గ్రంథచౌర్యం గుర్తింపు - సాధనాలు: కూర్పుల మధ్య తేడాలు

Blanked the page
ట్యాగు: తుడిచివేత
పంక్తి 1:
== అబ్బూరి రామకృష్ణా రావు ==
అబ్బూరి రామకృష్ణారావు ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి వైతాళికుడు. బహుముఖ ప్రజ్నాశాలి. కవి, పండితుడు, నవలా రచయత, నాటక కర్త, సాహితీవేత్త, విమర్శకుడు, అభ్యుదయ భావాలున్నవారు, మానవతావాది, గ్రంధాలయాచార్యుడు, గ్రంధాలయాధికారి.
 
ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు, అబ్బురి రామకృష్ణారావు లను కవిత్రయమని పేర్కొంటారు. ఆధునిక కవిత్వానికి ముగ్గురూ మార్గదర్శకులే కాక వారి రచనలు ఒకే కాలాన ప్రచురింతం అయ్యాయి. [రిఫ్] వరద రాజేశ్వరరావు. మా నాన్నగారు. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.157-175.<br />పండిత వంశం లో జన్మించారు. తాతగారు కవి. తండ్రి సంస్కృతాంధ్రాలలో పండితుడు. ఈయన కూడా బహుభాషా కోవిదుడు. సంస్కృతం, తెలుగు, ఆంగ్లము, బెంగాలీ, పర్షియన్ సాహిత్యాలను క్షుణ్ణం గా చదివినవారు. 5వ ఫారం వరకూ పాఠశాల విద్య తెనాలి లోనే జరిగింది. సికంద్రాబాద్ లో మహబూబ్ కళాశాలలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై అక్కడే అరబిక్ ను అభ్యసించారు. ఎఫ్.ఎ. (నేటి ఇంటర్మీడియట్) చదవడానికి నోబుల్ కళాశాలలో చేరారు.
 
15వ ఏటనే వారికి మేనమామ కుమార్తె రుక్మిణి తో వివాహం అయింది.
 
అబ్బూరికి కాంగ్రెస్ నాయకులు భోగరాజు పట్టాభిరామయ్య, చెరుకువాడ వెంకటనరసింహం, కవులు చెళ్ళపిళ్ళ వెంకట కృష్ణశాస్త్రి, త్రిపురనేని రామస్వామి, కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు వంటి వారితోటి మంచి సాహచర్యం లభించింది. తరువాత మైసూరు లో ఫలప్రదంగా గడిపిన 3 సంవత్సరాలు అబ్బూరిలో సృజనాత్మకత వెల్లివిరియడానికి దోహదం చేసింది. అక్కడే ఊహాగానము, నదీసుందరి వంటి కావ్యాలు రచించారు.
 
1918లో కలకత్తా వెళ్ళి సిటీ కళాశాలలో బి.ఏ. కొరకు ప్రవేశం తీసుకున్నారు. (ఆంధ్రవీరులలో మృగరాజు వంటి వాడు). అక్కడ పండితులు అక్కిరాజు ఉమాపతిగారి తరువాత బెంగాల్ ఆంధ్ర సంఘం (అసోఏసిఏషన్) కు ఉపాధ్యక్షులు కూడా అయ్యారు. బి.ఏ. పట్టా తీసుకున్న తరువాత కొంతకాలం శాంతినికేతన్ లో గడిపి తిరిగి ఆంధ్ర రాష్ట్రానికు తిరిగివచ్చారు.
 
=== స్వాతంత్రోద్యమం ప్రభావం: ===
1919 సంవత్సరం లో ఆంధ్ర దేశం లో స్వరాజ్యోద్యమం మమ్మురంగా సాగుతున్న రోజులలో రామదండును నిర్వహిస్తున్న ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో అబ్బూరి స్వాతంత్రోద్యమం లో పాల్గొన్నారు. ఆకాలంలో "జలియన్ వాలాబాగ్" బుర్రకధ రచించి అనేక చోట్ల ప్రదర్శించారు. ఇది బహుళ ప్రజాదరణ, ప్రచారం పొందింది, కానీ ప్రభుత్వం నిషేధించింది.
 
[రిఫ్] హరి ప్రసాద రావు, సూదన. సాహితీవేత్త-శ్రీ అబ్బూరి రామకృష్ణారావు. గ్రంధాలయ జ్యోతి. పు14-17. ఏప్రిల్-జూన్ 1980.
 
అబ్బూరి కి కార్మీక సంఘాల తోను, కమ్యూనిష్టు పార్టీ తో అనుబంధం ఉండేది. ఆ సందర్బం లోనే పుచ్చపల్లి సుందరయ్యగారితో, ఎం.ఎన్.రాయ్ వంటి వారితో సాన్నిహిత్యం ఏర్పడింది.
 
=== సాహిత్య సేవ ===
అబ్బూరి 1909 నాటికే, అయిదో ఫారం చదువుతుంఫగానే "జలాంజలి" అను పద్యకావ్యం రచించారు. 1917-19 మధ్యకాలం అబ్బూరి గురుదేవులు రవీంద్రనాధ్ ఠాగూర్ సన్నిధిలో శాంతినికేతన్ లో గడిపిరి. అప్పుడే వీరు "ఊహాగానం", నిరాడంబరతా భావనాబలాలు" రచించారు.
 
[రిఫ్] హరి ప్రసాద రావు, సూదన. సాహితీవేత్త-శ్రీ అబ్బూరి రామకృష్ణారావు. గ్రంధాలయ జ్యోతి. పు14-17. ఏప్రిల్-జూన్ 1980.
 
దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ శ్రీ), భాషావేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి మొదలగువారు తమ గురువుగా భావించేవారు, మేస్టారు అని సంబోధించేవారు. అనేక సాహిత్య చర్చలు జరిపేవారు. అబ్బూరి వారు తమను కలుసుకోవాలని చూడవచ్చిన భద్రిరాజు కృష్ణముర్తి కి చివరగా ఈ పద్యం వ్రాసుకోమని వినిపించారు.
 
"చచ్చిపోయి జీవి ఎచ్చట కేగునో <br/>ఏమి యగునో ఎవరికెరుగరాదు, <br/>ఎరుకలేని వారలేమేమో చెప్పగా <br/>విని తపించువారు వేనవేలు."
 
[రిఫ్] కృష్ణమూర్తి, భద్రిరాజు. అబ్బూరి మేస్టరుగారు నేను. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.64-69
 
వీరికి నాటకాలంటే చాలా ఇష్టం ఉండేది. వారు నాటకాలు రచించారు. దర్శకత్వం వహించారు, హైదరాబాదులో, దిల్లీ లో కూడాప్రదర్శించారు. ముఖ్యంగా కన్యాశుల్కం, ప్రతిమాసుందరి వంటి వాటిలో నటించారు. మృఛ్చకటికం నాటకాన్ని తర్జుమాచేశారు.
 
[రిఫ్] నరసింహారావు, ఎ.ఎల్. ఆప్తుడు అబ్బూరి. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.19-39
 
మృఛ్చకటికం నాటకాన్ని అప్పుడే దిల్లీ లో ప్రారంభమైన దూరదర్శన్ (1965) లో, డా. సర్వేపల్లి రాధాకృష్ణ వద్ద రాష్ట్రపతిభవన్ లో ప్రదర్శించారు.
 
[రిఫ్] కృష్ణ, ఎ.ఆర్. జ్ఞాపకాలు. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.75-77
 
1957 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంగీత నాటక సాహిత్య లలిత అకాడమీ స్థాపనలో ముఖ్య సలహాదారుగా కీలకపాత్ర వహించి అకాడమీ స్థాపనకు అంకురార్పణ చేశారు. వీరి సూచన అనుసరించి ఆకాశవాణి లో 1957లో 90 నిముషాల జాతీయ నాటకాల ప్రసారం మొదలుపెట్టింది.
 
[రిఫ్] రామారావు, పన్నూరి. గురువుగారు - శ్రీ అబ్బూరి రామకృష్ణారావుగారు. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.78-84.
 
1936లో ప్రేమచంద్, నజ్జాద్ జహీర్, హిరేన్ ముఖర్జీ వంటి వారితో కలసి అఖిల భారత అభ్యుదయ రచయతల సంఘం స్థాపించి, వారి పత్రిక "ఇండియన్ లిటరేచర్" సంపాదకవర్గం లో ఒకరు గా ఉన్నారు.
 
[రిఫ్] అభ్యుదయ, జూన్ 1979. నిత్య విజ్ఞానా న్వేషి అబ్బూరి. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.90-92
 
నటాలి, నాట్యగోష్టి వంటి సంస్థలు అబ్బూరి వారి నాటకరంగ సేవకు నిదర్శనాలు. ఈయన 1939 లో ఎం.ఎన్.రాయ్, లక్ష్మణశాస్త్రి, సచ్చిదానంద వాత్సాయన వంటి వారితో కలసి స్థాపించిన భారతీయ పునరుజ్జీవన సంఘం (ఇండియన్ రినైసాంస్ అసోసియేషన్) సాహిత్య పునర్వికాసం లో ముఖ్యపాత్ర వహించింది.
 
[రిఫ్] ప్రభాకరరావు, దేవులపల్లి. చెప్పుకోదగ్గ మనిషి.అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.85-87
 
=== రచనలు ===
 
# ఊహాగానము, ఇతర కృతులు (పద్య గేయ కృతుల సంపుటి) ప్రధమ ముద్రణ 1973, ద్వితీయ ముద్రణ 1994 లో ప్రచురితమైనది
# మల్లికాంబ (1915-16 ఆంధ్ర భారతి పత్రిక) https://www.sakshi.com/news/family/article-abburi-ramakrishna-rao-sakshi-sahityam-1087540
# నదీసుందరి (నాటకం) 1923
#ఎర్రగన్నేరు (1924)
#'''సూర్యరాజు చెప్పిన కధలు (కృష్ణా పత్రిక, 1923)''' https://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=658
#'''కల్పనా కధలు. (కృష్ణా పత్రిక, 1923)'''
#'''మేఘా లేఖ్యములు (శారదా పత్రిక, 1923)'''
#'''మంగళసూత్రం (అపరాధ పరిశోధక నవల) 1924లో ప్రచురితమైంది.'''
#'''మంగళసూత్రం (ఇది అబ్బూరి వారు రచించిన నవల, కథల సంకలనం) 1995 లో ప్రచురితమైనది.'''
#
#
#
 
అబ్బురి వారి రచనలను సేకరించి ఊహాగానము, ఇతర కృతులు పేరుతో కవితాసంస్థ ప్రచురించింది.
 
[రిఫ్] వెంకటేశ్వర రావు, నార్ల. శ్రీ అబ్బూరి. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.40-41.
 
=== గ్రంధాలయ శాస్త్ర ఆచార్యులుగా, గ్రంధాలయాధికారి: ===
ఆంధ్ర విశ్వకళా పరిషత్ 1926 లో స్థాపించిన తరువాత కట్టమంచి రామలింగా రెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు అయ్యాక అబ్బూరి ప్రప్రధమ ఆంధ్ర్యాధ్యాపకులుగా చేరారు. తెలుగు భాషతో బాటు గీర్వాణమును కూడా బోధించారు. డా.ఎం. ఒ. థామస్ తరువాత గ్రంధాలయాధికారిగా నియమింపబడి సుమారు అక్కడే 34 సంవత్సరాలు పనిచేశారు. గ్రంధాలయాధికారిగా నియంపబడినప్పుడు గ్రంధాలయ సంబంధిత ఉద్యోగార్హతలు లేవు. 1932-33 మధ్య బ్రిటీష్ గ్రంధాలయ సంఘం, లండన్ వారి నుంచి ఎఫ్.ఎల్.ఎ "ఫెలో ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్, లండన్" అనే గౌరవ పట్టా పొందారు.
 
సాహిత్య, సంస్కృతిక రంగాలలో విద్వత్తు కలిగి న అబ్బురి గ్రంధాలయాధికారిగా ఉన్నందున అనేక మంది కవులు, పరిశోధకులు కూడా ఆయన సలహాలను పొందుతూండేవారు.
 
విశాఖపట్నంలో సాహిత్య వాతావరణం పెరగడానికి అది దోహదం చేసింది. అబ్బూరిని శ్రీ శ్రీ లాంటివాళ్లు  మేస్టారు అనేవారు.
 
(https://www.sakshi.com/news/family/article-abburi-ramakrishna-rao-sakshi-sahityam-1087540)
 
గ్రంధాలయాలు వాటి విద్యు క్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి వివిధ స్థాయిలలో శిక్షణ పొందిన సిబ్బంది అవసరాన్ని గుర్తించిన అబ్బూరి వారు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ గ్రంధాలయ శాస్త్రం లో సర్టిఫికేట్, డిప్లమాలలో అధ్యయనాలు ప్రవేశ పెట్టారు. వీరితో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు డా. వి.ఎస్.కృష్ణ సాన్నిహిత్యం , ఆత్మీయత విశ్వవిద్యాలయ గ్రంధాలయం ఇంకా గ్రంధాలయ శాస్త్ర అధ్యయనాలను అభివృద్ధి చేయడానికి తోడ్పడ్డాయి. అబ్బూరి రామకృష్ణారావు తమ పదవీకాలం పూర్తయిన 2/3 సంవత్సరాల తరువాత 1960 లో పదవీ విరమణ చేశారు. గ్రంధాలయాలకు సంబంధించి వారు ఈ క్రింది సందేశాన్ని ఇచ్చారు.
 
"గ్రంధాలయాలు అనాధ శరణాలయాలు కాదు ... అనాధ శరణాలయాలు మాదిరి అభివృద్ధి చెందకూడదు."
 
[రిఫ్] హరి ప్రసాద రావు, సూదన. సాహితీవేత్త-శ్రీ అబ్బూరి రామకృష్ణారావు. గ్రంధాలయ జ్యోతి. పు14-17. ఏప్రిల్-జూన్ 1980.
 
[రిఫ్] నారాయణరావు, డి.జె. స్మృతిపధం లో శ్రీ అబ్బూరి. గ్రంధాలయ జ్యోతి. పు.7-11. ఏప్రిల్-జూన్ 1980.
 
=== కళాప్రపూర్ణ ===
వీరు ఎన్నో బిరుదులు, సన్మానాలు నిరాకరించారు.
 
ఆంధ్ర విశ్వకళా పరిషత్ వారు తమ 47వ పట్టప్రదాన సభ యందు 1974 అగస్ట్ 3న అబ్బూరి కి కళాప్రపూర్ణ బిరుదు ప్రదానం చేశారు.
 
[రిఫ్] మాధవాచార్యులు, వై. ప్రఖ్యాపన ప్రసంగం. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.43-45.
 
=== ఇతర పదవులు ===
1953 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి తరువాత రాష్ట్ర ప్రభుత్వం గ్రంధాలయాల అనుసంధానాన్ని 1956 లో కొత్తగా ఏర్పడ్డ విశాలాంధ్ర రాష్ట్రంలో విస్తృతం చేయడానికి, రాష్ట్ర కేంద్ర గ్రంధాలయం ఏర్పాటులో అబ్బూరి వారి సలహా, సహకారం కోరింది. విశాఖ రచయతల సంఘం అధ్యక్ష్యులుగా నన్నయ్య పద సూచి సంకలనానికి ఆరంభించారు. సాహిత్య అకాడమీ ఏర్పడ్డ తరువాత తిక్కన్న మొదలగు ఆచూకీ గ్రంధాలు, 20వ శతాబ్దపు తెలుగు సాహిత్య ప్రచురణల సూచిని తయారు చేయుటకు ప్రణాళికలు తయారు చేశారు. వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ, కేంద్ర సంగీత నాటక అకాడమీతో అనుబంధం ఉంది. 1957-58 మధ్యలో సాహిత్య అకాడమీ వారి అభ్యర్ధన మేరకు రబీంద్రనాధ్ టాగోర్ వారి చాలా నాటకాలు తెలుగు లోకి తర్జుమా చేశారు.
 
ఆయన పదవీ విరమణ తరువాత హైదరాబాద్ లో ఏ.ఆర్.కృష్ణ, మంత్రి శ్రీనివాస రావు తదితరులతో కలసి నాట్య విద్యాలయను స్థాపించి నాటకాలకు దర్శకత్వం వహించడమే కాకుండా ఒక సంవత్సరం థియేటర్ ఆర్ట్స్ లో సర్టిఫికేట్ అధ్యయనాలను ఆరంభించారు.
 
=== కుటుంబం ===
 
* వీరి రెండవ కుమారుడు అబ్బూరి వరద రాజేశ్వరరావు రచయత, విమర్శకుడు ఇంకా అధికారభాషాసంఘానికి అధ్యక్ష్యులు గా పనిచేశారు. నవలా రచయత్రి, స్త్రీవాద రచయత్రి, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అబ్బూరి ఛాయాదేవి వీరి కోడలు.
 
https://www.newindianexpress.com/states/telangana/2019/jun/28/popular-telugu-fiction-writer-abburi-chayadevi-passes-away-at-85-1996641.html
 
== ఇతర లింకులు ==
 
* https://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=658
 
* https://archive.org/details/abburisamsmarana025580mbp/page/n3/mode/2up అబ్బూరి సంస్మరణ (సంపాదకుడు - అబ్బూరి గోపాలకృష్ణ)
 
* https://books.google.co.in/books?id=FZTOPE3rrCcC&printsec=frontcover&source=gbs_ge_summary_r&cad=0#v=onepage&q&f=false
 
ఇ. నాగేశ్వరరావు. అబ్బురి రామకృష్ణారావు . (E. Nageswera Rao. ABBURI RAMAKRISHNA RAU (Makers of Indian Literature; monograph). New Delhi: Sahitya Akademi, 2002.