సూత్రధారులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → ,, typos fixed: లొ → లో, → , , → ,, ( → ( (5)
పంక్తి 20:
| budget =
}}
'''సూత్రధారులు''' 1989 లో [[కాశీనాధుని విశ్వనాథ్|కె. విశ్వనాథ్]] దర్శకత్వంలో వచ్చిన సినిమా. సుదర్శన్ సినీ ఎంట్రప్రైజెస్ బేనర్ పై సుదాకర్ మరియు, కరుణాకర్ గారు నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో హింసకు వ్యతిరేకంగా అల్లుకున్న కథ ఇది. [[అక్కినేని నాగేశ్వరరావు]], [[మురళీ మోహన్]], [[కైకాల సత్యనారాయణ]], [[కె. ఆర్. విజయ]], [[సుజాత (నటి)|సుజాత]], [[భానుచందర్]], [[రమ్యకృష్ణ]] ప్రధాన నటులు. [[కె. వి. మహదేవన్]] సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.
 
== కథ ==
హనుమద్దాసు (అక్కినేని నాగేశ్వరరావు), అతని బావమరిది రంగదాసు (మురళీ మోహన్) [[హరిదాసు]]ల కుటుంబానికి చెందిన వారు. హనుమద్దాసు, దేవమ్మ ల కుమారుడు తిరుమల దాసు (భానుచందర్). రంగదాసు కూతురు సీతాలు (రమ్యకృష్ణ) . నీలకంఠం (కైకాల సత్యనారాయణ) ఆ ఊరిలో ఒక కరుడు గట్టిన భూస్వామి. అదే ఊర్లో హరికథలు చెప్పే యశోదమ్మ (కె. ఆర్. విజయ)ను నీలకంఠం పాడు చేస్తాడు.ఎంతో మంచివాడైన సనాతన ధర్మములని ఆచరించే  తన భర్తయిన భాగవతాచార్యులు (అశోక్ కుమార్)కి  మానం పోయిన తాను సరిపోనని తన నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. యశోదమ్మ తిరుమల దాసును తనతోబాటు తీసుకుని అతనికి మంచి చదువు చెప్పించడం కోసం పట్నం వచ్చేస్తుంది.
 
ఇరవై సంవత్సరాల తర్వాత తిరుమల దాసు కలెక్టరుగా ఆ ఊరు వస్తాడు. హనుమాదాసు పన్నిన వూహం ప్రకారం తిరుమలదాసు  గ్రామ ప్రజాలందరిలో ఐక్యత రేకెత్తించటానికి నీలకంఠం మాటలకు వత్తాసు పలుకుతూ అతని పక్కనే ఉంటాడు. సీతాలు, అతని కుటుంబ సభ్యులతో సహా ఊరందరూ అతని ప్రవర్తనకు ఆశ్చర్యపోతారు. ఈ కారణంగా సీతాలు, తిరుమలదాసుల ప్రేమలో విభేదాలు తలెత్తుతాయి, కానీ తరువాత ఆమె అసలు విషయం తెలుసుకుని తిరుమలదాసుకి దగ్గరవుతుంది. చివరికి, నీలకంఠం ప్రభుత్వ భూములు స్వాదీనం చేసుకోటానికి ప్రయత్నిస్తాడు. ఆ భూములు తమకే చెందాలని కొందరు భూస్వాములు తిరుమలదాసుకి లంచం ఇస్తారు. ఆ లంచం డబ్బుతో ఆ భూములని గ్రామస్తులకి చెందేటట్లు చేస్తాడు తిరుమలదాసు. దానితో నీలకంఠం గ్రామాన్ని నాశనం చేయటానికి మనుషులని పంపుతాడు. తిరుమలదాసు పోలీసుల సాయంతో ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు. గ్రామస్తులంతా ఒక్కటై నీలకంఠం ని  చంపటానికి బయలుదేరతారు. ఇంతలో హనుమత్ దాసు వారికి అడ్డుపడి సమస్యను పరిష్కరించడానికి హింస సరైన మార్గం కాదని వారిని శాంతింపజేస్తాడు. ఈ మధ్య, యశోదమ్మ తన భర్తతో కలిసిపోతుంది. చివరికి, నీలకంఠం కూడా తన తప్పును గ్రహించి, తన ఆయుధాలన్నింటినీ విడిచి మంచి వాడిగా మారిపోతాడు.
 
==పాత్రలు-పాత్రధారులు==
పంక్తి 45:
==పాటలు==
* ఆయతనవాన్ భవతీ ఏ యేవం వేదా
:గానం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, [[శైలజ]]
 
* కలలెందుకు కథలెందుకు, తలపెందుకు తపమెందుకు
పంక్తి 55:
* మహారాజ రాజశ్రీ మహనీయులందరికీ వందనాలు
:గానం - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
* లాలేలో ఏలేలో రామాలాలొయిలాలరామాలాలోయిలాల అమ్మలాల, మూడు బురుజుల కోట ముత్యాల తోట
:గానం - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
 
"https://te.wikipedia.org/wiki/సూత్రధారులు" నుండి వెలికితీశారు