విద్యారణ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 26:
(శృంగేరి ఫలకం హరిహర రాయలు II మే 1386).
 
1974లో విద్యాభూషణ, విద్యావాచస్పతి ఇత్యాది బిరుదాంకితులు శ్రీ. టి.ఎన్.మల్లప్పగారు బెంగళూరు విశ్వవిద్యాలయము పక్షమున 'క్రియాశక్తి-విద్యారణ్యయ' అను గ్రంధమును ప్రకటించినారు.అందు క్రియాశక్తియే విద్యారణ్యులు అని వాదించినారు.క్రియాశక్తి పాశుపత కాలాముఖుడు ఒక కాశ్మీర బ్రాహ్మణుడు.అభినవ గుప్తాచార్య సిద్ధంతసిద్ధాంత ప్రచారకుడు.శుద్ధశైవుడు.కాశ్మీర బ్రాహ్మణులు షికారిపుర తాలూకలో కేదార మఠమును స్థాపించి కర్ణాటమున పాశుపత మతమును విశేష ప్రచారమునొనర్చిరి.బసవేశ్వరుడు, అతని అనుచరుల ప్రభావము వలన వీరందరు వీరశైవులలో కలిసిరి.13,14,15 శతాబ్దములలో వీరి మఠములు కొన్ని నామమాత్రముగా నిలిచినవి.ఈ శుద్ధశైవులు శంకరుల అద్వైత సిద్ధాంతానికి విరోధులు. శృంగేరీ 12వ పీఠాధిపతి అయిన విద్యారణులు పూర్వ మతమున బుక్కరాయల మంత్రి మాధవుడే సన్యసించి విద్యారణ్య నామమును స్వీకరించినని లోకప్రసిద్ధి.కాని ఆకాలమున క్రియాశక్తి శిష్యుడొకడైన మాధవుడు కలడు.ఈ ఇద్దరు మాధవులలో విద్యారణ్యులెవరనునది సమస్య. మల్లప్పగారు ఈ గ్రంధములో క్రియాశక్తి మాధవుడే విద్యారణ్యులని వాదించినారు. కానీ అటుపై శ్రీ. ఆర్.చక్రవర్తి వీరు చిరకాల మైసూరు ఆర్కియాలజీ ఇలాకాలో పనిచేసిన ప్రముఖ ప్రరిశోధకలు వ్రాసిన "క్రియాశక్తి-విద్యారణ్యవిమర్స" అను గ్రంధమున కన్నడమున వ్రాసి అందు మల్లప్ప గారి వాదనను ఖండించి శ్రీశృంగేరీ అద్వైత సిద్ధాంత మహాసంస్థాపనమునకు చెందిన విద్యారణ్యులు క్రియాశక్తి భిన్నమహాపురుషులు అని నిర్ణయించినారు.వీరి గ్రంధమున 19 అధ్యాయములును, 6 అనుబంధములు కలవు.ఇందులో భరద్వాజ గోత్రీకుడైన మాధవుడు క్రియాశక్తి శిష్యుడని, ఆంగీరస గోత్రీకుడైన మాధవుడే శృంగీరీ మఠ 12వ గురువు అయిన విద్యారణ్యుడని వ్యాఖ్యానించినారు.
 
==మఠాలు==
"https://te.wikipedia.org/wiki/విద్యారణ్యుడు" నుండి వెలికితీశారు