ఆనాటి వాన చినుకులు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఈ పుస్తకంలోని కథలు: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 31:
అవును. నిజమే. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు వంశీయే ఈ కథల [[రచయిత]].
 
'''ఆనాటి వానచినుకులు ''' పుస్తకాన్ని '''[[ఎమెస్కో]]''' వారు మొదట పదహారు కథలతో ఫిబ్రవరి 2003లో ప్రచురించారు.తిరిగి మార్చి 2008లో మరికొన్ని కథలను చేర్చి 23 కథలతో '''ఆనాటి వానచినుకులు''' అనే పేరుతో 2008లోద్వితీయ ముద్రణ చేశారు.పుస్తకము అట్ట మీది [[బొమ్మ]]<nowiki/>లను '''[[బాపు]] '''గారు గీయ్యగా, లోపలి కథలకు '''అన్వర్ ''', '''ఎన్.వి.వివేక్‍ఆనంద్ ''' లు అందించారు.ఈ పుస్తకాన్ని రచయిత వంశీ ...'''ఔను..వీళ్లిద్దరికీ ఇష్టంగా''' అంటూ శ్రీ వేమూరి బలరామ్, శ్రీ వేమూరి సత్యనారాయణ గార్లకు అంకితమిచ్చాడు.తిరిగి అక్టోబరు 2010లో మరికొన్ని కథలను చేర్చి 32కథలతో '''ఆకుపచ్చని జ్ఞాపకం''' అనే పేరుతో ముద్రణ చేశారు
 
'''వంశీ రాసిన ఈ కథల గురించి..'''అంటూ '''[[ఇంద్రగంటి శ్రీకాంత శర్మ|ఇంద్రగంటి శ్రీకాంతశర్మ]] '''గారు చక్కని ముందుమాటలను రాసారు.
పంక్తి 37:
ఇంద్రగంటి గారి మాటలలో''' వంశీ....'''
 
''ఎలాచూడాలో.ఎక్కడచూడాలో,ఎందుకు చూడాలో,చూపించడం మంచిరచనకు,మంచి రచయితకు ప్రమాణమనుకుంటాను......ఇన్ని వాక్యాల నాఘోష సారాంశం,పాండిత్య ప్రగల్భతకంటె ప్రత్యక్ష జీవితానుభవ ప్రగల్భత ఎప్పుడూ గొప్పదని.ఇందుకే యీ కథలరచయిత,వంశీ అంటే గౌరవము.ఇంకొందుకు కూడా ఈయన కథలపట్ల గౌరవము.ఇవి ఆరుబయళ్లలలో,కొండ కోనల్లో,గోదావరి వడిలో,పల్లెల వీథుల్లో,వెన్నెల్లో.వానల్లో తిరిగినవి,తడిసినవి,తనిసినవి.....ఈయనకు [[జీవితం]]<nowiki/>లోని రాగవైరాగ్యాలు,అందాలు,వికారాలు పుష్కలంగా తెలుసు.మనుష్యుల్ని వాళ్ళ బలహీనతలతో సహా ప్రేమించడం తెలుసు.వెన్నెల వర్షం,గోదావరి,అంతగా అనుభవించి పలవరించడం బహుశా చాలా కొద్ది మంది రచయితలు చేసి వుంటారు.....సంగీతమంటే ప్రాణంపెట్టె వంశీ,కవిత్వం జోలికి-పోనీ,కవిననిపించుకుందామనే కోరిక జోలికి-పోయిన జాడలు కనిపించవు......వంశీ,కవిత్వహృదయంతో కథలు చెపుతారని మీకు యీ కథలు చెపుతాయి.ఈ కథల్లో ముఖ్యమైన ఆకర్షించే బలం,ఈ రచయిత ఆయా మనుష్యుల్ని చూపిస్తూ చిత్రించే వాతావరణం.ఈ DETAIl వీటి ప్రాణం.వంశీలో ఒక ECENTRIC భావుకత్వం(UNCONVENTIONAL AND STRANGEఅని నా ఉద్దేశం)'శిల,'బొత్తిగా అర్థంకాని మనిషి''కల వంటి కథల్లో పై చెయ్యిగా కన్పిస్తుంది.ఈయన వెల్లడించే వర్షాలు, రాత్రులు, [[వెన్నెల]], గోదావరి రేవులు, ఇసుక బయళ్ళు PICTURESQUE గా వుండి, కవిత్వానుభవాన్ని పంచి పెడతాయి.మట్టినీ, గాలినీ ప్రేమింపజేస్తాయి.ఒక్కొక్కసారి, కథను పాత్రలు నడిపితే, ఒక్కొక్కసారి అనుభవాల వత్తిడిలోనుంచి కోలుకునే ప్రయత్నంగా, తన నుంచి తన్ను విముక్క్తం చేసుకోవడానికా!అన్నట్లుగా, వంశీ తానే [[కథ]]<nowiki/>ను నడుపుతాడు.జీవితాన్ని అన్ని రకాల ఒడిదుడుకులతో ప్రేమించే కథలంటే నాకిష్టం.బహుశా చాలా మంది కిష్టం.వంశీ అటువంటి, ఇటువంటి కథలు రాసినందుకు నాకిష్టం.''
 
ఇందులోని కథలు 1975నుండి 2007 వరకు వ్రాసినవి.ఈ కథలలో మూడు, నాలుగు కథలు తప్ప మిగిలినవన్ని [[ఆంధ్రజ్యోతి]], [[స్వాతి వారపత్రిక]] లలో అచ్చయ్యినవ్వే.
పంక్తి 52:
 
===బాచి===
'''బాచి:'''బాచి రచయితకు మిత్రుడు.బాచి తత్వమేమిటో వూర్లో వారికే కాదు, రచయితకు కూడా పూర్తిగా తెలియదు.అతడుచేసే పనులు అలాంటివి.ఒకసారి నిద్రపోతున్న వాళ్ల నాయనమ్మ బంగారపుమురుగుని సబ్బుబిళ్లరుద్ది లాగేసి [[ద్రాక్షారామం|ద్రాక్షారామ]]<nowiki/>మ్లోని బేబి అనే టీచరుకిచ్చాడు.ఆమేకు భర్తలేడు.ఇద్దరు పిళ్లలు.పేళ్ళాడతానని కొన్నాళ్ళు వెంటతిరిగాడు.మరోసారి ఆదిరెడ్డిగారి కోడలికి దయ్యం పవిడిపించటానికొచ్చిన భూతవైద్యుని పళ్ళూడకొట్టాడు.మురమళ్ళలోని బాలింతరాలికి కాంపు కష్టమైతే రాజమండ్రి తీసికెళ్లి వైద్యం చేయించాడు.మరోసారి చిట్తిపంతులుగారింటి వెనుక పడిపోయిన గోడలలో పాము చేరితే దాన్ని పట్తుకొని, సాయంత్రం వరకు గుడి అరుగు మీద ఆడించి ఆతరువాత వూరిచివర సమాధి వద్ద వదలి వేశాడు.వూరివాళ్ళ దృష్టిలో తింగర మనిషి.బాచి స్నేహితుడు/రచయిత మద్రాసు వెళ్ళిపోయి, 20 సంవత్సరాల తరువాత ఆ వూరువచ్చినప్పూడు బాచి గురించి ఆరా తీస్తాడు.కపాలేశ్వరుడు గుడి వుద్యోగి చెల్లెల్తో ఊరువిడచి వెళ్ళిపోయడని వూర్లోజనంచెప్తారు.ఆలా ఎందుకు చేసాడని అడగగా 'ఆ మదపిచ్చోడి గురించి చెప్పెదేముందంటారు.ప్రస్తుతం బాచి యానాం రేవుకు పదిమైళ్ల దూరంలోని పిచ్చుకల లంకలో వుంటున్నట్లు తెలుసుకొని రచయిత అక్కడికి వెళ్తాడు.అక్కడ తిప్ప అంచున వుంది బాచి ఇళ్లు. రచయిత మాటల్లో'''....ఆ ఇసుక తిప్ప మధ్యలో నిలబడి ఎటుచూసినా గోదావరే కనిపిస్యున్నది.పచ్చి ఇటుకల గోడల్ని పేడతో అలికి సున్నం ముగ్గులు పెట్టి, పైన రెల్లు గడ్దితో నేసిన కుటీరం ఒకటి తిప్ప అంచుననే ఉంది.పచ్చి వెదుళ్లతో చుట్టూ కట్టిన దడికి ఒక మూల చుక్కుడుపాదూ, ఇంకోమూల పుచ్చ పాదూ పాకి వున్నాయికుటీరం వెనకాల తులసికోటా, దానికి కాస్త దూరంలో గోరింటాకు మొక్కా, కరివేరపూలమొక్క ఉన్నాయి.'''కుటిరంలో వున్న ఆడు మనిసి నల్లబోర్డరున్న బూడిదరంగు చీరకట్తుకుంది.అడ్డపాపిటతీసి, జడవేసుకొని పెద్ద కుంకుమ బొట్తు పెట్తుకునివుంది.ఆమెకు కుడికాలు లేదు.బాచి మిత్రున్ని [[సంతోషం]]<nowiki/>గా ఆహ్వనించి అథితి సత్కారంచేసాకా, ఇలా ఎందుకు జరగిందని అడుగుతాడు.బాచీ జరిగింది చెప్పాడు.ఉళ్ళో కొవ్వూరి రాములు, సంఛారతెగకు చెందిన వెంకటలక్ష్మిని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి, వాళ్ల పొలంలోని పాకలో వుంచి, బిడ్దపుట్టగా, ఆబిడ్డనోట్లో వడ్లగింజలు వేసి చంపగా, అదితెలుసుకున్న బాచీ పంచాయితి పెట్టించి, వెంకటలక్ష్మి మెళ్ళో రాములు చేత మూడు మూళ్లు వేయించాడు.ఆ విధంగా వూర్లోని అగ్ర కులాలవారి కోపానికి గురైనాడు.రెండు మూడ దపాలు చంపించాడానికి ప్రయత్నింఛారు.అదృష్టవశాత్తు ఆచి తప్పించుకున్నాడు.కపాలేశ్వరస్వామి [[దేవాలయం]]<nowiki/>లో ఈ వుద్యోగి చెల్లెలికి షుగరు వ్యాధి వచ్చి కాలు తీసెస్తే భర్త వదిలేశాడమెని.బాచి మీద పగ పెంచుకున్న వూరిజనం ఏ ఆధారంలేని వుద్యోగి చెల్లెల్ని పెళ్ళిచేసుకొని దారి చూపించు అని బాచిని రెచ్చ గొట్టారు.ఆలోచించిన బాచి, ఆమెదగ్గరకు వెళ్లి మాట్లాడక, ఆమెను రాములవారి [[గుడి]]కి తీకెళ్లి పెళ్ళి చేసుకున్నాడు.ఈ విషయం తెలిసిన ఇంటివాళ్లు వెలి వెయ్యగా, ఇక్కడకు వచ్చి, తనకు నచ్చిన వాతావరణన్ని నిర్మించుకుని వుంటున్నాని చెప్పుటాడు.రచయితకు మిత్రున్ని మనస్సెమిటో తెలుస్తుంది.రచయిత తిరుగు ప్రయాణమైతున్నప్పుడు
 
బాచీ'''"నాలాంటి వాణ్ణి చూడ్డానికి చాలా దూరం వచ్చావు నువ్వు"'''అంటాడు.
పంక్తి 81:
కృష్ణారావు [[పతంజలి]] సెక్రెటరి.తూ.గో.జిల్లా.ఐనవరం మండలానికి చెందిన, మారు మూల గ్రామం గంధంవారి పాలెంకు చెందిన ఎస్.ఎస్.నారాయణరావుకు పతాంజలి అంటే వీరాభిమానం.పట్టు వీడక వుత్తరాలు రాసేవాడు. కృష్ణారావు ఎలాగోలా పతంజలిని ఒప్పించి ప్రత్యుత్తరం ఇప్పిస్తాడు.ఆవుత్తరం చూసిన గంధంవారి పాలెం ప్రజలు అబ్బురపడి, అందరు ముకుమ్మడిగా [[రాజమండ్రి]] వెళ్ళి, ఆయన తీసిన సినిమా చూసి, వూరంతా ఆయన అభిమానులై పోయి, పతంజలికి తమగ్రామంలో సన్మానం చేయాలని తీర్మానించి, ఆ అభ్యర్థనను, నారాయణరావు వుత్తరంద్వారా తెలియపర్చారు.వీలాంటి వాటికి దూరంగా వుండే పతంజలి మొదట నిరాకరించినప్పటికి, కృష్ణారావు బలవంతం మీద ఒప్పుకుంటాడు.గంధంవారిపాలెంకు నేరుగా రవాణా సౌకర్యం లేదు.రాజమండ్రి వరకు ఎక్సుప్రెసు రైలులో వచ్చి, అక్కడినుండి బలభద్రపురం వరకు ప్యాసింజరు రైలులో, అక్కడినుండిరాజానగరంవెళ్ళెబస్సులో కొంతదూరం వెళ్ళి, అక్కడినుండి మూడుమైళ్ళు మట్టిరోడ్దులో ప్రయాణిస్తేకాని గంధంవారి పాలెం చేరలేము.రాజమండ్రినుండి ఎర్రబస్సు దిగే వరకు పతంజలి ప్రయాణం అసౌకర్యంగా, అపరిశుభ్ర పరసరాలచుట్టు జరిగింది.ఇవన్ని చూసాకా పతంజలికి ''పరిశుభ్రత,భావుకత''విషయంలో తనకు మొదటినుండి వున్న అభిప్రాయమే కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చేశాడు.బస్సు దిగిన తరువాత గంధం వారిపాలెంకు వెళ్ళటానికి ఎటు వంటి ఆటోలు, టాక్సీలు లేవు.ఒక రిక్షా తప్ప.
 
''చెప్పులు లేకపోయినా చాలా పరిశుభ్రంగా ఉన్నాయికాళ్ళు,చలువ చేయించి కట్టుకొన్న ఖాకీ నిక్కారూ మోచేతుల దాకా మడచిపెట్టిన రంగు వెలసిన గళ్లచొక్కా,నున్నగా గీసుకున్న గడ్డం,నూనె రాసుకుని దువ్వెనతో చక్కగా దువ్వుకున్న క్రాఫ్‍తో వున్నాడు రిక్షావాడు.పేరు గోపాలం.బండిని పతంజలి దగ్గరకు లాక్కొచ్చినప్పుడు అతని శిరస్సు నుంచి శిరిపాదం వరకూ పరిశీలించి చూచిన పతంజలికి ఎంత స్వచ్చంగా వున్నాడీ మనిషి అనిపించింది''.రిక్షాలో ముందు రెండు పెద్ద సూట్‍కేసులుండటం వలన, కాళ్ళు పెట్టుకొనుటకు ఇబ్బందిగా వుండటంతో, కాలినడకనే వెళ్ళుట మేలని ఎంచి, లగేజితో వున్న [[రిక్షా]]<nowiki/>ను ముందువెళ్ళమంటారు.రిక్షా వాళ్లను క్రాస్ చేసుకు వెళ్లుండగా, రిక్షా సైన్ బోర్డు పై రాసిన వాక్యం చదువుతాడు పతంజలి.
 
'''ఆనాటి వాన చినుకులు.'''
 
''"ప్రాణమున్న శిల్పంలా నిలబడి పోయాడు పతంజలి....ఆ [[భాష]]<nowiki/>లో భావాలు భాస్వరంలా వెలుగుతున్నాయి.ఏ ప్రేయసి కరుణిస్తే హర్షించాయో ఆవాన చినుకులు.ఏ ప్రేయసి మరణిస్తే వర్షించాయో ఆవాక్యాలు.ఏ ఉర్వశి నిర్ధయతో నిందింస్తే నిర్మింపబడ్దయో ఆవాన చినుకులు.ప్రకృతి పరవశించినప్పుడా?విరహం వికటించినప్పుడా?గజ్జెలు కట్టిన లేగదూడ ఘలం ఘలించినప్పుడా?''
 
ఆనాటి వానచినుకులు-ఎన్ని అర్ధాలు నిక్షిప్తమైఉన్నాయి ఆ వాక్యంలో.ఎంతమంది బైరన్‍లూ, [[దేవులపల్లి కృష్ణశాస్త్రి|కృష్ణశాస్ర్తులూ]] దాక్కుని ఉనారు ఆ వాక్యంలో....ఈ మారుమూలనున్న ఒక అజ్ఞాని గుండెల్లోంచి వెచ్చగా వెలుపకొచ్చిందా వాక్యం.
"https://te.wikipedia.org/wiki/ఆనాటి_వాన_చినుకులు" నుండి వెలికితీశారు