అభిమన్యుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి Undid edits by 2409:4070:230B:DDA4:0:0:1EC7:68AC (talk) to last version by Yarra RamaraoAWB: unexplained content removal ట్యాగులు: AutoWikiBrowser రద్దుచెయ్యి SWViewer [1.3] |
చి revert by Quick Undo (SWMT) ట్యాగు: రద్దుచెయ్యి |
||
పంక్తి 1:
{{ఇతరవాడుకలు|అర్జునుని కుమారుడు}}
[[దస్త్రం:Uttara Abhimanyu.jpg|thumb|అభిమన్యుని యుద్ధానికి పంపుతున్న [[ఉత్తర]].]]
'''అభిమన్యుడు'''
అభిమన్యుడు పెద్దల సంపూర్ణ అంగీకారంతో ఉత్తరని వివాహము చేసుకుంటాడు. వివాహానంతరము అభిమన్యుడు, అర్జునుడు యుద్ధభూమిలో లేని సమయంలో [[ద్రోణాచార్యుడు|ద్రోణుడు]]చే రచించబడిన [[పద్మవ్యూహము]]లో ప్రవేశించి అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి అన్యాయంగా చుట్టుముట్టిన [[దుర్యోధనుడు|దుర్యోదన]], [[దుశ్శాసనుడు|దుశ్శాసన]], [[కర్ణుడు|కర్ణాదు]]లచే సంహరింపబడి వీరమరణము పొందటంతో అభిమన్యుని కథ [[మహాభారతము|భారతము]]లో దాదాపు ముగుస్తుంది. అభిమన్యుని మరణము అర్జునునికి తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తుంది. సుభద్ర పుత్రశోకంతో అభిమన్యుని మరణాన్ని నివారించలేదని [[కృష్ణుడు|కృష్ణుని]] నిలదీస్తుంది. అభిమన్యుని మరణసమయంలో అతని భార్య ఉత్తర గర్భవతిగా ఉండటము వలన ఆమె సహగమనము నివారించబడింది. యుద్ధానంతరము ఉపపాండవులను [[అశ్వద్దామ]] సంహరించడము వలన అభిమన్యుని పుత్రుని వలననే పాండవ వంశము వృద్ధి చెందినది. దుర్యోధనుని సోదరి భర్త [[సైంధవుడు]], అభిమన్యుడు [[పద్మవ్యూహం]]లో ప్రవేశించిన తరువాత అర్జునుని మినహా మిగిలిన పాండవులను అడ్డగించాడని, ఆ కారణంగానే అభిమన్యుడు యుద్ధములో మరణించాడని క్రోధుడైన అర్జునుడు ప్రతినచేసి సైంధవుని సంహరించి తన పుత్రశోకాన్ని ఒకింత తగ్గించుకుంటాడు. అందువలన సైంధవుని మరణానికి అభిమన్యుడు కారణమౌతాడు. అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహములో ఎలాప్రవేశించాలని వివరించినపుడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు వినడం గ్రహించిన కృష్ణుడు అర్జునుని నివారించి పద్మవ్యూహం నుండి బయటికి రావడం చెప్పకుండా చేశాడు. ఆకారణంగా పద్మవ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుడు పద్మవ్యూహంనుండి బయట పడలేక వీరమరణం చెందినట్లు మహాభారత కథనం వివరిస్తుంది.
|