విచిత్రవీర్యుడు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ, మొలక స్థాయి దాటించే ప్రయత్నం
విస్తరణ, మొలక స్థాయి దాటించే ప్రయత్నం
పంక్తి 1:
'''విచిత్ర వీర్యుడు''' భారతీయ మత గ్రంథాలలో ఒక రాజు. మహాభారతం ప్రకారం అతను శంతన మహారాజు, సత్యవతిలకు చిన్నకుమారునిగా జన్మించాడు. అతని కుమారులు [[దృతరాష్ట్రుడు]], [[పాండురాజు]] . అతని మనుమలు కౌరవులు, పాండవులు. అతని భార్యలు [[అంబిక]], [[అంబాలిక]] లు.
 
== అతని స్వల్ప పాలన ==
విచిత్రవీర్యునికి చిత్రాంగదుడు అనే అన్నయ్య ఉన్నాడు. వీరు శంతన మహారాజు రెండవ భార్య సత్యవతి కుమారులైనందున, శంతన మహారాజు మొదటి భార్య కుమారుడైన భీష్మునికి సోదరులవుతారు. శంతన మహారాజు మరణం తరువాత రాజ్యాన్ని పాలించడానికి భీష్ముడు చిత్రాంగదుడిని కురు రాజ్య సింహాసనంపై ఉంచాడు. అతను ఒక శక్తివంతమైన యోధుడు అయినప్పటికీ గంధర్వుల రాజుతో జరిగిన యుద్ధంలో మరణించాడు. ఆ తరువాత భీష్ముడు బాలునిగా ఉన్న విచిత్ర వీర్యునికి రాజ్య పట్టాభిషేకం చేసాడు<ref>van Buitenen (1973), p. 227</ref>.
 
యుక్త వయసుకు వచ్చిన తరువాత భీష్ముడు అతనికి కాశీ రాజు అందమైన కుమార్తెలైన అంబిక, అంబాలికలనిచ్చి వివాహం చేసాడు. విచిత్రవీర్యుడు తన భార్యలనెంతో ప్రేమించి, ఆరాధించేవాడు. కానీ ఏడు సంవత్సరాల తరువాత అతను అనారోగ్యంతో బాధపడ్డాడు. అతని స్నేహితులు, వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అతనికి నయం కాలేదు<ref name="B">{{cite book|title=Myths and Legends from India - Great Women|last=Bhanu|first=Sharada|publisher=Macmillan India Limited|year=1997|isbn=0-333-93076-2|location=Chennai|pages=35–6}}</ref>. అతని సోదరుడు చిత్రాంగదుని మాదిరిగా అతను సంతానం లేకుండా మరణించాడు. భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని మనన మంత్రం చే తన వద్దకు రప్పించింది. భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది. తల్లి ఆదేశాన్ననుసరించి వ్యాసుడు [[అంబిక]]<nowiki/>కు దృతరాష్ట్రుని, [[అంబాలిక]]<nowiki/>కు [[పాండురాజు]]<nowiki/>ని, దాశీకు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు<ref>van Buitenen (1973), pp. 230; 235-36</ref>.
<br />
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
<br />
{{కురు వంశవృక్షం}}
"https://te.wikipedia.org/wiki/విచిత్రవీర్యుడు" నుండి వెలికితీశారు