[[మార్క్సిజం]] ప్రభావితుడై విప్లవ రాజకీయాలకు జీవితం అంకితం చేసిన దాసరి నాగభూషణరావు 1925 సంవత్సరంలో [[నూజివీడు]] తాలూకా [[దిగవల్లి]] గ్రామంలో జన్మించారు. ఆమె సతీమణి లక్ష్మీ. అతను ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]]<nowiki/>లో నిరుపేదల పక్షాన నిలిచి భూపోరాటాల ద్వారా విజయం సాధించిన గొప్ప విప్లవ యోధుడు. అఖిల భారత విద్యార్థి సంఘానికి, ప్రపంచ విద్యార్థి సమాఖ్యకు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాడు. నూజివీడు తాలూకా కమ్యూనిస్టు కార్యదర్శిగా పనిచేస్తూ ఆ ప్రాంతంలో 20వేల ఎకరాలకు పైగా భూమిని దళితులు, బీసీలకు పంపిణీ చేయ డంలో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగించాడు. <ref>{{Cite web|url=http://www.prajasakti.com/WEBSUBCONT/2134841|title=భూపోరాట యోధుడు దాసరి {{!}} Prajasakti::Telugu Daily|website=www.prajasakti.com|access-date=2020-07-02}}</ref>