ఒగ్గు కథ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: ె → ే , ఎర్ప → ఏర్ప, కటిన → కఠిన , → , , → , (4), , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
ప్రేక్షకుడికి విరామం లేకుండా కట్టి పడేసే కళ '''ఒగ్గు కథ'''. [[బోనం]] ఎత్తుకొని, [[వేప]] మండలు పట్టుకుని ఊగుతూ, తూలుతూ ఎల్లమ్మ [[కథ]] చెప్తుంటే జనం ఊగిపోతారు. [[బోనం]] నెత్తిమీద పెట్టుకొని, ఎంతో సేపు దాన్ని కదలనివ్వ కుండా కింద వేసిన నాణాల్ని నొసటితో అందుకునే దృశ్యం అద్భుతం. జానపద కళారూపాళ్లో 'ఒగ్గు కథ' ప్రముఖమైంది. ఇది కేవలం కథ మాత్రమే కాదు. గానం, నృత్యం, నాటక మిశ్రమం - గొల్ల, కురుమలు తమ కుల పురుషుడు బీరప్ప కథ చెప్పేందుకు ఎంచుకున్న రూపమే ఒగ్గు కథ. ఈ కథా ప్రక్రియకు, చదువు అవసరం లేదు. డోలు, తాళం, కంజీర వాయిద్యాలతో, తెలంగాణ భాషలో గంటల కొద్ది ఎన్నయినా కథలు చెబుతారు. పాటలు జోడించి కథను పండిస్తారు. పురాణాల మీద పట్టుతో ఆశువుగా కథ అలా చెప్పేస్తారు. నెత్తిన బోనం ఉంచుకుని కథ చెబుతూనే నేలను తలతో ముద్దాడతారు.
 
''కురబ '' జాతివారు శివున్ని, బసవన్నని పూజిస్తారు. కురుమలకు ప్రత్యేక పూజారులు, కుల వాయిద్యకారులు ఉన్నారు. తెలంగాణలో ఒగ్గువాళ్లు, బీరప్పలుబీర్లోళ్లు, రాయలసీమలో [[గొరవయ్యలు]] అని వీరిని పిలుస్తారు. వైవిధ్యం కలిగిన ఒగ్గుకథ గాన, కళారూపం ఒక్క తెలంగాణాలోనే కనిపించడం విశేషం. కురుమ కుల పురోహిత వర్గానికి చెందినవారు ఒగ్గుకథని చెప్పే వృత్తిని స్వీకరించారు. బీరన్నలకు ప్రత్యేకమైన వాయిద్యం [[ఒగ్గు]] ([[ఢమరుకం]]) ఉపయోగించి చెప్పే వృత్తి [[పురాణం]] గురించి తెల్సుకోవడం అంటే [[కురుమ జాతి]] చరిత్ర, సంస్కృతుల్ గురించి తెలుసుకోవట మన్నమాట. [[ఒగ్గు దీక్ష]] ఒకటి ఈ కురుమల్లో కనిపిస్తోంది. ఒగ్గు కథలో తర్ఫీదు పొందాలంటే కులపెద్దల అనుమతితో శైవక్షేత్రాలలో ఏదో ఒక క్షేత్రానికి వెళ్తారు. ఆలయ లోగిళ్లలో పట్టాలువేసి విభూతి ధరించి, నామాలను జపించుకొంటూ మల్లన్న దేవుడినే ధ్యానిస్తారు. ఈ పూజ అయిపోగానే ఒగ్గువంతులు [[మంత్రం]] బోధించి ఆశీర్వదిస్తారు. ఎల్లమ్మ ప్రసాదించిన ఏడు గవ్వల హారం మెడలో వేసుకుని మల్లన్నకు ఒదుగుతూ ఒగ్గులవుతారు. ఈ ఒగ్గు దీక్ష తర్వాతే వారు [[బీరన్న, మల్లన్న కథలు]] చెప్పేందుకి అర్హత సంపాదించు కొన్నట్లు అవుతుంది. కురుమలు బీరప్పబీరోళ్ల దీక్ష తీసుకున్న వాళ్లు బీరప్పలవుతారుబీరోళ్లు. ఈ సంప్రదాయం పూర్వం నుంచే వస్తోంది. కురుమల్లో పౌరోహిత్యం చేసేది ఈ ఒగ్గులే. కొంత మంది ఒగ్గులు దేవుని పెట్టెలో మల్లన్న దేవుని [[విగ్రహాలు]] పెట్టు కొని కావడి కట్టుకొని ఊరూరా తిరుగుతారు. వీరు నెత్తి విరబోసుకోని, నుదిటిని పసుపు రాసుకొని, కళ్లకి కాటుక రాసుకొని ఎర్రని పొట్టి చేతుల చొక్కా, మువ్వల లాగు ధరించి కాళ్లకి గజ్జెలు కట్టుకొని నృత్యం చేస్తూ శైవగీతాలు పాడతారు.
==పుట్టుక==
ఒగ్గు కళారూపం శైవమత వాప్తిలో ప్రచార మాద్యమంగా ఉద్భవించి ఉంటుంది. ఎందుకంటే [[పాల్కురికి సోమనాథుడు|పాల్కురికి సోమనాధుడు]] తెలంగాణ ప్రాంతంలో పుట్టి, శైవమత వ్యాప్తికి విశేషమైన కృషి చేసారు. అటువంటి గొప్పవ్యక్తి ప్రభావం ఈ ప్రాంతంలో కళలపై ఉందనడానికి నిదర్శనం ఒగ్గు కథ. ఈ కథల ఇతివృత్తాల్లో [[శివుడు]] కథానాయకుడిగా ఉంటాడు. లేదా శివుని అంశతో జన్మించిన వారు నాయకులుగా ఉంటారు. ఉదాహరణకు శివుని తొలి [[చెమట]] నుండి బీరప్ప మలి చెమట నుంచి మల్లన్న పుట్టారని, ఎల్లమ్మ శివుని కూతురని ఆయా కథల్లో వివరిస్తుంటారు.
 
ఒగ్గుకథల్ని తెలంగాణ ప్రాంతంలోని గొల్ల, కుర్మలు తమ కుల పురాణంగా భావిస్తారు. కుర్మలు ఈ కథల్ని ఎక్కువ ప్రచారం చేసారు. తరువాతి కాలంలో ఇతర కులాల వాళ్ళు కూడా ఈ కళారూపాన్ని నేర్చుకొని ప్రచారం చేసారు. ఇటువంటి వారి సంఖ్య చాల తక్కువ. బీరప్పబీరయ్య, మల్లయ్య కథలు మెదటి నుంచి ఉన్నాయి.ఆ తరువాత ఇతర కథలు పుట్టుకొచ్చాయి.
==కళారూపం==
ఒగ్గు కళారూపం చూస్తుంటే ఒక నాటకం చూసిన అనుభూతి, ఒక నాట్యకళని వీక్షించినంత ఆనందం, ఒక ప్రవచనం విన్నంత సంతృప్తి, ఒక సంగీత కచేరిలో దొరికేంత రసాస్వాదన లభిస్తుంది.అదోక సముద్రం. శ్రోతలు తమకు కావల్సిన ఆనందాన్ని కళ్ళ దోసిళ్ళతో తీసుకపోతారో లేక మనస్సు కుండల్లో పట్టుకెల్తారో వారిష్టం. ఇక ఒగ్గుకథా ప్రదర్శనా తీరుతెన్నుల్ని గమనిస్తే...
పంక్తి 18:
ఈ కథా గాన కళారూపాల పేర్లు ఆ కథలను చెప్పే వారి కులాలను బట్టీ, కథ చెప్పే సమయంలో ఉపయోగించే సహకార వాద్యాలను బట్టీ, కథా వస్తువును బట్టీ వచ్చాయి. సహకార వాయిద్యం ఆధారంగా పేరును సంతరించుకున్న కళా రూపాలు [[పంబ కథ]], [[జముకుల కథ]], [[బుర్ర కథ]], ఒగ్గు కథ, ఇక తెగలను బట్టి పేర్లు వచ్చిన కళారూపాలు [[జంగం కథ]], [[పిచ్చు కుంటుల కథ]], [[గొల్ల సుద్దులు]] మొదలైనవి. కథా వస్తువును బట్టి వ్వహాగృతమౌతున్న కళారూపాలు [[హరి కథ]], [[పాండవుల కథ]], [[రేణుకా కథ]] మొదలైనవి.
 
భిన విభిన్న మైన కథా గాన కళా రూపాలలో ఒగ్గు కథ ఒక్క తెలంగాణా ప్రాంతంలో తప్ప మరో ప్రాంతంలో లేదు. అందులోనూ కరీంనగర్, [[వరంగల్]], [[నల్లగొండ]] [[హైదరాబాదు జిల్లా|,హైదరాబాదు]] జిల్లాలలో బహుళ ప్రచారంలో ఉంది. ఈ మూడునాలుగు జిల్లాలలోనూ సుమారు ఏబై ఒగ్గు కథావందలాది బృందాలు కథలు చెపుతూ ఉన్నాయి.
 
శైవ సంప్రదాయంలో ఒక వర్గం వారు శివుని [[డమరుకం|డమరు]]<nowiki/>కాన్ని ఒగ్గుజగ్గు అంటారనిఅంటారు. వీనికేదీనికి జెగ్గు,ఒగ్గు జగ్గుఅని అనేపేరు పేర్లున్నాయనికూడ ఉంది. ఒగ్గును కథకు వాయిద్యంగాదీనిని వాడుతూ కథ చెబుతారుజెప్తరు కాబట్టి కాబట్టి ఈ కథలకు ఒగ్గు కథ అనే పేరు వచ్చిందనీ,వచ్చిందని.. ఈ కథలు శైవ మతానికి సంబంధించిన వనీసంబంధించినవనీ మల్లన్న, బీరప్పకథలుబీరయ్య ప్రారంభంలో చెపుతూ వుండేవారనీ, అదీ కాక కురుమ కులం వారే ఈ కథలు చెప్పే వారనీ,... బీరప్పబీరయ్య, మల్లన్నలు వీరి కుల దేవతలనీ,దైవాలని ... డా: .బిట్టు వెంకటేశ్వర్లు గారు [[కరీంనగర్]] రాష్ట్రీయ జానపదకళోత్సవాల సంచికలీసంచికలో వివరించారు.
 
[[వరంగల్ జిల్లా]], [[జనగాం]] తాలూకా [[నెల్లుట్ల]] గ్రామ వాసి బండి ఈనయ్య, [[నల్గొండ జిల్లా]], [[రామన్నపేట]] తాలూకా, [[ఆత్మకూరు]] గ్రామ వాసి, చర్ల కొండయ్య, [[వరంగల్ జిల్లా]], [[జనగాం]] తాలూకా [[మాణిక్యపురం]] గ్రామస్థుడు, చౌదరి పల్లి [[చుక్కా సత్తయ్య]]. మల్లికార్జున స్వామి ఒగ్గు డోలు బృందం [[జనగాం]] ఇది ముఖ్యమైన డోలు బృందాల్లో వాటిలో ఒకటిగా నిలిచింది. సభ్యులు బెల్లపురి వీరయ్య, జాయ సత్తయ్య, చంద్రయ్య తదితరులు ఉన్నారు...
"https://te.wikipedia.org/wiki/ఒగ్గు_కథ" నుండి వెలికితీశారు