----
'''సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి''' ([[1860]] - [[1922]]) సుప్రసిద్ధులైన సంగీత విద్వాంసులు, [[త్యాగరాజ స్వామి]] వారి శిష్యులు, సంగీత విద్యాబోధకులు. వీరు [[కృష్ణా నది]] తీరంలోని [[పెదకళ్ళేపల్లి]] (కదళీపురం) అగ్రహారంలో గంగాధర శాస్త్రి, లక్ష్మాంబ దంపతులకు జన్మించారు. వీరు కొంతకాలం వేదం, సంస్కృతం అభ్యసించారు. వీరికి సాహిత్యంతో పాటు సంగీతాన్ని కూడా అభ్యసించవలెనని దృఢ సంకల్పం కలిగింది. మొదట సంగీతాన్ని కొంతవరకు నేర్చుకుని, తర్వాత [[తంజావూరు]] కాలినడకన వెళ్ళి, అక్కడ [[త్యాగరాజ స్వామి]]కి శిష్యులు, బంధువులైన [[చావడి వేంకట సుబ్బయ్య]] గారి వద్ద సంగీత విద్యను అభ్యసించారు. వీరిని ద్రవిడ దేశంలోని సుప్రసిద్ధపేరొందిన గాయకులైన [[పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్]], [[మహా వైద్యనాథ అయ్యర్]], [[ఫ్లూట్ శరభశాస్త్రి]] సహాధ్యాయులు. సుమారు రెండు సంవత్సరాలు సంగీతం అభ్యసించి [[వీణ కుప్పయ్యర్]], వారి కుమారులు [[ముత్యాలపేట త్యాగయ్య]] వద్ద గీతాలు, వర్ణాలు, పాఠాలు అభ్యసించారు. అనంతరం స్వదేశానికి తిరిగివచ్చి సంగీత విద్యా సంప్రదాయాన్ని అనేకమంది విద్యార్థులకు నేర్పించారు.
==జీవిత సంగ్రహం==
=== మదరాసు ప్రయాణం ===
దక్షిణామూర్తి గారు తల్లిదండ్రులు తెనాలిలో ఉండగా [[కాంచనమాల]] ద్వారా దక్షిణా మూర్తి గారి ప్రతిభ విన్న [[భీమవరపు నరసింహారావు]] గారు తెనాలి వచ్చి వారి గానం విని మదరాసుకు ఆహ్వనించారు. ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు భీమవరపు నరసింహారావు వద్ద చేరి, 1937 నుంచి సహాయకునిగా పనిచేసారు.
1938లో 'హిజ్ మాస్టర్స్ వాయిస్' (హెచ్.ఎం.వి) సంస్థలో హార్మోనిస్టుగా చేరారు. ప్రఖ్యాత సంగీత దర్శకుల జంట ఎం.ఎస్. విశ్వనాథన్ - రామ్మూర్తిలో ఒకరైన రామ్మూర్తి వారికి సహోద్యోగి. .
=== ఆకాశవాణిలో ===
1939 ప్రాంతంలో '[[ఆకాశవాణి]]' (ఏ.ఐ.ఆర్) - ఢిల్లీలో ప్రవేశించారు. ఆకాశవాణిలో వారు 'ఏ' గ్రేడ్ ఆర్టిస్టు. మద్రాసు, కలకత్తా, బెల్గామ్, పూనా, బొంబాయి, కటక్ లాంటి ఎన్నో చోట్ల ఆకాశవాణిలో పనిచేశారు. మద్రాసులో దాదాపు ఓ ఏడాది పాటు పనిచేశారు. వారి పనితీరుకు మెచ్చి, ఢిల్లీకి వెళ్ళమని మద్రాసు ఆకాశవాణి కేంద్రం డైరెక్టరే వారనిివారని ఢిల్లీకి పంపించారట. దక్షిణ భారత భాషల సంగీత నిర్దేశకుడిగా సుసర్ల ఎన్నో మధుర స్వరాలను ఆకాశవాణి శ్రోతలకు అందించారు. జాతీయ వార్త సంస్థ 'సెంట్రల్ న్యూస్ ఆర్గనైజేషన్'లో సంగీత నిర్దేశకుడిగా సేవలందించారు
== సిని ప్రపంచంలో ==
=== నేపధ్యగాయకునిగా ===
నిండైన గాత్రం ఉన్న దక్షిణామూర్తి తొలి రోజుల్లో సినీ నేపథ్య గాయకుడిగా పలు పాటలు పాడారు. '[[పరమానందయ్య శిష్యులు]]' (1950), '[[శ్రీ లక్ష్మమ్మ కథ]]' (1950), '[[స్త్రీ సాహసం]]' (1951) మొదలైన చిత్రాలలో ప్రముఖ హీరో అక్కినేని నాగేశ్వరరావుకు ప్లే-బ్యాక్ పాడారు. '[[సర్వాధికారి]]' (1951) చిత్రంలో తమిళ హీరో ఎం.జి.ఆర్.కు గొంతు అరువిచ్చారు.
=== సంగీత దర్శకునిగా ===
పర్లాకిమిడి రాజా గజపతిదేవ్ తీసిన 'నారద నారది' (1946) చిత్రంతో సుసర్ల దక్షిణామూర్తి తొలిసారిగా సంగీత దర్శకత్వం చేపట్టారు. ఆ తరువాత కొల్హాపూర్లో నిర్మించిన '[[సేతు బంధన్]]' (1946) చిత్రానికీ, పూనాలో నిర్మించిన '[[భట్టి విక్రమార్క]]' చిత్రానికీ సంగీత దర్శకత్వం వహించారు. 'సంసారం' (1950) చిత్రంతో సంగీత దర్శకుడిగా సుసర్ల దక్షిణామూర్తి బాగా ప్రాచుర్యం పొందారు. ఆ రోజుల్లోనే ''ప్రముఖ నటి - నిర్మాత లక్ష్మీరాజ్యం నిర్మించిన రెండు, మూడు సినిమాలకు కలకత్తాలో పనిచేశారు. ఆకాశవాణిలో పనిచేయడం కూడా సంగీత దర్శకుడయ్యాక సుసర్లకు బాగా ఉపయోగపడింది. ''గాయని [[లతా మంగేష్కర్]] అప్పట్లో ఢిల్లీ రేడియో స్టేషన్లో పాటలు పాడుతుండేది. ఆమె గాత్రంతో, ఆమెతో పరిచయం ఉండడంతో, వారు ఆమెతో తొలిసారిగా తెలుగు సినిమాలో 'నిదురపోరా తమ్ముడా...' అనే పాటను ఆమెతో పాడించారు. అన్ని భాషల్లోనూ కలిపి 135 దాకా చిత్రాలకు సుసర్ల దక్షిణామూర్తి పనిచేశారు. '[[సంసారం]]' (1950) 'ఆలీబాబా - నలభై దొంగలు', '[[సర్వాధికారి]]' (1951), 'ఆడజన్మ' (1951), 'దాసి' (1952), 'సంతానం' (1955), 'ఇలవేలుపు' (1956), 'హరిశ్చంద్ర' (1956), 'భలే బావ' (1957), 'శ్రీకృష్ణలీలలు' (1959), 'అన్నపూర్ణ' (1960), '[[నర్తనశాల]]' (1963), 'శ్రీమద్విరాటపర్వం' (1979), 'శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' (1984) ఆయన సంగీతం అందించిన సినమాలలో కొన్ని. సంగీత దర్శకులు ఎస్.పి. కోదండపాణి, ఏ.ఏ. రాజ్, శ్యామ్ మొదలైనవారు ఈయన వద్ద పనిచేసినవాళ్ళే! అలాగే, ప్రముఖ సంగీత దర్శకుడు [[ఎం.ఎస్. విశ్వనాథన్]] సైతం సుసర్ల వద్ద హార్మోనిస్టుగా పనిచేశారు. సంగీత దర్శకుడిగా సుసర్ల ప్రధానంగా హార్మోనియమ్ మీదే బాణీలు కట్టేవారు. [[జమునా రాణి]], [[పి. లీల]], బెంగుళూరు లత మొదలైన గాయనీమణులకు తొలి అవకాశం ఇచ్చి, పరిచయం చేసింది - సుసర్లే! '[[సంతానం]]' (1955)తో లతా మంగేష్కర్నూ, '[[ఇలవేలుపు]]' (1956)తో [[రఘునాథ్ పాణిగ్రాహి]]నీ, '[[వచ్చిన కోడలు నచ్చింది]]' (1959)తో ఎం.ఎల్. వసంత కుమారినీ, '[[నర్తనశాల]]' (1963)తో మంగళంపల్లి బాలమురళీకృష్ణనూ సుసర్ల దక్షిణామూర్తి తెలుగు చిత్ర రంగానికి పరిచయం చేశారు. సుసర్ల స్వరపరచగా, రావు బాలసరస్వతి గానం చేసిన 'నీలవణ్ణ కణ్ణా వాడా నీ వరు ముత్తం తాడా...' ([[శివాజీ గణేశన్]], పద్మిని నటించిన ఓ తమిళ చిత్రంలోని పాట) లాంటి తమిళ చిత్ర గీతాలు సైతం ఇవాళ్టికీ అక్కడ పాపులరే!
సంగీత దర్శకుడిగా అవకాశాలు తగ్గాక, కుటుంబ పోషణ కోసం అప్పటి ప్రముఖ సంగీత దర్శకుడు [[చక్రవర్తి]] దగ్గర పాటల రికార్డింగుల్లో [[వయొలిన్]] వాద్య కళాకారుడిగా కూడా పనిచేశారు. 1982 నుంచి 1987 వరకు ఆయన చక్రవర్తి సంగీత బృందంలో వయొలిన్ వాయించారు.
=== నటునిగా ===
|