సాక్షి (దినపత్రిక): కూర్పుల మధ్య తేడాలు

చి →‎‌విమర్శలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 22:
 
==చరిత్ర==
సాక్షి [[మార్చి 24]], [[2008]]న 23 ఎడిషనులతో ప్రారంభించబడింది. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]కు చెందిన మారియో గార్సియా ఈ పత్రిక రూపకల్పన చేసాడు. జగతి పబ్లికేషన్స్ లో భాగంగా ఈ పత్రిక పనిచేస్తుంది. [[తెలుగు]] దినపత్రికారంగంలో మొదటిసారిగా అన్ని పేజీలూ [[రంగు]]లలో ముద్రణ చేయబడుతోంది. తొలిగా ఇతర దినపత్రికల ప్రాంతీయ ఎడిషన్లు చిన్న సైజులో వస్తుంటే, దీనిలో పెద్ద సైజులో వెలువడింది. ఆదివారం అనుబంధం '''ఫన్‌డే''' పేరుతో విడుదల అవుతుంది. దీనిలో కథలు, సీరియళ్లు, హాస్య శీర్షికలు ఉంటాయి.
 
తొలిదశలో [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] మాజీ ముఖ్యమంత్రి [[వై.యస్.రాజశేఖర్ రెడ్డి]] కుమారుడు [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి|వై.యస్.జగన్]] ప్రధాన సంపాదకుడు. [[సజ్జల రామకృష్ణారెడ్డి]] సంపాదకీయ సంచాలకునిగా, [[కె.ఎన్.వై.పతంజలి]] వ్యవస్థాపక సంపాదకునిగా మొదలైంది. పతంజలి అకాల మరణంతో [[వర్ధెల్లి మురళి]] సంపాదకునిగా బాధ్యతలు చేపట్టాడు. <ref>{{Cite book|title=మీడియా సంగతులు |last=గోవిందరాజు|first=చక్రధర్|publisher=Media House Publications| year=2014|pages= 79|url=|}}</ref> ప్రస్తుతం(2019) సంపాదకీయ సంచాలకుడుగా గా [[కొండుభట్ల రామచంద్ర మూర్తి|కె రామచంద్రమూర్తి]] బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
 
==అమ్మకాలు, చదువరులు==
"https://te.wikipedia.org/wiki/సాక్షి_(దినపత్రిక)" నుండి వెలికితీశారు