ఎల్. ఆర్. ఈశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: ె → ే (6), గాయిని → గాయని, → (2), , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 15:
| Years_active = 1950s-1980s
}}
'''ఎల్. ఆర్. ఈశ్వరి''' ప్రముఖ నేపథ్య గాయని. ఈమె [[మద్రాసు]]లో ఒక రోమన్ [[కాథలిక్]] [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో [[డిసెంబరు 8]]వ తేదీన జన్మించింది. ఈమె తండ్రి మద్రాసులో స్పెన్సర్స్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసేవాడు. ఈమె ఐదేళ్ళ వయసులో అతడు మరణించాడు. ఈమె తల్లి నిర్మల కుటుంబభారాన్ని మోసింది. ఆమె మంచి గాయని కావడంతో సినిమాలలో అవకాశం లభించినప్పుడల్లా కోరస్ బృందాలకు పాడింది. ఆ సమయంలో తల్లితో పాటు ఈమె కూడా రికార్డు స్టూడియోలకు వెళ్ళేది. ఆ సమయంలోనే ఈమెకు కూడా కొన్ని చిత్రాలకు కోరస్ బృందంలో పాడే అవకాశం వచ్చింది. ఈమె పూర్తి పేరు "లూర్డ్ మేరీ". ఈమె బామ్మ హిందూ కావడంతో "రాజేశ్వరి" అని పిలిచే వారు. ఈమె తన తల్లి, తండ్రి ఇరువైపుల బంధువులను తృప్తి పరచడానికి తన పేరును లూర్డ్ రాజేశ్వరిగా మార్చుకుంది. అప్పటికే తమిళ సినీరంగంలో ఒక రాజేశ్వరి గాయనిగా చలామణీలో ఉన్నందుకు [[తమిళ]] చిత్ర నిర్మాత ఎ.పి.నటరాజన్ ఈమె పేరును సినిమాల కోసం టూకీగా ఎల్. ఆర్. ఈశ్వరిగా మార్చాడు. ఈమె [[తమిళం]], [[తెలుగు]], [[కన్నడం]], [[మళయాళం]], [[హిందీ]], [[తుళు]], ఆంగ్ల భాషలలో కొన్ని వేల పాటల్ని పాడింది.
 
ఈమెను మొదటగా [[కె.వి.మహదేవన్]] గుర్తించి, "నల్ల ఇడత్తు సంబంధం" (1958) అనే [[తమిళ]] సినిమాలో మొదటి సారిగా సోలోగా పాడే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఆ చిత్రం విఫలం కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. కాని "పాశమలార్" (1961) సినిమాతో ఆమెకు మంచి గాయనిగా పేరొచ్చింది. తర్వాత కాలంలో ఆమె ఎక్కువగా [[చెళ్ళపిళ్ళ సత్యం]] దర్శకత్వంలో తయారైన ఎన్నో క్లబ్ సాంగ్స్, ఐటమ్ నంబర్లకు పాడింది. ఈమె ఎక్కువగా [[జ్యోతిలక్ష్మి]], [[జయమాలిని]], [[సిల్క్ స్మిత]] మొదలైన నాట్యకత్తెలకు పాడింది. వీరే కాకుండా [[విజయలలిత]], [[లక్ష్మి]], [[సరిత]] వంటి యువ నటీమణులకు కూడా తన గళాన్ని దానం చేసింది. ఈమె మొత్తం 14 భాషలలో పాడింది.
 
ఈమె వ్యక్తిగత జీవితం మాత్రం విషాదమే. [[పేదరికం]]<nowiki/>లో జీవించిన ఈమె [[కుటుంబము|కుటుంబం]] కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసింది. [[అవివాహిత]]గానే ఉండిపోయి, సమాజం నుండి అంతగా గుర్తింపుకు నోచుకోలేదు.
 
ఈమెకు తమిళనాడు ప్రభుత్వం 1984లో [[కళైమామణి]] అవార్డు ప్రదానం చేసింది.
"https://te.wikipedia.org/wiki/ఎల్._ఆర్._ఈశ్వరి" నుండి వెలికితీశారు