తిలోత్తమ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 15:
మహాభారతం యొక్క ఆది పర్వంలో దైవర్షి [[నారదుడు]], [[పాండవులు|పాండవుల]]కు అప్సరస తిలోత్తమ కారణంగా సుంద ఉపసుంద అనే రాక్షస సోదరులు మరణించిన కథను చెబుతాడు. పాండవుల మధ్య గొడవలకు [[ద్రౌపది]] కూడా ఒక కారణం కావచ్చని హెచ్చరించాడు. సుంద, ఉపసుంద ఇద్దరూ [[హిరణ్యకశిపుడు|హిరణ్యకశిపుని]] వంశ రాక్షసుడు నికుంభ కుమారులు. రాజ్యం, మంచం, ఆహారం, ఇల్లు, సింహాసనం మొదలైనవి అన్ని వారు ప్రతిదీ పంచుకుంటూ విడదీయరాని బంధంగా కలిసివున్నారు. ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న కోరికతో ఆ సోదరులు [[వింధ్య పర్వతాలు|వింధ్య పర్వతాల]]పై తపస్సు చేసి, బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నారు. 'తాము ఏ రూపం కోరుకుంటే ఆ రూపంలోకి మారిపోవడం, ఏ మాయ చేయాలన్నా ఆ మాయను చేయగలగడం, అన్యుల చేతుల్లో చావకుండా ఉండడం' వంటి వరాలు కోరారు. బ్రహ్మ వాటిని ప్రసాదించాడు.
బ్రహ్మవరాలు పొందిన సుందోపసుందులు స్వర్గంపై దాడి చేసి దేవతలను తరిమికొట్టడంతోపాటు మునులను, మనుషులను వేధిస్తూ విశ్వాన్ని వినాశనం చేయడం ప్రారంభించారు.<ref name = "adi">Buitenen, Johannes Adrianus Bernardus (1978). ''The Mahābhārata''. vol 1 [[University of Chicago Press]] Adi Parva (Book of Beginnings) Cantos 201-204. pp. 392-8</ref> దేవతలు, మునులు బ్రహ్రను ఆశ్రయించగా, బ్రహ్మ విశ్వకర్మను ఒక అందమైన స్త్రీని సృష్టించమని ఆదేశించాడు. మూడు లోకాలలో ఉన్న అందమైన రూపాల నుంచి నువ్వు గింజలంతటి పరిమాణాలతో తిలోత్తమ అనే అప్సరసను సృష్టించాడు.
సందోపసుందులు వింధ్యా పర్వతాలలో ఒక నది ఒడ్డున మధువు సేవిస్తుండగా పువ్వులు తెంపుతున్న తిలోత్తమ కనిపించింది. ఆమె అందానికి మంత్రముగ్ధులైన ఆ సోదరులు వెళ్ళి తిలోత్తమ కుడి, ఎడమ చేతులను పట్టుకున్నారు. సందోపసుందులు తనకోసం [[File:The Churning of the Milky Ocean.jpg|thumb|పాల సముద్ర మధనంలో సముద్రం నుండి ఉద్బవించిన అప్సరసలు.]]
|