యల్లాప్రగడ సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

ఎర్రలింకులు తొలగింపు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 18:
|doctoral_students =
|notable_students =
|known_for = [[హెట్రజాన్]] అను డ్రగ్ ఆవిష్కర్త<br />టెట్రాసైక్లిన్ [[యాంటీబయాటిక్]] అయిన [[ఆరియోమైసిన్]]<br />
|author_abbrev_bot =
|author_abbrev_zoo =
పంక్తి 29:
}}
 
'''యల్లాప్రగడ సుబ్బారావు''' ([[జనవరి 12]], [[1895]] - [[ఆగష్టు 9]], [[1948]]) భారత దేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. లెడర్లీ ప్రయోగశాలలో వైద్యబృందం నాయకులుగా [[ఫోలిక్ ఆమ్లం]] యొక్క నిజస్వరూపాన్ని కనుగొన్నాడు. అందులోని బంగారు వన్నె భస్మం స్ప్రూ వ్యాధి, మక్రోసైటిక్ [[అనీమియా]] అను రక్తహీనత వల్ల కలిగే వ్యాధి నిర్మూలనకు అసమానమైన, అద్భుతమైన మందుగా నిర్ణయింపబడింది. క్షయరోగ నివారణియగు బసోనికోటి నికాసిడ్, హైడ్రాక్సైడ్ మందులను కనుగొన్నారు. [[బోదకాలు]], [[టైఫాయిడ్]], [[పాండురోగం]] మున్నగు వ్యాధులకు పూర్తిగా నిర్మూలింపగల మందులను కనుగొన్నాడు.<ref>జానమద్ది హనుమచ్చాస్త్రి రచించిన సుప్రసిద్ధుల జీవిత విశేషాలు- డా. యల్లాప్రగడ సుబ్బారావు. పేజీ 58 - 60</ref>
 
==బాల్యం - విద్యాభ్యాసం==
ఇయన [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[భీమవరం]] బస్తీలో [[1895]], [[జనవరి 12]] న జన్మించారు. తండ్రి పేరు జగన్నాథం. ఎలిమెంటరీ, ఉన్నత పాఠశాల చదువులు పూర్తి చేసేటప్పటికి తండ్రి చిరు ఉద్యోగిగానే రిటైర్ అయ్యాడు. ఇక, ఈయనను చదివించడానికి తండ్రి వెనుకంజ వేయగా తల్లి పట్టుబట్టి ఈయనను [[రాజమండ్రి]]కి పంపించి మెట్రిక్యులేషన్ పరీక్ష చదివించారు. ఫెయిలయ్యారు. ఇంతలో తండ్రి మరణించాడు. తల్లి పట్టుదలతో [[మద్రాసు]]కు పంపదల్చగా చేత చిల్లిగవ్వ లేదు. పుస్తెలు అమ్మి కొడుకు చదువుకు ఇచ్చింది.
 
[[మద్రాసు]] హిందూ ఉన్నత పాఠశాలలో చేరి, చదువులో ముందడుగు వేశాడు. పేదరికంలో విద్యాపరమైన నైరాస్యంతో కూడా భవిష్యత్తు పట్ల ఆత్మవిశ్వాసంతో వర్తమాన ఇబ్బందులను అధిగమించే సాహసం ఈయనకు బాల్యంలోనే అబ్బింది. సంఘ సంస్కర్త [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] ప్రభావం ఈయన మీద బాగా పొడసూపింది. మద్రాస్, మైలాపూర్ లోని రామకృష్ణ మిషన్ వైపు కూడా ఆకర్షితుడాయ్యారు. వైద్యం నేచి, మిషన్ లో చేరి సన్యాసిగా అందరికీ వైద్య సేవలు అందించాలన్న అలోచన కూడా చేశారు. తన ఆలోచనను వివరింపగా, ససేమిరా అంగీకరించలేదు. బంధువుల సహకారంతో [[మద్రాస్ వైద్య కళాశాల|మద్రాసు మెడికల్ కాలేజీ]] ఇంటర్మీడియట్ డిస్టెంక్షన్ లో పాసయిన ఈయనను చేర్చిందింది. ఈ ఘటన చరిత్ర గతిని మార్చివేసింది.
 
దేశ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో విదేశీ దుస్తులను బహిష్కరించి, [[ఖద్దరు]] దుస్తులతో కాలేజీకి చెళ్ళీన ఈయన కాలేజీ అధికారుల ఆగ్రహానికి గురయ్యారు. ఇంతలో మరో దుర్ఘటన జరిగింది. అత్యంత సన్నిహితుడైన పెద్దన్నయ్య పురుషోత్తం భయంకరమైన "స్ఫ్రూ" వ్యాధితో మరణించాడు. ఈ బాధ నుండి కోలుకోలేకముందే, వారం రోజుల వ్యవధిలో మరో సోదరుడు కృష్ణమూర్తి కూడా ఇదే వ్యాధికి బలయ్యాడు. ఈ రెండు మరణాలు ఈయనను తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. ఎంతటి శ్రమపడి అయినా ఈ వ్యాధికి ముందు కనుగొనాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.