త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
వంశ పారంపర్యముగా వచ్చిన 'తరంగ గానం'ను చిన్నవయసులోనే నేర్చుకన్నాడు. 9వ ఏట తెనాలి రామవిలాస సభలో బాలనటుడిగా చేరి అనేక నాటకాల్లో నటించాడు. ఈయన కొన్ని గ్రామోఫోను రికార్డుల్లో కూడా పాడాడు. 1926లో గుంటూరులో బాలమిత్ర సభను ప్రారంభించి, బాలనటులతో ఒక బృందాన్ని తయారుచేసిన దంటు వెంకటకృష్ణయ్య ఆహ్వానం మేరకు రామకృష్ణ శాస్త్రి ఆ సమాజంలోకి చేరి '[[రోషనార (నాటకం)|రోషనార]]'లో శివాజీ, 'కృష్ణలీలలు' లో [[యశోద]], 'రామదాసు' లో [[రామదాసు]] పాత్రలు పోషించాడు. [[పువ్వుల సూరిబాబు]], కళ్యాణి, నాగలింగం వంటి నటులు కూడా ఆ సంస్థలో ఉన్నారు.
 
నాటక సమాజాలు మూతపడిపోయినకాలంలో [[స్థానం నరసింహారావు]], [[సి.యస్.ఆర్. ఆంజనేయులు]] లతో కలసి ఊరురా తిరిగి '[[శ్రీకృష్ణ తులాభారం (నాటకం)|తులాభారం]]' నాటకంలో [[నారదుడు]]గా నటించాడు. రామకృష్ణ శాస్త్రి నటనను చూసిన దర్శకుడు [[చిత్రపు నరసింహారావు]] '[[మోహినీ రుక్మాంగద (1937 సినిమా)|మోహిని రుక్మాంగద]]' సినిమాలో నారద పాత్రకు శాస్త్రిని ఎంపిక చేశాడు.
 
== సినిమారంగం ==