గోగులపాటి కూర్మనాధ కవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గోగులపాటి కూర్మనాధ కవి''' [[సింహాచలం]] లోని శ్రీవరాహ నారసింహుని మీద ఆసువుగా శాతకాన్ని రచించారు. ఈతడు ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. ఇతని తల్లిదండ్రులు బుచ్చన్న, గౌరమాంబ. వెంకన్న, కామన్న అని ఇద్దరు తమ్ములు. ఈతడు [[విజయనగరం]] జిల్లాలోని [[రామతీర్థం]]లో సుమారు [[1720]] ప్రాంతంలో జన్మించారు. అక్కడ విద్యాభ్యాసము తరువాత, విజయనగర సంస్థానము యొక్క దేవస్థానాలలో ఉద్యోగిగా రామతీర్థం, పద్మనాభం, సింహాచలం, శ్రీకూర్మం లలో పనిచేశారు. చివరి కాలంలో [[గజపతినగరం]] తాలూకాలోని [[దేవుపల్లి]] గ్రామం (ప్రస్తుతం [[బొండపల్లి]] మండలం) లో ఉండేవారు.
 
ఇతడు మొదటి ఆనంద గజపతి మహారాజు వద్ద ఆస్థానకవిగా మృత్యుంజయవిలాసము అనే యక్షగానము, తరువాత సింహాద్రి నారసింహ శతకము, లక్ష్మీనారాయణ సంవాదము మరియు సుందరీమణి శతకము వ్రాసెను.
 
ఇతడు సుమారు క్రీ.శ.[[1790]] ప్రాంతంలో దేవుపల్లి గ్రామములోనే పరమపదించినట్లు చారిత్రకులూహించుచున్నారు. [[ఆడిదము సూరకవి]], [[చట్రాతి లక్ష్మీనృసింహకవి]] ఇతని సమకాలికులు.
 
==మూలాలు==