ధర్మరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
 
తండ్రి మరణానంతరం [[భీష్ముడు]] మరియు పెదతండ్రి [[దృతరాష్ట్రుడు]] తండ్రిలేని లోటు కనిపించకుండా పాండుకుమారులను పెంచారు. ఉత్తమ గురువులైన [[కృపాచార్యుడు]] మరియు [[ద్రోణాచార్యుడు]] వీరికి సకల విద్యలను నేర్పించారు. కౌరవ పాండవులందరిలోనూ ధర్మరాజు అన్నివిధాలా అగ్రగణ్యుడై, తండ్రిని మిచిన తనయుడిగా ప్రశాంసలను పొందాడు. ఈ యోగ్యతను గమనించిన దృతరాష్ట్రుడు ధర్మరాజును [[యువరాజు]] పదవిలో నియమించాడు.
 
 
విద్యాభ్యాసాలు పూర్తయిన తరువాత దృతరాష్ట్రుడు తన తమ్ముని భాగమైన అర్థరాజ్యాన్ని పాండవులకు పంచియిచ్చాడు. ఆ రాజ్యానికి మొదట ఖాండవ ప్రస్థం ముఖ్య పట్టణంగా ఉండేది. శ్రీకృష్ణుని కోరిక మేరకు ఇంద్రుడు పంపిన [[విశ్వకర్మ]] [[ఇంద్ర ప్రస్థం]] అనే నూతన రాజధానిని ధర్మరాజుకు నిర్మించి యిచ్చాడు.
 
ధర్మరాజు తండ్రి పాండురాజును స్వర్గానికి పంపే ఉద్దేశంతో [[రాజసూయ యాగం]] దిగ్విజయంగా నిర్వహిస్తాడు. శ్రీకృష్ణుని ప్రోత్సాహంతో భీముడు జరాసంధుణ్ణి సంహరిస్తాడు. శ్రీకృష్ణునికి అగ్ర తాంబూలం ఇవ్వి పూజించాడు. సభలో పెద్దలనందరినీ, శ్రీకృష్ణున్ని అవమానించిన చేది రాజైన [[శిశుపాలుడు|శిశుపాలుని శిరస్సును [[సుదర్శన చక్రం]]తో ఖండిస్తాడు.
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ధర్మరాజు" నుండి వెలికితీశారు