తిలోత్తమ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
బ్రహ్మవరాలు పొందిన సుందోపసుందులు స్వర్గంపై దాడి చేసి దేవతలను తరిమికొట్టడంతోపాటు మునులను, మనుషులను వేధిస్తూ విశ్వాన్ని వినాశనం చేయడం ప్రారంభించారు.<ref name = "adi">Buitenen, Johannes Adrianus Bernardus (1978). ''The Mahābhārata''. vol 1 [[University of Chicago Press]] Adi Parva (Book of Beginnings) Cantos 201-204. pp. 392-8</ref> దేవతలు, మునులు బ్రహ్రను ఆశ్రయించగా, బ్రహ్మ విశ్వకర్మను ఒక అందమైన స్త్రీని సృష్టించమని ఆదేశించాడు. మూడు లోకాలలో ఉన్న అందమైన రూపాల నుంచి నువ్వు గింజలంతటి పరిమాణాలతో తిలోత్తమ అనే అప్సరసను సృష్టించాడు.
 
సందోపసుందులు వింధ్యా పర్వతాలలో ఒక నది ఒడ్డున మధువు సేవిస్తుండగా పువ్వులు తెంపుతున్న తిలోత్తమ కనిపించింది. ఆమె అందానికి మంత్రముగ్ధులైన ఆ సోదరులు వెళ్ళి తిలోత్తమ కుడి, ఎడమ చేతులను పట్టుకున్నారు. సందోపసుందులు తనకోసం పోటీపడి ఎవరు గెలిస్తే తాను వారి సొంతమని తిలోత్తమ చెప్పగా, సందోపసుందులు పోటిపడి ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారు. అదిచూసి దేవతలు ఆమెను అభినందించారు. బ్రహ్మ ఆమెకు విశ్వంలో స్వేచ్ఛగా తిరిగేలా వరం ఇచ్చాడు. ఆమెకున్న మెరుపు కారణంగా ఎవరూ ఆమెను ఎక్కువసేపు చూడలేరని బ్రహ్మ ఆదేశించాడు.

బ్రహ్మ వైవర్త పురాణంలో తిలోత్తమ చంద్రుని దగ్గరకు వెళ్తుంటే సాహసికుడు ఆపాడట. వారి చెట్టా పట్టాల వల్ల ఆనందపు అరుపుల వల్ల దుర్వాసుని తపోభంగం జరిగి తిలోత్తమ శాపానికి లోనయిందట. బాణాసురుడి కూతురుగా రాక్షసిగా పుట్టిందట. కృష్ణుని మనవణ్ణి పెళ్ళాడి శాప విముక్తమైందట!
 
[[File:The Churning of the Milky Ocean.jpg|thumb|పాల సముద్ర మధనంలో సముద్రం నుండి ఉద్బవించిన అప్సరసలు.]]
"https://te.wikipedia.org/wiki/తిలోత్తమ" నుండి వెలికితీశారు