తెలంగాణ రాష్ట్ర సమితి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 23:
'''తెలంగాణ రాష్ట్ర సమితి''' ([[తెరాస]]) ప్రత్యేక [[తెలంగాణ]] రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది. [[2001]] [[ఏప్రిల్ 27]] న అప్పటి [[ఆంధ్ర ప్రదేశ్‌]] [[శాసనసభ]] [[ఉపసభాపతి]], [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]] తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, [[తెలుగుదేశం పార్టీ]] ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి [[వి. ప్రకాశ్]] వంటి కొందరు నాయకులతో కలిసి [[తెరాస]]ను ఏర్పాటు చేశాడు.[[ఆలె నరేంద్ర]], సత్యనారాయణరెడ్డి, లాంటి కొందరు నాయకులు [[తెరాస]]ను విడిచి వెళ్ళారు. నిజాం మనుమరాలు [[సలీమా బాషా]] (అస్మత్‌ బాషా కుమార్తె), ఆమె కుమార్తె [[రఫత్‌షా ఆజంపురా]]లు తెలంగాణకు మద్దతు ప్రకటించారు. పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.
== ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ==
పార్టీకి సైద్ధాంతిక భూమిక కల్పించడం దగ్గర్నుంచి కార్యాచరణను నిర్దేశించడం వరకు , తెలంగాణ సమాజాన్ని, దేశ రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని లోతుగా అధ్యయనం చేసి, అర్థం చేసుకుని, తెలంగాణ ఉద్యమ వ్యూహానికి రూపకల్పన చేశారు. స్ట్రీట్ ఫైట్‌ స్థానంలో స్టేట్ ఫైట్ ఉండాలని , అందుకు వాహకంగా ‌తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్‌ )ని తీర్చిదిద్దారు. అప్పుటి తెలంగాణ రాజకీయ పరిస్థితుల్లో అదొక సాహసోపేతమైన సూత్రీకరణ.
తెలంగాణ రాష్ట్ర సమితి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌‌తో పొత్తు, నాటి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాతో కరీంనగర్‌లో ప్రత్యేక తెలంగాణ ఇస్తామని ప్రకటింపజేయడం, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చడం . కేంద్ర,యూపీఏ రాష్ట్రకామన్ ప్రభుత్వాల్లోమినిమమ్ చేరినప్రోగ్రాంలో తర్వాతతెలంగాణ దేశంలోనిఅంశం 35చేర్చడంలో పార్టీలటీఆర్ఎస్ అభిప్రాయాలనువిజయం సాధించింది. తెలంగాణకు అనుకూలంగా తీసుకురావడందాదాపు లాంటివన్నీ తెలంగాణ36 సాధనకుపార్టీలు మార్గంలేఖ సుగమంఇవ్వడంలో చేసివిటీఆర్ఎస్ పార్టీ కృషి చేసింది.
కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అంటూ కేసీఆర్ ఆమరణ నిరహార దీక్షకు దిగారు.
ఆయన దీక్షతో తెలంగాణలో ఉద్యమం ఉధృతం అయింది. దీంతో దిగివచ్చిన యూపీఏ2 ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు దిశగా ప్రక్రియ ప్రారంభిస్తామంటూ 2009 డిసెంబర్ 9న ఒక ప్రకటన చేసింది. కానీ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో డిసెంబర్ 23న ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
తెలంగాణ ఏర్పాటుపై అందరి అభిప్రాయాలను సేకరించేందుకు శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ దశలో టీఆర్ఎస్ మిగిలిన పార్టీలతో కలిసి తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడింది. పొలిటికల్ జేఏసీ ప్రత్యేక తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడిని తీవ్రం చేసింది<ref>{{Cite news|url=https://www.bbc.com/telugu/india-46518381|title=టీఆర్ఎస్ ప్రస్థానం: పోరు నుంచి పాలన వరకు కారు జోరు|last=కాసం|first=ప్రవీణ్|date=2018-12-11|work=BBC News తెలుగు|access-date=2020-04-27|language=te}}</ref>.
2010 డిసెంబర్‌ 16న వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ తలపెట్టిన మహా గర్జనకు 20 లక్షల మంది హాజరు అయ్యారు . శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణ తరర్వాత 2011 జనవరి నుంచి టీఆర్‌ఎస్‌ అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. మొత్తం మీద రాష్ట్ర స్థాపనే ధ్యేయంగా పార్టీని స్థాపించిన ఉద్యమ నేత కేసీఆర్‌ రెండు సార్లు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.తెలంగాణలోని సంఘాలు, విద్యార్థులు, రాజకీయ నేతల సహాయంతో ఉధృతంగా ఉద్యమం చేసి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన టీఆర్​ఎస్. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా మారింది.
 
==తెలంగాణ బిల్లుకు ఆమోదం==
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 2013 అక్టోబర్‌లో తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2014 డిసెంబర్‌ 18న లోక్‌సభ, 20న రాజ్యసభ ఆమోదం తెలిపింది. మరో వైపు 2014 ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు జరుగగా, మే 16న ఫలితాలు వచ్చాయి. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ 63, 11లోక్‌సభ స్థానాలను గెలుపొందింది. దీంతో తెలంగాణలో జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావంతో పాటు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. 2018 డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 88 స్థానాల్లో గెలుపొంది రెండో సారి అధికారంలోకి రావడంతో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
 
==ఎన్నికలు==
===2014 ఎన్నికలు===