ఖారవేలుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వనరులు |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 8:
ఖారవేలునికి సమకాలీనుడు ఆంధ్రదేశంలో [[శాతవాహనులు|శాతవాహన]] రాజు శాతకర్ణి. వారికి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో "పిథుండ" నగరాన్ని ఖారవేలుడు నాశవం చేశాడని [[హథీగుంఫ శాసనం]] (క్రీ.పూ. 183) ద్వారా తెలుస్తుంది. అయితే ఆ యుద్ధంలో ఖారవేలుడు విజయం సాధించాడని చెప్పలేము - "శాతకర్ణిని లక్ష్యం చేయక ఖారవేలుని సైన్యాలు కణ్ణబెణ్ణానది (కృష్ణానది) వరకు పురోగమించి ముషికనగరాన్ని హడలుకొట్టినాయట."
ఏమయినా తరచు కళింగుల మధ్య, శాతవాహనుల మధ్య జరిగిన యుద్ధాలవల్ల తీరాంధ్రప్రాంతం కొంత కళింగుల వశమయ్యింది. ఆంధ్రులకు చాలా నష్టం జరిగింది. పిథుడ నగగరం బహుశా "ప్రతీపాలపురం" లేదా [[భట్టిప్రోలు]] అయ్యి ఉండవచ్చును. ఖారవేలుడు సర్వ రాష్ట్రిక, భోజక ప్రభువులను ఓడించాడు. అంగ వంగ దేశాలనుండి రత్నాలు తెచ్చాడు.
|