ప్రబోధానంద యోగీశ్వరులు: కూర్పుల మధ్య తేడాలు

చి cleanup citations
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
చి cleanup citations remove epaper ref as same is available as a direct page
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 34:
| weight =
}}
'''ప్రబోధానంద యోగీశ్వరులు''' (1950 ఏప్రిల్ 5 - 2020 జూలై 9) వివాదాస్పద<ref>{{Cite web|url=http://www.prajasakti.com/Article/Ananthapuram/2084471|title=ప్రబోధానంద స్వామి అరెస్టు విషయంలో అలసత్వం తగదు {{!}} Prajasakti::Telugu Daily|website=www.prajasakti.com|access-date=2019-09-17}}</ref> ఆధ్యాత్మిక గురువు, త్రైత సిద్ధాంత కర్త, బహు గ్రంథకర్త. ఇతని అసలు పేరు గుత్తా పెద్దన్న చౌదరి. <ref name=":1"sakshi1>{{Cite news |archive-url=https://web.archive.org/web/2018091805353920180926184705/httphttps://epaperwww.sakshi.com/1821135news/Anantapurandhra-Mainpradesh/18prabodhananda-09ashram-2018#page/1/1anantapur-1118177 |title=ఇదీప్రబోధానంద ఆశ్రమం అసలు కథ|date=18 September 2018|url=httphttps://epaperwww.sakshi.com/1821135news/Anantapurandhra-Mainpradesh/18prabodhananda-09ashram-2018#page/1/1anantapur-1118177|publisher=సాక్షి|archive-date=2018-09-18|publisher=సాక్షి|url-status=dead26}}</ref> [[అనంతపురం జిల్లా]], [[తాడిపత్రి]] మండలం, [[చిన్నపొడమల]] గ్రామంలో ప్రబోధాశ్రమము, శ్రీకృష్ణమందిరము, [[ఇందూ జ్ఞాన వేదిక]]ను స్థాపించి తద్వారా తన రచనల్ని, ప్రసంగాలను ప్రచారం చేస్తున్నాడు. మనుషులందరికీ దేవుడు ఒక్కడేనని, [[భగవద్గీత]], [[బైబిల్]], [[ఖురాన్]]లలో వున్న దైవజ్ఞానము ఒక్కటేనని త్రైత సిద్ధాంతం అన్నది చెప్తోంది. ప్రబోధానంద ఈ సిద్ధాంతకర్త. పలు అంశాలకు ఈ సిద్ధాంతాన్ని వర్తింపజేస్తూ, తన ఆధ్యాత్మిక భావనలను వివరిస్తూ ప్రబోధానంద అనేక పుస్తకాలు రాశాడు. పెద్దన్న చౌదరి అన్న పూర్వనామం వదిలి ప్రబోధానందగా మారి త్రైత సిద్ధాంతాన్ని చెప్పడం 1978లో ప్రారంభమైంది. ప్రబోధానంద శిష్యులు 1978తో క్రీస్తుశకం ముగిసి త్రైత శకం ప్రారంభమైందని ప్రతీ సంవత్సరాన్ని ఈ త్రైత శకం లెక్కల్లో చెప్పుకుంటూంటారు..
 
ఇతని వివాదాస్పద అభిప్రాయాలు, బోధనల కారణంగా ఆశ్రమానికి దగ్గరలో ఉన్న ప్రజలతో వివాదాలు తలెత్తాయి.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/artical?SID=637444|title=ప్రబోధానంద ఆశ్రమ వివాదం: తనిఖీల్లో ఊహకందని విషయాలు వెలుగులోకి!!|date=2018-09-21|website=www.andhrajyothy.com|language=te|access-date=2019-09-17}}</ref> పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర రెడ్డితో ఉన్న రాజకీయ విభేదాల కారణంగాను,<ref name=":1"sakshi1 /> ఆశ్రమ వాసులు, స్థానికుల మధ్య జరిగిన ఘర్షణల కారణం గానూ 2018 సెప్టెంబరులో ఆశ్రమ ప్రాంతం ఉద్రిక్తతలకు లోనైంది. ఇతను 2020 జూలై 9న తన ఆశ్రమంలో అనారోగ్యంతో మరణించాడు.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20200709110756/https://www.eenadu.net/latestnews/prabodananda-die-with-illness/1600/120083949|title=అనారోగ్యంతో ప్రబోధానంద కన్నుమూత|date=2020-07-09|website=web.archive.org|access-date=2020-07-09}}</ref>
 
== జీవిత చరిత్ర ==
=== తొలినాళ్ళ జీవితం ===
1950లో జన్మించిన ప్రబోధానంద అసలు పేరు గుత్తా పెద్దన్న చౌదరి. స్వగ్రామం [[అనంతపురం జిల్లా]]కు చెందిన [[తాడిపత్రి]] మండలంలోని అమ్మలదిన్నెకొత్తపల్లి. మొదట్లో పెద్దన్న చౌదరి భారత సైన్యంలో వైర్‌లెస్ ఆపరేటర్‌గా పనిచేశాడు.<ref name="ప్రబోధానంద అసలు కథ-సాక్షి కథనం"sakshi1/> సమాజానికి దైవజ్ఞానము అందించాలి, అన్న అయన కోరిక మేరకు అధికారులు అతనిని సైన్యం నుంచి పంపించేశారు.<ref name="గుత్తా ఆత్మకథ">{{cite wikisource |author=ప్రబోధానంద యోగీశ్వరులు|authorlink=ప్రబోధానంద యోగీశ్వరులు |wslink=గుత్తా |chapter=ఆత్మకథ విషయపేజీలు |plaintitle=గుత్తా |year= 2012 |publisher=ఇందూ జ్ఞాన వేదిక }}</ref> తాడిపత్రి ప్రాంతానికి తిరిగివచ్చి ఆర్.ఎం.పీ. వైద్యునిగా పనిచేశాడు. మొదటి పెళ్ళి భగ్నమై, తర్వాత మల్లిక అనే మహిళను కులాంతర వివాహం చేసుకున్నాడు. క్రమేపీ [[ఆయుర్వేదం]] గురించి తెలుసుకుని, దానిపై పుస్తకాలు రాశాడు. ఆధ్యాత్మిక అంశాలపైనా గ్రంథ రచన కొనసాగించాడు.<ref name="ప్రబోధానంద అసలు కథ-సాక్షి కథనం"sakshi1/>
 
=== ప్రబోధానందగా మార్పు, ఆశ్రమం ఏర్పాటు ===
1978లో ప్రబోధానంద భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ గ్రంథాలు బోధిస్తున్నది ఒకటేనని అదే త్రైత సిద్ధాంతం అని తన ఆలోచనలకు సిద్ధాంత రూపం ఇచ్చాడు.<ref name="ప్రబోధానంద అసలు కథ-సాక్షి కథనంsakshi1/">{{Cite news |archive-url=https://web.archive.org/web/20180926184705/https://www.sakshi.com/news/andhra-pradesh/prabodhananda-ashram-anantapur-1118177 |title=ప్రబోధానంద ఆశ్రమం అసలు కథ|url=https://www.sakshi.com/news/andhra-pradesh/prabodhananda-ashram-anantapur-1118177|publisher=సాక్షి|archive-date=2018-09-26}}</ref> ప్రబోధానంద త్రైత సిద్ధాంతం గురించి రాయడం మొదలుపెట్టిన 1978 సంవత్సరం శకారంభమనీ, దాన్ని త్రైత శకమనీ అతని భక్తులు విశ్వసిస్తారు. 1980లో తన పేరును ప్రబోధానంద యోగీశ్వరులు అని మార్చుకుని, ప్రబోధానంద ఆశ్రమాన్ని స్థాపించాడు. ఈ సిద్ధాంతానికి పలు అంశాలు చేరుస్తూ రాముడు భగవంతుడు కాదనీ, కృష్ణుడు భగవంతుడనీ, రావణుడు ఆరాధనీయుడనీ, ఏసుక్రీస్తు, మహమ్మద్ ప్రవక్త బోధించినవీ, భగవద్గీత చెప్పినవీ ఒకటేనని పలు విషయాలపై తన సిద్ధాంతాలకు గ్రంథరూపం ఇచ్చాడు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వరుసగా అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలను ప్రతిపాదించారనీ, వారి కోవలోనే తాను త్రైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి బోధిస్తున్నాడని ప్రబోధానందను గురించి క్రమేపీ అతనికి ఏర్పడ్డ శిష్యులు, భక్తుల నమ్మిక. అలాగే ప్రముఖ తత్త్వయోగి, కవి [[పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి]] తన కాలజ్ఞానంలో చెప్పిన ప్రబోధానంద ఆశ్రమమం, దాని ఆనందగురువు తానేనని అతను, అతని శిష్యులు విశ్వసించసాగారు.<ref name="గుత్తా ఆత్మకథ"/>
 
=== రాజకీయ వివాదాలు, ఆశ్రమం తరలింపు ===
1990లో [[రాజీవ్ గాంధీ హత్య]] జరిగినప్పుడు సాగిన అల్లర్లలో తాడిపత్రిలోని బీజేపీ సానుభూతిపరులైనవారి దుకాణాలుపై దాడులు జరిగాయి. ఈ సమయంలో స్థానిక బీజేపీ నేత వేణుగోపాల్‌రెడ్డికీ, కాంగ్రెస్ నాయకులు జేసీ సోదరులకీ వివాదాలు జరిగాయి. వేణుగోపాల్‌రెడ్డికి ప్రబోధానంద రక్షణనిచ్చి, సహాయం చేశాడు. ఈ సందర్భంగా ప్రబోధానంద ఆశ్రమంపై దాడులు జరగడంతో అనంతపురానికి, ఆ తర్వాత బత్తలపల్లికి మార్చారు. ఓ దాడిలో ప్రబోధానంద ఆస్పత్రికి వచ్చిన మహిళ, అతని కుమారుడు చనిపోయారు. స్థితిగతులు ప్రతికూలంగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్ వదిలి కర్ణాటకలోని కంప్లి ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పాటుచేశాడు.<ref name="ప్రబోధానంద అసలు కథ-సాక్షి కథనం"sakshi1/>
=== ఇందూజ్ఞానవేదిక స్థాపన, చిన్నపొలమడలో ఆశ్రమం ===
దాదాపు 12 సంవత్సరాల పాటు అనంతపురం జిల్లా వదిలి కంప్లిలో జీవించిన ప్రబోధానంద తిరిగి అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని చిన్నపొలమడ గ్రామ సమీపంలో స్థలాన్ని కొనుగోలు చేసి ఆశ్రమాన్ని నిర్మించాడు. 2003లో త్రైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకు ఇందూ జ్ఞాన వేదిక అన్న సంస్థను స్థాపించాడు. అదే సంవత్సరం ప్రబోధానంద రాజకీయ స్పర్థను ఎదుర్కొంటూ చిన్నపొలమడలోని ఆశ్రమాన్ని పూర్తిచేసి, స్థిరపడ్డాడు. ఆ తర్వాత జ్యోతిష్యం-వాస్తు, దేవతలు-దయ్యాలు, మతాలు-కులాలు - ఇలా పలు అంశాలపై సాధారణమైన అవగాహనకు భిన్నంగా తనదైన పద్ధతిలో వ్యాఖ్యానాలు చేస్తూ త్రైత సిద్ధాంతానికి అనుబంధంగా పలు పుస్తకాలు రాశాడు. చినపొలమడలో అత్యాధునికమైన ముద్రణ ప్రెస్ పెట్టి తాను రాసిన పుస్తకాలను తెలుగు, పలు ఇతరభాషల్లో అనువాదాలు ప్రచురిస్తూ, అమ్ముతూ ఉన్నారు. అలానే ఆశ్రమానికి విరాళాలూ స్వీకరిస్తూంటారు. ప్రబోధానంద భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వచ్చింది. తాడిపత్రి మండలంలోనే 15 వేలమంది భక్తులు, అనంతపురం జిల్లా మొత్తంగా పాతిక వేలమంది భక్తులు ఉన్నారని అంచనా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనూ, అమెరికా, థాయ్‌లాండ్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ కూడా అతని భక్తులు ఉన్నారు. 2016-18 కాలంలో ప్రబోధానంద ఎక్కడ నివసిస్తున్నదీ తెలియదు. అతని బోధనలను వీడియో రికార్డు చేసి ఆశ్రమం తెరలపై ప్రదర్శించడం, యూట్యూబులోకి ఎక్కించడం చేస్తున్నారు.<ref name="ప్రబోధానంద అసలు కథ-సాక్షి కథనం"sakshi1/>
 
=== మరణం ===