నిడమర్తి ఉమా రాజేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 1:
'''నిడమర్తి ఉమారాజేశ్వరరావు'''(అక్టోబర్ 17, 1923 - జూలై 25,2010) ఒక రచయిత, విమర్శకుడు, సంపాదకుడు, అనువాదకుడు, ప్రచురణకర్త. కార్మిక నాయకుడు, కమ్యూనిస్ట్ నేత [[నిడమర్తి అశ్వనీ కుమారదత్తు]] ఇతనికి అన్న.
==జీవిత విశేషాలు==
ఉమారాజేశ్వరరావు [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[నిడమర్రు]] గ్రామంలో [[1923]], [[అక్టోబర్ 17]]వ తేదీన [[నిడమర్తి లక్ష్మీనారాయణ]] వెంకమ్మ దంపతులకు నాలుగవ సంతానంగా జన్మించాడు
1936- 38లలో విశాఖపట్నంలో హైస్కూల్ విద్యాభ్యాస కాలంలో [[చండ్ర రాజేశ్వరరావు]], తన అన్న అశ్వనీ కుమారదత్తుల ప్రభావంతో కమ్యూనిస్ట్ అభిమానిగా మారాడు. 1939లో పశ్చిమ గోదావరిజిల్లా [[ఉండి]] పట్టణ హైస్కూల్ లో విద్యార్థుల సమ్మెకి నాయకత్వం వహించి విజయవంతంగా నడిపి, నెలరోజులు సస్పెండ్ అయ్యాడు. అదే సంవత్సరం కాకినాడలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ మహాసభలో కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోబడ్డాడు. 1942లో తాడేపల్లిగూడెం తాలూకాలో పార్టీ హోల్టైమరుగా పని ప్రారంభించిన ఉమారాజ్ రచనా వ్యాసంగం 1942లో ప్రజాశక్తిలో ''జోయ వీరగాథ'', ''గెరిల్లా'' ప్రచురణతో ప్రారంభమైంది. 1929లో ''అన్నా'' ప్రచురణతో ప్రారంభించిన ''ప్రోలెటేరియన్ సీరిస్''ను ఇతడు తన అన్న అశ్వినీకుమార దత్తుతో కలిసి 1943లో ''ప్రగతి ప్రచురణాలయం'' పేరిట పునరుద్ధరించి, నిర్వహించాడు. ఆంధ్రదేశంలోని తొలిసోషలిస్టు ప్రచురణాలయాల్లో యిది ఒకటి. 1943లో అశ్వినీకుమారదత్తుతోబాటు అనువదించిన ''చైనా ఎర్రసైన్యం'' మొదలుకొని ఇతడు సుమారు నూరు అనువాదాలు చేశాడు. 1947లో కడపలో సోషలిస్టు స్టడీ సర్కిల్ నిర్వహణలో పాల్గొన్నాడు. 1950 నుండి 1965 ఆగస్టు దాకా కర్నూలు జిల్లా బేతంచెర్లలో పరిశ్రమ నిర్వహణకాలంలో సైతం రచనా వ్యాసంగం కొనసాగించాడు. 1965 డిసెంబరు నుంచి 1967 దాకా విజయవాడలో విశాలాంధ్ర ప్రచురణాలయం సంపాదకునిగా పనిచేశాడు. దేవరకొండ బాలగంగాధర తిలక్ కవితలు 'అమృతం కురిసిన రాత్రి'నీ, ''తిలక్ కథలు''నూ, ''సుప్తశిల'' వగైరా నాటికలనూ విశాలాంధ్ర ప్రచురణాలయానికి సేకరించి పెట్టాడు.
|