కొండేపూడి శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 82:
ఇతడు [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[కాళ్ళ]] మండలం [[బొండాడ]] గ్రామంలో [[సెప్టెంబరు 4]], [[1924]]న జన్మించాడు. ఇతడు [[పోలాండ్]] దేశంలోని వార్సా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్ పట్టభద్రుడయ్యాడు.విదేశీ కమ్యూనిస్టు సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించాడు.గుంటూరు జిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షునిగా పనిచేశాడు. అరసం రాష్ట్రశాఖకు కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాడు. రాష్ట్రంలో ఇండో సోవియట్ కల్చరల్ సొసైటిని స్థాపించాడు. ఇండో జి.డి.ఆర్.మిత్రమండలి జాతీయ సమితి కార్యదర్శిగా పనిచేశాడు. ఇండియన్ టొబాకో అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. బల్గేరియా మిత్ర సంఘం, శాంతి సంఘీభావ సమితి మొదలైన సంస్థల నాయకుడిగా కృషి చేశాడు. [[పులుపుల వెంకటశివయ్య]] సాహిత్య అవార్డును పొందారు.ఇతడు [[1985]], [[జూలై 22]]న మరణించాడు. ఇతని మరణానంతరం [[అభ్యుదయ రచయితల సంఘం]] గుంటూరు జిల్లాశాఖ పెనుగొండ లక్ష్మీనారాయణ సంపాదకత్వంలో "స్మృతిరేఖలు" పేరుతో ఒక స్మారక సంచికను ప్రచురించింది. ఈ సంస్థ 1986 నుండి ఈయన పేరుతో కొండేపూడి సాహిత్య అవార్డులు ప్రకటిస్తున్నది.
==కొండేపూడి సాహిత్య అవార్డు గ్రహీతలు==
అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు శాఖ కొండేపూడి శ్రీనివాసరావు మరణానంతరం అతని స్మృత్యర్థం 1986 నుండి 2016 వరకు కొండేపూడి సాహితీసత్కారాన్ని అతని కుటుంబ సభ్యుల సహకారంతో ప్రదానం చేసింది. ఈ సత్కారాన్ని పొందిన సాహితీవేత్తలు<ref name="గుంటూరుసీమ">{{cite book |last1=పెనుగొండ లక్ష్మీనారాయణ |title=గుంటూరుసీమ సాహిత్యచరిత్ర |date=జనవరి 2020 |publisher=ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ |location=గుంటూరు |pages=283-284 |edition=1}}</ref>:
*[[ఆవంత్స సోమసుందర్]] - 1986
*[[చాగంటి సోమయాజులు]] - 1987