అంగీరస మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 16:
శ్రీహరి బొడ్డునుండి [[బ్రహ్మ]] జన్మించాడు.ఈ బ్రహ్మ కుమారుడు అంగిరసుడు తండ్రి ఆదేశానుసారం తపస్సు ప్రారంభించాడు.అంగిరసుడు దివ్వ తేజోసంపన్నుడు తపశ్శక్తిచే ఇంకను తేజస్సు సంపాదించాడు.అంగిరసునకు సర్వశక్తులు లభించాయి.అయినా నిగర్విగానే సంచరిస్తున్నాడు.అతడు లబ్ధుడు కాదు,సర్వసంగ పరిత్యాగి.త్యాగమును సంతోఫ మున్నదని గ్రహించాడు.<ref>[http://www.sacred-texts.com/tantra/maha/maha00.htm Inhabitants of the Worlds] Mahanirvana Tantra, translated by Arthur Avalon, ([[John Woodroffe|Sir John Woodroffe]]), 1913, Introduction and Preface. The Rishi are seers who know, and by their knowledge are the makers of shastra and "see" all mantras. The word comes from the root rish Rishati-prapnoti sarvvang mantrang jnanena pashyati sangsaraparangva, etc. The seven great Rishi or saptarshi of the first manvantara are Marichi, Atri, Angiras, Pulaha, Kratu, Pulastya, and Vashishtha. In other manvantara there are other ''sapta-rshi''. In the present manvantara the seven are '''Kashyapa''', Atri, Vashishtha, Vishvamitra, Gautama, Jamadagni, Bharadvaja. To the Rishi the Vedas were revealed. Vyasa taught the Rigveda so revealed to Paila, the Yajurveda to Vaishampayana, the Samaveda to Jaimini, Atharvaveda to Samantu, and Itihasa and Purana to Suta. The three chief classes of Rishi are the Brah-marshi, born of the mind of Brahma, the Devarshi of lower rank, and Rajarshi or Kings who became Rishis through their knowledge and austerities, such as Janaka, Ritaparna, etc. Thc Shrutarshi are makers of Shastras, as Sushruta. The Kandarshi are of the Karmakanda, such as Jaimini.</ref>
==జీవిత విశేషాలు==
ఆ అంగీరసుడు కర్దమ ప్రజాపతి కుమార్తెయగు శ్రద్ధను [[పెళ్ళి|వివాహం]] చేసికొన్నాడు.శ్రద్ధా అంగీరసులను దేవతాగణాలు ఆశీర్వదించాయి.అత్తమామల ఆశీస్సులు గొని ఈ నూతనదంపతులు తమ ఆశ్రమమునకు వెళ్ళిపోయారు.ప్రశాంతంగా గృహస్ధ జీవితము గడుపుతున్నారు. కాలక్రమాన ఆ దంపతులు ఏడుగురు కుమారులను ఏడుగురు కుమార్తెలను కన్నారు.వారివల్ల అంగీరసుని వంశము పెరిగి విశ్వమంతము ప్రాకినది.దేవతలపై అగ్నిహోత్రుడు కోపించి తన విద్యుక్త ధర్మములు నిర్వర్తింపక రహస్యముగ ఏకాంత వాసం చేయసాగాడు.ఈ విషయమును దేవతలు భ్రక్ష్మ్మీకు తెలయజేయగా లంగీరసుని పిలిపించి అగ్నిహోత్రుని విధులను నిర్వహించమని ఆదేశించాడు.తండ్రి ఆజ్ఞను శిరసావహించి అంగీరసుడు [[అగ్నిదేవుడు|అగ్నిదేవు]]<nowiki/>ని విధులు నిర్వర్తిస్తున్నాడు.అగ్ని లేని లోపం తీరుస్తున్నాడు. అగ్నిదేవుని మరచి అంగిరసుని పూజిస్తున్నారు. దేవతా గణాలు ఆ విషయం అగ్నిహోత్రునకు తెలియగా తనకు నామరూపాలుండవని గ్రహించి అంగిరసుని వద్దకు వచ్చి తన పనులు తానే నిర్వహించగలనని పలికాడు.అంగిరుడు అంగీకరించి అగ్నిహోత్రునే ఆ విధులు నిర్వర్తించమన్నాడు.అగ్ని సంతసించి అంగీరసునకు ద్వితీయాగ్ని స్ధానమిచ్చి సత్కరించాడు. అంతే కాదు అంగీరసుని కుమారుడగు బృహసృతికి తృతేయాగ్ని స్దానం ఏర్పరిచాడు.అది అంగిరసుని ఘనతకు నిదర్శనం.
పూర్వకాలమున చిత్రకేతుడను రాజు గలడు.అతడు శూరసేన దేశమును పాలించుచుండెను. సర్వసంపదలు గల ఆ రాజుకు సంతానము లేదు. సంతానహీనుడైన ఆ రాజు శాంతిలేక జీవిస్తున్నాడు. ఒకనాడు అంగిరసుడు ఆ రాజు సందర్శనార్ధం వచ్చాడు.చిత్రకేతుడు ఆ మహర్షిని ఆదర్శపూర్వకంగా ఆహ్వానించాడు.భార్యవహితుడై సేవించాడు.మహర్షి సంతసించి రాజు సంతానహీనుడని గ్రహించి పుత్రకామేష్టి చేయించి పట్టమహిషియగు కృతద్యుతి గర్భం దాల్చునట్లు చేశాడు.రాజు పరమానందభరితుడై అయాడు. మాసములు నిండగా ఆమె ఒక కుమారుని కన్నది కాని తక్కిన రాణులు ఈర్ష్యతో ఆ బిడ్డకు విషమిచ్చి చంపారు.రాజు దు:ఖము పెరిగింది.ఆ దంపతులు బిడ్డ మరణానికి దు:ఖించ సాగారు.
ఆ విషయము అంగిరసునకు తెలిసింది. ఆయన నారద మహర్షి వెంటబెట్టుకుని చిత్రకేతుని వద్దకు వాచ్చడు.పుత్రశోకంతో కుమిలిపోయే ఆ రాజదంపతులను సమీపించి చావు పుట్టకలు జీవికి సహజమని అందుకై విచారింపరాదని ధైర్యం చెప్పి తత్వభోద చేశాడు. అనంతరం రాజు వద్ద సెలవు తీసికొని తిన్నగా బ్రహ్మలోకం చేరుకున్నాడు. అంగిరసుడు ఒకప్పుడు కశ్యపమహర్షి వలన పుణ్యక్షేత్రముల మహిమ నెరిగి గౌతమమహర్షి వలన వాటి ప్రభావమును తెలిసికొని వరుసగా చంద్రభాగ, హిరణ్యబిందు, ఇంద్రతోయ,కరతోయ,అపాంహ్రదము, మహాశ్రయ,భృగుతుంగ, కన్యాకూప,సుందరికాహ్రద, వైమానిక,విపాశ, కాళాకాశ్రమము, ద్రోణశర్మ పదము, శరస్తంభము, దేవరారువనము, చిత్రకూటము, జన్మస్ధానము,శ్యామాశ్రము, కౌశికవాల,మతంగ వాపిక, నైమికము, ఉత్పలావనము, వైవస్వతి, లౌహిత్య, రామహ్రదము, మహాహ్రాద, నర్మద, జంబూనది, కోకాముఖ, కండులికాశ్రమము, కుల్య, ఆర్షి సేవశ్రమము,ధర్మారణ్యము, బ్రహ్మసరస్సు మొదలైన పుణ్యక్షేత్రములు తిరిగి వాటిని గురించి గౌతములను తెలిపి అంగిరసుడు ఆనందించాడు.
"https://te.wikipedia.org/wiki/అంగీరస_మహర్షి" నుండి వెలికితీశారు