారులు భీం మీద కేసుపెట్టారు. ఓ చౌకిదార్, అమీన్, తొమ్మిది మంది పోలీసులు వచ్చి భీం ఇంటిని సోదా చేయగా ఏమీ దొరకలేదు. దీంతో భీంకు కోపం వచ్చి వాళ్లపై తిరుగబడి కొట్టాడు. దీంతో అధికారులు భీంపై కేసుపెట్టారు. గిరిజనులు పోడుచేసుకుంటున్న భూములకు పన్ను కట్టాల్సిన పనిలేదని కోర్టు తీర్పు ఇచ్చిప్పటికీ అధికారుల వేధింపులు తప్పలేదు. భీంను, ఆయన అనుచరులను ఎదుర్కొనేందుకు 1940 సెప్టెంబరు 1న నైజాం పోలీసులు వచ్చి 300 మంది గిరిజనులు ఉన్న 12 గ్రామాలను చుట్టిముట్టారు. మొదట భూములకు పట్టాలు ఇస్తామని చెప్పటంతో [[గిరిజనులు]] ఇళ్లల్లోంచి బయటకు వచ్చా రు. వీరిని పోలీసులు కొట్టడంతో గొడవ జరిగి కొమురం భీంతోపాటు 11 మంది గిరిజనులు చనిపోయారు. భీం నాయకత్వంలో గిరిజనులు పోలీసులకు ఎదురు నిలిచిన సంఘటన నిజాం ప్రభువును కదిలించింది. వారి సమస్యల పరిష్కారానికి, సదుపాయాల కల్పనకు, వారి జీవన విధానంపై పరిశోధన చేసి నివేదిక సమర్పించటానికి ఇంగ్లాండ్కు చెందిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ హేమన్డార్ఫ్ను ప్రభుత్వం నియమించింది. ఆయన గిరిజనులతో కలిసిపోయి వారి జీవన విధానాలను అధ్యయనం చేసి గిరిజనుల అభివృద్ధికి తీసుకోవాల్సిన పథకాలను సూచిస్తూ నివేదిక తయారు చేసి నిజాం సర్కారుకు అందజేశారు. నేడు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి నాటి భీం త్యాగఫలితమే.. కొము రం భీం వారసులు ప్రస్తుతం సిర్పూర్ (యు) మండలం పెద్దదోబలో ఉంటున్నారు. భీం మనుమడు కొమురం సోనేరావ్ ప్రభుత్వం నిర్వహించే వర్ధంతి సభలో పాల్గొంటున్నారు. భీం నేలకొరిగిన జోడెఘాట్లో కొమురం భీం మునిమనవరాలు కొమురం భీంబాయి నివసిస్తున్నారు.
జోడేఘాట్ ఏర్పాట్లు
ఏటా అశ్వయుజ కార్తీక [[పౌర్ణమి]] రోజు కెరమెరి మండలం జోడేఘాట్లో కొమురం భీం వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు ఆయన 72వ వర్ధంతి దర్బార్ను సోమవారం జోడేఘాట్లో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. హట్టిలోని భీం స్మారక బేస్క్యాంప్ను రంగులతో అలంకరించి, భీం విగ్రహాన్ని ముస్తాబు చేశారు. హట్టి గ్రామం వద్ద స్వాగత తోరణానికి రంగులు వేయించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జోడేఘాట్లోని భీం విగ్రహానికి రంగులు వేయించి, సమాధిని పూలతో అలంకరించారు. వర్ధంతి సందర్భంగా 15 వేల మందికి భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు.‘నిజాం సర్కారే నయం’ ‘కొమురం భీం పోరాడి పొందించిన 12 గ్రామాలను భీంనే ఏలుకొమ్మని నిజాం అనుమతినిచ్చాడు. కానీ ఆదివాసీలందరికీ హక్కులు కావాలని పోరాటాన్ని మరింత ఉధృతం చేయడంతో నిజాం సర్కారు భీంను చంపేసింది. కానీ ఇప్పుడు సర్కారు ఆదివాసీల కనీసం హక్కులను కూడా హరిస్తోంది. కనీసం తాగేందుకు నీళ్లుకూడా లేకుండా చేస్తోంది. ఈ సర్కారు కన్నా నిజాం సర్కారే నయం. నా భర్త పొందించిన 12 గ్రామాలను ఏలుకొమ్మని అధికారం ఇచ్చాడు’ ఇవి భీం భార్య సోంబాయి బతికున్నప్పుడు అన్న మాటలు. అవును నిజమే నిజాం సర్కారు కేవలం భూములపై, పంటలపై, అడవిపై మాత్రమే ఆంక్షలు విధించి వీటిని చెల్లించాలని ఆదివాసీలపై పెత్తనం చెలాయించేది. కానీ ఇప్పుడున్న సర్కారు ఆదివాసీల కనీస హక్కులను సైతం హరిస్తోంది. 72 ఏళ్ల క్రితం జల్, జంగిల్, జమీన్ కోసం పోరాడి ప్రాణాలను వదిలిన కొమురం భీం ఆశయాలను ఇంత వరకు మన పాలకులు, అధికారులు నెరవేర్చలేక పోతున్నారు. అటవీ చట్టాల పేరుతో అడవుల్లో ఆదివాసీలను మైదానాలకు తరిమి వేయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. ఆదివాసీల సమస్యలు ఎప్పటికీ తీరవనే ముందు చూపుతోనే ప్రస్తుత సర్కారు కన్నా నిజాం సర్కారే నయమని సోంబాయి అనుకొని ఉంటారు.
== కొమురం భీము
2009 డిసెంబరు 17 న హైదరాబాదులో కొమురం భీము విగ్రహం నెలకొల్పుటకు ప్రభుత్వం ప్రకటించింది.<ref>{{cite news | first= | last= | coauthors= |authorlink= | title=Komaram Bheem statue to be installed in city | date=2009-12-18 | publisher=[[The Hindu]] | url =http://www.hindu.com/2009/12/18/stories/2009121860130400.htm | work = | pages = | accessdate = 2010-01-03 | language = | location=Chennai, India}}</ref>
|